అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండల పరిషత్ లో ఇఓ.పి.ఆర్. ఆర్.డి. వెంకటేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అమలాపురంలో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు.. రాత్రి ఇంటికి రావడం లేదు భీమవరం వెళుతున్నానని చెప్పి తన కార్యాలయ గదిలో ప్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు.. క్లోజ్ టీం తో తనిఖీ చేస్తూ ఘటనపై ఆరా తీస్తున్నారు.
Andhra Pradesh
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట (మం) పలివెల గ్రామవాలంటీర్ సుబ్రహ్మణ్యం మరో మహిళా వాలంటీర్ ను లైంగికంగా వేధించాడు. వాలంటీర్ సుబ్రహ్మణ్యం పై కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మహిళ వాలంటీర్ ను తన కోరిక తీర్చాలంటూ వాలంటీర్ సుబ్రహ్మణ్యం లైంగికంగా వేధించాడు. కొత్తపేట మండలంలోని పలివేల గ్రామంలో సుబ్రహ్మణ్యం, బాధితురాలు వాలంటీర్లు గా చేస్తున్నారు. గతకొంత కాలంగా వేధిస్తున్నడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ లో పని చేస్తున్న డ్రైవర్ల పై రోజు రోజుకూ దాడులు జరుగుతూనే వున్నాయి. సమాజానికి మర్గానిర్దేసుకులుగా ఉపాధ్యాయులు ఉన్నారు. అటువంటిది ఉపాధ్యాయుడు బస్సు అపలేదన్న అక్రోసంతో డ్రైవర్ ,కండక్టర్ పై చెప్పలేని విదంగా పదజాలంతో దుర్బాశాలాడి దాడి చేసిన ఘటన కడప జిల్లా చక్రాయపేట మండలం లో చోటు చేసుకోంది …వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా రాయచోటి డిపోకు చెందిన అద్దె బస్సు డ్రైవర్ నరసింహులు తెలిపిన వివరాల మేరకు… నిన్న మధ్యాహ్నం రాయచోటి నుంచి వేంపల్లి కి సర్వీసు వెళ్ళడం జరిగింది. నాగులగుట్ట పల్లి దగ్గర బస్సు ఎక్కేందుకు బస్సు ఆపడం జరిగింది. అప్పటికే బస్సు లోపల ప్రయాణికులు విద్యార్థులు ఎక్కువగా ఉండడంతో ఆపేందుకు వీలు లేక పోవడం తో ఈ బస్సు వెనకాలా బస్సు వస్తుందని చెప్పి వెళ్ళిపోవడం జరిగిందన్నారు. అక్కడే ఉన్నటువంటి ఓ ఉపాధ్యాయుడు కారులో వచ్చి చక్రాయపేట సమీపంలో కారును బస్సుకు అడ్డంగా పెట్టి బస్సు ఎందుకు నిలపలేదు అని డ్రైవర్ నరసింహులు, కండక్టర్ పై దుర్భాషలాడారు. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్పినప్పటికీ వారిని కూడా తిట్టడం మొదలు పెట్టారు. దీంతో చక్రాయపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశామన్నారు. నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ ఈ రోజు రాయచోటి.. వేంపల్లి అద్దె బస్సులు నిలిపివేశామని మాకు న్యాయం జరిగేంత వరకు సర్వీస్ లు పునరుద్దరించే ప్రసక్తే లేదని వారు తెలియజేశారు. దీంతో సమయానికి బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైవర్ పై దాడి చేసిన ఉపాధ్యాయుడు పై కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఆర్టిసి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బవరం రామాంజులు డిమాండ్ చేశారు.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో అర్ధరాత్రి దాటిన తరువాత కత్తులు చూపించి చంపేస్తామని బెదిరించిన నలుగురు దుండగులు పందెం కోళ్లను చోరీ చేసిన సంఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఎప్పటి లాగానే గ్రామంలోని రోడ్డు పక్కనే ఉన్న చిన్న కోళ్ల ఫారంలో నిదురిస్తున్న మెతుకుమిల్లి శ్రీనివాసరావు, పద్మావతి దంపతులను కత్తులు మెడపై పెట్టి చంపేస్తామని బెదిరించిన నలుగురు గుర్తు తెలియని దుండగులు. కోళ్ల ఫారంలోకి ప్రవేశించిన అగంతకులు మెరుగైన 11 పందెం కోడిపుంజులను చోరీ చేశారు. బయటకు అరిస్తే చంపేస్తామని కత్తులతో బెదిరించినట్లు బాధితులు శ్రీనివాసరావు, పద్మావతి దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోడిపుంజులను చోరీ చేసి దుండగులు ఉడాయించగా, అక్కడే ఉన్న వాహనాన్ని నడిపేందుకు ప్రయత్నించగా, అగంతకులు స్టార్ట్ కాకుండా చేశారని వాపోయారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.
