యువగళం పాదయాత్ర సభ దిగ్విజయం అయిన సందర్భంగా టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నవశకానికి నాంది పలికిందన్నారు. వైసిపి ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలుగజేసిన ఈరోజు యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయిందని ఆయన అన్నారు. యువగళం పాదయాత్ర లో ప్రతి 100 కిలోమీటర్ల చొప్పున ఒక హామీని శిలాపలక రూపంలో వేశారు అది అక్షరాల నిర్వహించే బాధ్యత టిడిపి ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. 92 నియోజకవర్గాలలో 3,152 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన నారా లోకేష్ గారికి అభినందనలు తెలిపారు. యువగళం పాదయాత్ర లో వైసిపి చేసిన అరాచకాలను, అసమర్ధ పాలన గురించి నారా లోకేష్ ప్రజలకు తెలియజేశారు. అలాగే ప్రతి గ్రామంలో ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశలో నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. బహిరంగ సభకు హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్, ఐదు లక్షల మంది ప్రజలు విచ్చేసి ఈ సభను విజయవంతం చేశారు. వీళ్ళందర్నీ ఓకే వేదిక పైన చూడడంతో జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టట్లేదు అని ఆయన ఎద్దేవాచేశారు.
ముగింపు సభ నవశకానికి నాంది…
330
previous post





Total views : 149872