Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home TelanganaMedak 161 వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

161 వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

by Rama
Car Accident

ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident).. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి:

సంగారెడ్డి జిల్లాలో నాందేడ్ అఖోలా 161 వ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ వేగంగా వచ్చి కారును ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఈ ఘటన అందోల్ మండలం మాసాన్ పల్లి హైవే బ్రిడ్జి కింద చోటుచేసుకుంది. జోగిపేటకు చెందిన ఆరుగురు యువకులు చాయ్ తాగేందుకు జోగిపేట నుండి కారులో ముందుగా చౌటకూర్ దాబాకు వచ్చారు. అక్కడ దాబా బంద్ ఉండడంతో అదే కారులో మాసన్ పల్లి వద్ద హైవే పక్కన హోటల్ వెళ్లి చాయ్ తాగారు. తిరిగి వెళ్తున్న క్రమంలో మాసాన్ పల్లి బ్రిడ్జి కింద కారు ఆపి వారు మూత్ర విసజ్జన చేస్తుండగా వెనకనుండి వచ్చిన టిప్పర్ లారీ వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది.

Follow us on : Facebook, Instagram & YouTube.

అయితే కారు ముందు మూత్ర విసర్జన చేస్తున్న ముగ్గురు యువకులపై ఢీకొట్టిన టిప్పర్ లారీ మరియు కారు రెండు వారిపై వెళ్ళడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా జోగిపేటకు చెందిన మైనారిటీ యువకులు వీరంతా మెకానిక్ వర్క్ చేస్తుంటారు. మృతి చెందిన యువకులు జోగిపేటకు చెందిన వాజిద్ (28) హాజీ(28) బుక్రాన్ (29) కాగా మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా అతడిని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలు కావడంతో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాత్రి వేళల్లో జోగిపేట పరిసర ప్రాంతా ఏరియాల్లో భారీగా అక్రమ మోరం రవాణా జరుగుతుంది.

అయితే కారును డికొట్టింది మోరం టిప్పర్ లారీ అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహలను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మర్చ్యూరికి తరలించారు. 161 వ జాతీయ రహదారిపై తరుచుగా ప్రమాదాలు జరిగి చాలా మంది మృత్యువాత పడుతున్నారు. మొన్న రెండు రోజుల క్రితం ఇదే రహదారిపై సంగుపేట వద్ద కారు బైక్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరు కూడా 161 నేషనల్ హైవే బ్రిడ్జి కింద ప్రమాదం జరిగింది. 161 జాతీయ రహదారి గత కొంత కాలంగా రోడ్డుప్రమాదాలతో రక్తసిత్తమవుతుంది.

ఇది చదవండి: తెలంగాణ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ


హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.
హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన …
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు …
వనపర్తి జిల్లా కొత్తకోటలో డ్రగ్స్ నివారణపై అవగాహన ర్యాలీ.
డ్రగ్స్ నివారణపై వనపర్తి జిల్లా కొత్తకోటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

023260
Total views : 141679

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.