Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Andhra Pradesh శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు..

శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు..

by Satya
Sensational verdict of Visakha SC and ST court in Shiromundanam case

27 ఏళ్ల నాటి శిరోముండనం కేసు(Siromundam Case)లో విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధించింది. 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో తోట త్రిమూర్తులతో పాటు 9 మంది నిందితులుగా ఉన్నారు. 1996 డిసెంబర్ 26న వెంకటాయపాలెంలో శిరోముండనం ఘటన జరిగింది. ఎన్నికల కక్షలతో దళిత యువకులకు శిరోముండనం చేశారు.

ఇది చదవండి: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి భారీ షాక్..!

ఇద్దరికి గుండు కొట్టించడంతో పాటు కనుబొమ్మలు గీయించారు. 1997 జనవరి 1న ఆనాటి జిల్లా ఎస్పీ కేసు నమోదు చేశారు. తోట త్రిమూర్తులతో సహా 9 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. 1998లో కేసును కొట్టేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మళ్లీ 2000 సంవత్సరంలో కేసును ప్రభుత్వం రీ ఓపెన్ చేసింది. మొత్తం 24 మంది సాక్షుల్లో 11 మంది మృతి చెందారు. తాజాగా త్రిమూర్తులుకు విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

008649
Total views : 57045

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.