ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు.. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సీ కేబుల్ కనెక్టివిటీ వస్తే విశాఖ ఓ డీప్ టెక్ డెస్టినేషన్ అవుతుందన్నారు. మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యిందని.. గూగుల్ ఎంవోయూతో విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేస్తామన్నారు.
మంత్రి లోకేష్ అమెరికా వెళ్లి గూగుల్ వారిని సంప్రదించడంతో వారు విశాఖపట్నం రావడానికి ఒప్పుకున్నారన్నారు ముఖ్యమంత్రి. ఇప్పడు వారితో ఒప్పందం చేసుకున్నామని.. గూగుల్తో చేసుకున్న ఒప్పందం మరో కీలక మైలురాయిగా మారుతుందన్నారు. విశాఖకు గూగుల్ రావడం ఓ గేమ్ చేంజర్గా అభివర్ణించారు. ఆర్టీజీఎస్తో గూగుల్ ఓ ఒప్పందం చేసుకున్నారని.. ఆ ఒప్పందం ఎంతో మేలు చేస్తుందన్నారు. గూగుల్తో ఒప్పందం రాష్ట్రంలోని యువతకు గుడ్ న్యూస్ అన్నారు. సంక్షోభంలో అవకాశాలను సృష్టించుకోవడమే నాయకత్వమన్నారు చంద్రబాబు. ఏదైనా విషయంలో ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని గుర్తు పెట్టుకోవాలి.. నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు కచ్చితంగా వస్తాయన్నారు. అలాగే హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ చాలా ముఖ్యం అన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వెనెజువెలా డ్రగ్స్ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్.మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉక్కుపాదం మోపింది. వెనెజువెలాకు చెందిన కరుడుగట్టిన డ్రగ్స్ గ్యాంగ్ ట్రెన్ డి ఆరాగ్వాపై చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో ఆ ముఠా కీలక నేత హెక్టర్ రస్తెన్ఫోర్డ్ గురెరో ఫ్లోర్స్ హతమైనట్లు అమెరికా…
- కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.కాకినాడ జిల్లాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో తమ కుమార్తెను యువకుడు ఉరివేసి హత్య చేశాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆందోళన…
- ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తుల సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాలకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలను పనుల నిమిత్తం గ్రామానికి రప్పించిన…
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
- అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్.అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రత్యేక జాబితాలో భారత సంతతికి చెందిన ప్రముఖులు సత్తా చాటారు. అమెరికాలో నివసిస్తున్న విజయవంతమైన 250 మంది వలసదారుల జాబితాలో ఏకంగా 27 మంది భారతీయ మూలాల వ్యక్తులు చోటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 141373