Wednesday, June 3, 2026
News Navigation
Wednesday, June 3, 2026
News Navigation

Breaking

Wednesday, June 3, 2026
Home Devotional లక్ష్మీ కటాక్షం పొందడం కోసం ఈ పూజలు చెయ్యండి..!

లక్ష్మీ కటాక్షం పొందడం కోసం ఈ పూజలు చెయ్యండి..!

by Satya
Lakshmi Kataksha



అమృత ప్రాప్తి మంత్రం :

శంఖినీ యక్షిణీ సాధన మంత్రం
శంఖ ధారడీ శంఖ ధరనే హ్యీం హ్యీం క్లీం శ్రీ స్వాహా
ఈ మంత్రాన్ని వటవృక్షం కింద కూర్చుని పదివేలసార్లవరకు జపించాలి. దీనిని జపించేముందు ఉదయాత్పూర్వం ప్రారంభించి, సూర్యోదయానికి ముందుగానే ముగించుకోవాలి. నెయ్యితో వెయ్యిసార్లవరకు ఈ మంత్రాన్ని హవనం చేస్తే.. చంద్రికా యక్షిణీ ప్రసన్నం పొంది అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఈ మంత్రం ఎప్పుడుపడితే అప్పుడు, ఎవరుపడితేవారు జపించకూడదు. అన్నివిధాలుగా పవిత్రంగా వుండేవారికి మాత్రమే ఇది వర్తస్తుంది. అటువంటివారికే పలితాలు దక్కుతాయి. ఇతరుల ఎంతచేసినా ఫలితం శూన్యం.

రుణ విముక్తి కోసం చిన్న పూజ :

రుణ సమస్య అనేది చాలా విచిత్రమైంది. ఇందులో కూరుకుపోయినవారు బయటపడ్డం చాలా కష్టం. ఈ సమస్య నుంచి బయటపడ్డానికి అన్యరకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యంకాదు. కేవలం కొంతమందికి మాత్రమే అలా సాధ్యపడుతుంది. అయితే ఈ రుణం నుంచి విముక్తి పొందడానికి ఒక చిన్న ఉపాయం కూడా వుంది.

గాయత్రి మంత్రం :

ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యమ్‌
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌
ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే ఈ మంత్రాన్ని జపించడంతో సిరిసందదలతోపాటు ప్రత్యేకమైన లాభాలు కూడా కలుగుతాయి.
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవసాయ,
ధన ధాన్యాధిపతయే ధన ధాన్య సమృద్ధి మేఁ దేహి దాపయ స్వాహా!
ప్రతిరోజూ తొమ్మిదిసార్లు ఈ మంత్రాన్ని జపించుకోవాలి. మంత్రాన్ని జపించిన తరువాత పసుపురంగులో వున్న మిఠాయిలను పిల్లలకు పంచాలి. అలాగే గంగాజలాన్ని మీరు పనిచేసే చోట జల్లుకోవడంతో మంచి పురోభివృద్ధిని పొందుతారు. అలాగే లక్ష్మీదేవి కృపతో ధనధాన్యాలు పొందుతారు.

ఆకర్షణ వృద్ధి కోసం :

పూజా కార్యక్రమాలను నిర్వహించుకున్న స్థానంలో ఒక బంతి పూవులను తీసుకోవాలి. ఆ పూలను పసుపుతో పూజించి, నీటితో చిదుముకోవాలి. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు దానిని తిలకంగా దిద్దుకుంటే.. మిమ్మల్ని చూసేవారు మీవైపు ఆకర్షితులవుతారు. ముఖ్యంగా వివాహసంబంధాలకు వెళ్లినప్పుడు దీనిని పాటిస్తే.. మంచి ప్రయోజనాలు పొందుతారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: కాశీ పుణ్య క్షేత్ర ప్రాముఖ్యత..!


శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ …
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..
అధిక జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. శ్రీ దుర్గామల్లేశ్వర …
భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి సీతక్క. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.


Advertisements

You may also like

Our Visitor

019615
Total views : 91212

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.