తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ప్రవళిక వంటి యువత ఆత్మహత్యలు జరగకుండా చూస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అత్యంత అవినీతిమయ ప్రభుత్వం కేసీఆర్దే అన్నారు. అధికారంలోకి రాగానే సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఓవైసీ ఒత్తిడికి లొంగి కేసీఆర్… రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో ఉమ్మడి ఏపీకి రూ.2 లక్షల కోట్లు ఇస్తే, మోదీ ప్రభుత్వం ఒక్క తెలంగాణకే రూ.2.5 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు. ప్రధాని మోదీ ఓబీసీలకు సముచిత స్థానం కల్పించారు. ఎంబీబీఎస్ సీట్లలో బీసీలకు 25శాతం రిజర్వేషన్లు కల్పించామని అమిత్ షా వివరించారు.
Warangal
తెలంగాణాలో రేపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. పినపాక, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ ,రాజేంద్ర నగర్ లలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అదేవిధంగా రేపు మధ్యాహ్నం టీ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నారు. ఆ తర్వాత కుత్బుల్లాపూర్ ఎన్నికల ప్రచారం లో ఖర్గే పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా సినీ నటి, బిజెపి నాయకురాలు విజయశాంతి ఖర్గే సమక్షంలో పార్టీలో చేరనుంది. విజయశాంతికి మెదక్ ఎంపీ స్థానం తో పాటు సముచిత గౌరవం ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి వరంగల్ లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో బరిలో నిలిచిన 216 మంది అభ్యర్థులు వరంగల్ తూర్పులో పోటీ నుంచి తప్పుకున్న బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రాజనాల శ్రీహరి. వరంగల్ తూర్పు సెగ్మెంట్లో పోటీలో నిలిచిన 29 మంది అభ్యర్థులు. పరకాల బరిలో 28 మంది అభ్యర్థులు. వర్ధన్నపేట బరిలో 14 మంది అభ్యర్థులు. నర్సంపేట బరిలో 19 మంది అభ్యర్థులు. జనగామ బరిలో 19 మంది అభ్యర్థులు. పాలకుర్తి బరిలో 15 మంది అభ్యర్థులు. స్టేషన్ ఘనపూర్ బరిలో 19 మంది అభ్యర్థులు. ములుగు బరిలో 9మంది అభ్యర్థులు. భూపాలపల్లి సెగ్మెంట్ బరిలో 23 మంది అభ్యర్థులు. మహబూబాబాద్ సెగ్మెంట్ బరిలో 12మంది అభ్యర్థులు. డోర్నకల్ సెగ్మెంట్ బరిలో 14మంది అభ్యర్థులు. వరంగల్ పశ్చిమ బరిలో 15మంది అభ్యర్థులు. వరంగల్ పశ్చిమ నుండి నామినేషన్ ఉపసంహరించుకున్న ఏఐఎఫ్ బీ అభ్యర్థి జంగా రాఘవరెడ్డి.
వరంగల్ జిల్లాలో మళ్ళీ నకిలీ విత్తనాల దందా జోరుగా కొనసాగుతోంది. గతంలో నకిలీ విత్తనాలపై వరుస కథనాలు ప్రసారం చేసి ఉమ్మడి జిల్లాలో 15 ఫెర్టిలైజర్ షాప్స్ సీజ్ చేయించిన సీవీఆర్ న్యూస్తా జాగా నర్సంపేటలో నకిలీ విత్తనాల దందా బాగోతం బయటపడింది. మంగళ సీడ్ MTU 1224 రకం విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. పట్టణంలోని బాలాజీ కిసాన్ ఫెర్టిలైజర్ షాప్ లో విత్తనాలను కొనుగోలు చేసినట్టు రైతులు తెలిపారు. సరైన సమయంలో విత్తనాలు ఫీడింగ్ రాలేదని షాపు యజమాని పై రైతుల ఆగ్రహించారు. షాప్ కు తాళం వేసి ఆందోళన నిర్వహించారు.
ట్రాన్స్ జెండర్స్ ను అవమానపరిచే విధంగా వాక్యాలు చేయడం సరైనది కాదని.. కెసిఆర్, కేటీఆర్ సూచనల మేరకే ట్రాన్స్ జెండర్స్ ను అవమానపరిచావా..? వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిలిచిన మిగతా అభ్యర్థులు మగవారు కాదా అని సూటి ప్రశ్న.. బీఎస్పీ తరఫున ఒక ట్రాన్స్ జెండర్ బరిలో నిలిచి ఉంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులు తట్టుకోలేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని.. తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే శ్రీహరి ఇల్లు ముట్టడిస్తాం.. మా ట్రాన్స్ జెండర్స్ అందరం ఐక్యమై నీ అంత చూస్తామని సవాల్ చేశారు.
