కడప జిల్లా…నగరంలో కీలకమైన ప్రాంతం రాజారెడ్డి వీధి. జిల్లా ఎస్పీ బంగ్లా నుంచి జిల్లా గ్రంధాలయం వరకు ఈ రహదారి మంచి వ్యాపార కేంద్రం. ఈ ప్రాంతం వ్యాపారులకు అడ్డా. ఎలక్ట్రానిక్ షోరూమ్స్ మొదలుకొని హోటల్స్..జిమ్ బ్యాంకులు.. ఇలా ఎన్నో వాటికి అడ్డా ఇది. ఇక్కడ బిజినెస్ కోసం సెంటు స్థలం దొరికితే చాలు ఆనందానికి హద్దులు ఉండవు. అలాంటి ప్రాంతంలో సుమారు 30 సెంట్ల స్థలం.. అందులోనూ సుమారు 15 కోట్ల విలువ చేసే స్థలం కనిపిస్తే ఊరుకుంటారా , కోట్ల విలువ చేసే స్థలం వైసిపి నేతలపరం…కడప కార్పొరేషన్ లో నెంబర్-2 గా చలామణి అవుతున్న వ్యక్తి కన్ను పడితే..వ్యూహాత్మకంగా పావులు కలిపి బినామీ పేరుతో సొంతం చేసుకుంటారు. ప్రస్తుతం ఈ స్థలం వివాదాస్పదంగా మారింది.
నగరంలోని రాజారెడ్డి వీధిలో పోలీస్ పెట్రోలు బంకు సమీపంలో ఖాళీ స్థలం ఉంది. పోలీస్ శాఖ కు సంబంధించిన ఈ స్థలంపై కార్పొరేషన్ పాలకవర్గంలో నెంబర్ 2 గా ఉన్న వైసీపీ నేత కన్ను పడింది. కడప లో కరుడు కట్టిన వైసిపి నాయకులకు తెలియకుండానే ఆయన వ్యూహాత్మకంగా సుమారు 15 కోట్ల విలువ చేసే 30 సెంట్ల స్థలాన్ని కాజేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. వివాదంలో ఉన్నప్పటికీ ఆ స్థలాన్ని అప్పటి పోలీస్ బాస్ ను మేనేజ్ చేసి మరీ ఒప్పందం చేసుకొని.. ఆ స్థలంలో తనదైన స్టైల్ లో నిర్మాణాలు కొనసాగించారు. ప్రభుత్వ మారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో ఆ స్థలం లీజు వ్యవహారం బయట పడింది. న్యాయస్థానంలో వివాదంలో ఉన్న స్థలాన్ని అప్పటి పోలీస్ బాస్ చడి చప్పుడు కాకుండా వైసిపి నేత బినామీకి కట్టబెట్టిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పీఎఫ్ క్లెయిమ్లు ఇక మరింత సులభతరం.దేశంలోని కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ విత్డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFOలో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా రూ.5 లక్షల…
- అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్లు తదితర ప్రాజెక్టుల పనులు ఎంతవరకు పూర్తయ్యాయో సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టు…
- ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.ఇంగ్లండ్ చేతిలో ఇది ఘోర పరాజయం. ఓటమి ఒక్కటే కాదు, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ భారత జట్టు తరఫున పరుగుల తేడాతో జరిగిన అతిపెద్ద ఓటమికి నాయకత్వం వహించిన కెప్టెన్గా ఒక అనవసర రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. డగౌట్లో…
- విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.ఫిఫా వరల్డ్ కప్-2026లో భాగంగా అర్జెంటినా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు.హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి…
- హర్యానాలోని గురుగ్రామ్లో కుండపోత వర్షాలు.రుతుపవనాల ప్రభావంతో హర్యానాలోని గురుగ్రామ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షాల ప్రభావంతో ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి ఎన్హెచ్-48పై నర్సింగ్పూర్ ప్రాంతంలో రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో భారీ గుంత…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 194130