తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు సుమన్.ఆలయం వెలుపల సుమన్ మీడియాతో మాట్లాడుతూ….. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారన్నారు. మంచి కాంబినేషన్ లో కొత్త ట్విస్ట్తో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి అవకాశం రావడం., జనసేన అధినేత పవన్ అన్ని సీట్లలో క్లీన్ స్వీప్ చేయడం జరిగిందని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు సుమన్. వచ్చే ఐదేళ్లలో జరగాల్సిన అభివృద్ధికి పునాదులు వేశారన్నారు. విద్యా., వైద్యం, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు. అమెరికా లాంటి క్యాపిటల్ ఏపీకి రావాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. హైదరాబాద్ లాంటి నగరం ప్రపంచ స్థాయి నగరంగా ఎదగడానికి చంద్రబాబే కారణమని గుర్తు చేశారు. అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. అమరావతి కాస్మో పాలిటన్ సిటీగా ఎదగాలన్నారు. తిరుపతి, ఈస్ట్., వెస్ట్ గోదావరిలో ఫిల్మ్ సిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుపతిని టెంపుల్ సిటీగా డిక్లర్ చేయాలని విజ్ఞప్తి చేశారు
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను జూలై 3, 2026కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించిన…
- లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.రైడ్స్ జరగడం… అధికారులు పట్టుబడడం… ఆ తర్వాత కేసులన్నీ నీరుగారిపోవడం… ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ పరిధిలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి ఇది. వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి వైరస్కు వ్యాక్సిన్ వేయాల్సిన ఏసీబీ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.…
- ఫిన్లాండ్లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి విదేశాల్లో అదృశ్యమై 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఫిన్లాండ్లో బీటెక్ చదువుతున్న మణిదీప్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని క్షేమంగా తిరిగి…
- విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.ప్రజా ఆరోగ్యానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడ హనుమాన్పేటలో ఉన్న ‘డ్రగ్స్ కంట్రోల్ భవన్’ను, ప్రారంభించిన మంత్రి..చంద్రబాబు దార్శనికతతో ఆరోగ్యాంధ్రప్రదేశ్ విజన్కు అనుగుణంగా ఆరోగ్యశాఖ పని చేస్తుందన్నారు. విజయవాడ హనుమాన్పేటలో డ్రగ్స్ కంట్రోల్…
- ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన ఈదరపల్లి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 150679