వ్యక్తిగత స్వార్ధ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతూ, అధికారాన్ని చేజిక్కించుకొని ధనవంతులుగా మారి అహంకారంతో బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్న వారిని ఓడించాలని సిపిఎంఎల్ ప్రజాపంద ఇల్లందు ఇండిపెండెంట్ అభ్యర్థి గుమ్మడి అనురాధ.. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద పార్టీ కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం గుమ్మడి అనురాధ మాట్లాడుతూ.. ఇల్లెందుకు ఉన్న చారిత్రాత్మక నేపథ్యాన్ని విస్మరించి కొందరు స్వార్ధపరులు గెలిచిన తర్వాత ఇల్లందును స్వార్థ రాజకీయాలకు నిలయంగా మార్చారని అన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు బిఆర్ఎస్ అభ్యర్థులేనని అన్నారు. వారు గెలిచిన తర్వాత అధికార పార్టీలోకి ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధి కోసమే మారుతున్నామని చెప్పి గెలిసిన ప్రజలను మోసం చేసి వారి అభివృద్ధి కోసమే అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారని అన్నారు … బయ్యారం ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఏ మాత్రం కృషి చేయని కనకయ్య, హరిప్రియలకు ప్రజలు మరోసారి అవకాశం కల్పిస్తే ప్రజలు మరోసారి మోసానికి గురికాక తప్పదని వారన్నారు… ఇప్పటివరకు గెలిచిన ఎమ్మెల్యేలు అభివృద్ధి అంటే మొక్కలు నాటడం సెంట్రల్ లైటింగ్ రోడ్ల లాంటి వాటినే అభివృద్ధి నమూనాగా చూపించారు, శాశ్వత అభివృద్ధి చేయకుండా కుంటి సాగుతో దాటివేసారని ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారం మండలంలోని పెద్ద చెరువు కు సీతారామ ప్రాజెక్టు నీటిని నింపుటకు ఒక డిజైన్ ఏర్పాటు చేస్తే అదే బిఆర్ఎస్ పార్టీలో ఉన్న మరో లీడర్ బయ్యారం చెరువుకు నీళ్లు రాకుండా వేరే ప్రాంతం నుండి బయటికి మార్చిన స్థితి ఇక్కడ కనపడుతుంది ఇదేనా మీరు బయ్యారం ప్రాంతానికి చేసిన అభివృద్ధి అని అన్నారు .ఇక్కడ అనేక ఉద్యమాలతో సాధించుకున్న పోడు భూములకు పట్టాలి ఇవ్వకపోగా హరితహారం పేరుతో ఆ భూములను గుంజుకొని గిరిజనులను అడవి నుండి గెంటేసే పరిస్థితి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం వెలుగులో వారి సమస్యల కోసం పోరాటాలకు ముందుకు రావడానికి ఒక విద్యావంతురాలుగా ముందుకు వచ్చారని అన్నారు. బయ్యారం మండల ప్రజలు నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు..
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి వద్ద జాతీయ రహదారి పై హైదరాబాద్ వైపు వెళ్తున్న ఇసుక లారీ అదుపు తప్పి చెట్టుని ఢీ కొట్టగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ మాత్రం క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు, ఇప్పటికే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని , లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ ను కాపాడే ప్రయత్నాలు అవుతే చేస్తున్నారు, ఈ లారీ లో మృతి చెందిన వ్యక్తి లిఫ్ట్ అడిగి లారీ ఎక్కినట్టుగా సమాచారం, మృతుడు మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన పెద్ద సమ్మయ్య గా గుర్తించిన పోలీసులు తమ బంధువులకు సమాచారం ఇచ్చారు, క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను బయటకు తీసే ప్రయత్నం లో ఏటూరునాగారం పోలీసులు ఉన్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా తెలంగాణకు రానున్నారు. సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్లో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఆ తర్వాత నల్గొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్లలో నిర్వహించే సభలలో పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా 17న తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే 18కి వాయిదా పడింది.
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ, భద్రాచలం నియోజవర్గ ఇన్చార్జి అయిన తాత మధు మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేశారో, మీకు ఛాలెంజ్ దమ్ముంటే రా, ప్రజల ముందుకొచ్చి భద్రాచలం నియోజకవర్గానికి మీరు మీ పార్టీ ఏమి అభివృద్ధి చేశారో, అని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఏ వేదిక పైనా అయినా మీ సిద్ధం అంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పొదెం వీరయ్య కు సవాల్ విసిరారు. తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై గత ఎన్ని సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటూ చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ తుమ్మల పొంగులేటి పై ఘాటు గా విమర్శలు చేశారు. సీతారామ ప్రాజెక్టును అడ్డుకొని సుప్రీంకోర్టులో కేసు వేసింది మీరు కాదా, భద్రాచలం సీతారామస్వామి, మేడారం సమ్మక్క సారక్క ల సాక్షిగా గద్దల మీద ప్రమాణం చేయడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అంటూ భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య కు బహిరంగా సవాల్ విసిరారు ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధు.
Read Also..





Total views : 149904