ఇజ్రాయిల్(Israel)లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హెజ్బుల్లా దక్షిణ లెబనాన్ నుంచి దాదాపు 160 రాకెట్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య ఘర్షణ ప్రారంభమైన తర్వాత జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా, తమ కీలక కమాండర్ తలెబ్ సమీ అబ్దుల్లా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్కు చెందిన రెండు మిలిటరీ బేస్లపై రాకెట్లు, మిస్సైళ్లతో దాడి చేశామని హెజ్బుల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికాతో సహా అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న వేళ హెజ్బుల్లా ఈ దాడికి పాల్పడటంతో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. ఇప్పటివరకు లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 400 మంది హెజ్బుల్లా సభ్యులు మరణించారని అధికార వర్గాలు తెలిపాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.