Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh ఎర్ర వారి గూడెం సమీపంలో పులి సంచారం…

ఎర్ర వారి గూడెం సమీపంలో పులి సంచారం…

by Prakash
Tiger footprints

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ఎర్ర వారి గూడెం సమీపంలో పులి సంచారం జరుగుతుందని జోరుగా ప్రచారం సాగుతుంది. గ్రామ శివారు పొలాల్లో గుర్తుతెలియని పాదముద్రలను గ్రామస్తులు గుర్తించారు. అది పులి అడుగుజాడలుగా గ్రామస్తులు భావిస్తూ భయభ్రాంతులకు గురవుతున్నారు. పొలంలోకి వెళ్లి సాగు చేసుకోవడానికి ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా తమ గ్రామంలోకి పులి వస్తుందేమే అనే భయంతో బిక్కుబిక్కున బతుకుతున్నారు. ఫారెస్ట్ అధికారులు వచ్చి తమకు రక్షణ కల్పించాలని మరియు పులిని పట్టుకుని మా గ్రామాన్ని రక్షించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఈ సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియజేశామని గ్రామస్తులు చెపుతున్నారు.

Advertisements

You may also like

Our Visitor

026078
Total views : 149873

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.