Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Devotional శ్రీశైలం ఉగాది మహోత్సవాల ఏర్పాట్లు ముమ్మరం

శ్రీశైలం ఉగాది మహోత్సవాల ఏర్పాట్లు ముమ్మరం

by Prakash
ugadi 2024 at srisailam

శ్రీశైలం దేవస్థానం| Srisailam Temple

నంద్యాల జిల్లా(Nandyal) : శ్రీశైలం ఉగాది మహోత్సవాలలో భక్తుల కల్పిస్తున్న ఏర్పాట్లను పరిశీలించిన ఈవో. మల్లమ్మ కన్నీరు, పార్కింగ్ ప్రదేశాలు యాఫిథియేటర్, ఔటర్ రింగ్ రోడ్డు అధికారులతో కలిసి పరిశీలన. శివరాత్రి కంటే ఎక్కువ చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు. ఉత్సవాలలో దుకాణదారులు అధిక రేట్లకు అమ్మకుండా తనిఖీ చేస్తుండాలని ఈవో ఆదేశాలు. చలువపందిళ్ల వద్ద మంచినీటి అంతరాయం లేకుండా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని ఈవో సూచన. ఉత్సవాల సమయంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు ఆదేశాలు.

Follow us on : Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏప్రిల్ 6 నుండి 10 వరకు ఉగాది ఉత్సవాలు(Ugadi 2024 At Srisailam) దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది

శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుండి 10 వరకు ఉగాది ఉత్సవాలు దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది ఈ ఉత్సవాలకు కర్ణాటక,మహారాష్ట్రల నుండి అధిక సంఖ్యలో వస్తారని అధికారులు అంచనా ఈనేపథ్యంలో భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న ఏర్పాట్లను ఈవో పెద్దిరాజు సంబంధిత అధికారులతో కలిసి పలుచోట్ల పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు యాంపీథీయేటర్, మల్లమ్మకన్నీరు, ఉద్యానవనాలు, పార్కింగ్ ప్రదేశాలు, వలయరహదారి, మొదలైనవాటిని పరిశీలించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే పలుచోట్ల చలువపందిర్లు వేసినప్పటికి ఆయా చలువపందిర్లు పరిశీలిస్తూ ఎండతీవ్రత రోజురోజుకు అధికమవుతున్న కారణంగా వీలైనన్నీ ఆరుబయలు ప్రదేశాలలో భక్తులు సేద తీరేందుకు ఇంకొన్ని చోట్ల చలువపందిర్లను వేయాలన్నారు శివరాత్రి కంటే ఎక్కువగా చలువపందిర్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

చలువపందిర్ల వద్ద అంతరాయం లేకుండా మంచినీటి సరఫరా చేయాలన్నారు మంచినీటికి ట్యాంకర్లనే కాకుండా వాటర్ పాకెట్ల రూపంలో కూడా అందించాలని సూచించారు ఉత్సవాలు సమయంలో క్షేత్రపరిధిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు శౌచాలయాల శుభ్రతపట్ల అవసరమైన చర్యలు తీసుకోవాలని శౌచాలయాలకు నిరంతరం నీటిసరఫరా ఉండేలా చూడాలని తెలిపారు యజ్ఞవాటిక వద్ద గల పార్కింగు ప్రదేశంలో బస్సులు నిలిపేందుకు రీజియన్లు,డివిజన్ల వారిగా సూచికబోర్డులు ఏర్పాటు చేయాలన్నారు ఉత్సవాల సమయంలో దుకాణదారులు వస్తువులను అధికరేట్లకు విక్రయించకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుండాలని సంబంధిత అధికారులను ఈవో పెద్దిరాజు ఆదేశించారు…..

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.
హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన …
స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న …
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023260
Total views : 141680

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.