అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం రంప గ్రామంలో అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున శివరాత్రి మహోత్సవాలు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు 12వ శతాబ్దానికి చెందిన దేవాలయం ఇది చోళ రాజులు పరిపాలించినప్పుడు ఈ దేవాలయం నిర్మించబడింది. అంతేకాకుండా ఈ దేవాలయం అల్లూరి సీతారామరాజు ఇక్కడ పూజలు నిర్వహించి తన స్వతంత్ర యాత్రను ఈ మన్యంలో కొనసాగించారని ఇక్కడ పెద్దలు అంటారు. అంతేకాకుండా ప్రతి ఏటా వివిధ రాష్ట్రాల నుంచి ఈ పురాతన శివాలయాన్ని సందర్శించడానికి భక్తులు శివరాత్రి రోజు వస్తారు. సుమారు శివరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని వేళలో భక్తులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అంతేకాకుండా భక్తుల కోర్కెలను నెరవేరిచే దైవంగా ఇక్కడ మన్యం ప్రజలు కొలుస్తారు.
Tag:
Alluri Sitaramaraj District News
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం నర్సింగ పేట ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 7వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. అర్ధ రాత్రి సమయంలో కడుపులో నొప్పి వస్తుంది అని హుటాహుటిన హాస్టల్ నుండి కూనవరం ప్రభుత్వ ఆసుపత్రికి స్కూల్ సిబ్బంది తరలించారు. కూనవరం ఆసుపత్రి వైద్యులు వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించమని చెప్పారు. వెంటనే ఆ అమ్మాయిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో 7వ తరగతి చదువుతున్న మడకం సంధ్య మృతి చెందింది. నా కూతురి మృతికి పాఠశాల సిబ్బందే కారణమంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రమ పాఠశాల ముందు మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువులు ధర్నా నిర్వహిస్తున్నారు.





Total views : 150221