దుర్గ గుడిలో విగ్రహం మాయమవడముపై గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో గత 30 సంవత్సరాలుగా గ్రామంలో పూజలు అందుకుంటున్న దుర్గమ్మ విగ్రహం ఈరోజు ఉదయం కనిపించకపోవడముతో గ్రామ ప్రజలు స్వామి భక్తులు ఆవేదన చెందారు. రోజులాగే ఉదయం దుర్గమ్మ దర్శనం కోసం వస్తే విగ్రహం లేకపోవడంతో అవాక్కయ్యామన్నారు. ఈమధ్య కాలంలో గుడి ఉన్న స్థలం కోసం గ్రామంలో ప్రజలకు స్థలం మాదంటూ వారికి వాధిద్వాదం చోటుచేసుకుందని తెలిపారు. విగ్రహం అపహరణ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఈ ఘటనకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఈసందర్భంగా పలువురు కోరారు.
నటుడు వరుణ్ తేజ్ – నటి లావణ్య త్రిపాఠి వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఇటలీలోని టస్కానీలో బుధవారం రాత్రి 7.18 గంటలకు వీరి వివాహం జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో లావణ్య త్రిపాఠి మెడలో వరుణ్ తేజ్ తాళి కట్టాడు. దీంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఘనంగా జరిగిన పెళ్లి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాలకు చెందిన అగ్ర హీరోలు సందడి చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నవ దంపతులను ఆశీర్వదించార. ఇక సినిమా పరిశ్రమ, సెలబ్రిటీల కోసం నవంబర్ 5న హైదరాబాద్లో రిసెప్షన్ నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేసుకున్నారు. మాదాపూర్ ఎన్-కన్వెన్షన్ వేదికగా ఈ వేడుక జరగనుంది.
ఆంధ్ర తెలంగాణ సరిహద్దు గరికపాడు ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద ఏసీబీ తనిఖీలు చేపట్టారు. ఏఎస్పి మహేంద్ర ఆధ్వర్యంలో ఏసీబీ తనిఖీలు జరిగాయి. చెక్ పోస్ట్ లో ఎమ్ వి ఐ శేఖర్, అతని వ్యక్తిగత డ్రైవరు, మరో నలుగురు ప్రైవేటు వ్యక్తులతో కలిసి ఉండగా శేఖర్ వద్ద నుండి 76,000 రూపాయల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కోర్టు నిబంధనల మేరకు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వరకూ చంద్రబాబు కాన్వాయ్ సాగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. బాబుకు మద్దతుగా ప్రజలు ర్యాలీలు చేస్తే ప్రభుత్వ సలహాదారు రామకృష్ణా రెడ్డి, వైసీపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు ఛీకొడుతున్నా వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ రావటానికి చంద్రబాబుకు 16 గంటల సమయం పట్టింది. కోర్టు నిబంధనలు లేకపోతే ఇప్పుడు వచ్చినదానికంటే నాలుగు రెట్లు అధికంగా జనం వచ్చేవారు. చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించకుండా కారులోనే ఉండి ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. లోకేశ్ ఢిల్లీ వెళితే వైసీపీ వాళ్లకెందుకు ఉలికిపాటు. అక్రమ కేసులో చంద్రబాబును 52 రోజులు నిర్బంధించారు. ఆయన అవినీతికి పాల్పడ్డట్టు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ అవకతవకలు జరిగాయంటూర మరో కొత్త కేసు పెట్టారు. వైసీపీ వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీని ఏమీ చేయలేరు’’ అని పేర్కొన్నారు.





Total views : 141008