Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Latest News INTUC కార్యాలయంలో విలేకరుల సమావేశం…

INTUC కార్యాలయంలో విలేకరుల సమావేశం…

by Prakash
Press conference at INTUC office

మందమర్రి ఏరియా సింగరేణి గుర్తింపు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు పట్టణ INTUC కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, INTUC సెంట్రల్ నాయకులు జనక్ ప్రసాద్ సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో 51% తెలంగాణ రాష్ఠ్ర వాటా కల్గి ఉండి అధికారంలో నూతనంగా అత్యధిక జనాధరణ కల్గిన కాంగ్రెస్ పార్టీ ఉండి.. ముఖ్యంగా సింగరేణి కార్మిక క్షేత్రాలలో కాంగ్రెస్ పార్టీ MLA లు గెలుపొందినారు. రానున్న కొద్ది రోజుల్లో తప్పక MP సీటును కూడా భారీ మెజరటీతో కైవసం చేసుకోబోవు తరుణంలో SCCL కార్మిక లోకానికి ఒక ముఖ్య విన్నపం. రానున్న సింగరేణి యూనియన్ ఎలక్షన్ లో తప్పక INTUC కి అధికారం అందించినట్లైతే తప్పక మీ అవసరాలను, మీ హక్కులను, మీ అభీష్ఠాలను తప్పక అటు అత్యధిక వాటా కల్గి ఉన్న మన రాష్ఠ్ర అసంబ్లీలో మరియు కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్ లో మన MLA లు, మన MP లు కార్మిక అభీష్ఠానికి అనుగుణంగా పనిచేసి కార్మికుల మన్ననలు పొందుతారు. సింగరేణి కార్మిక యూనియన్ ఎన్నికల్లో INTUC ని బలపరచి గడియారం గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సింగరేణి కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, INTUC సెంట్రల్ నాయకులు జనక్ ప్రసాద్, IINTUC ఏరియా నాయకులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

026165
Total views : 149987

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.