Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Latest News అవినీతి లేని పారదర్శక పాలనే ప్రభుత్వ లక్ష్యం….

అవినీతి లేని పారదర్శక పాలనే ప్రభుత్వ లక్ష్యం….

by Prakash
State Minister Konda Surekha special pooja

రాష్ట్రంలో అవినీతి లేని పారదర్శక పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ మరియు పర్యావరణ పరిరక్షణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యా వరణాన్ని పరిరక్షించి ఆధ్యా త్మికతను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని మంత్రి కొండా సురేఖ కోరారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్ నగరంలోని బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తనను 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మికతను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కొండా సురేఖ కోరారు.

Advertisements

You may also like

Our Visitor

026228
Total views : 150068

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.