అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 7వ రోజు కు చేరింది. ప్రకాశం జిల్లా మార్కాపురం లో ఏడో రోజు సమ్మెలో అంగన్వాడీలు ఎర్ర చీరలు ధరించి పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న అంగన్వాడీలను చూసి సబ్ కలెక్టర్ సేతు మాధవన్ కార్యాలయం నుండి బయటికి వెళ్లిపోయారు.ఈ సమ్మెలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్, సిఐటియు యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని 13 మండలాలకు చెందిన అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు
సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అంగన్వాడి సెంటర్ల తాళాలు పగలగొట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. అవసరమైతే సమస్యల సాధన కోసం త్వరలో రాజధానిని కూడ ముట్టడిస్తామని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ తెలిపారు.
anganwadi workers
మహిళలైన అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం సరికాదని, సమస్యలను పరిష్కరించాలని నరసాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అంబేద్కర్ సెంటర్ లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు 4వ రోజుకు చేరాయి. బండారు మాధవ నాయుడు అంగన్వాడీ వర్కర్లకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలైనా అంగన్వాడీ వర్కర్లపై నిర్లక్ష్య ధోరణి విడనాడాలని న్యాయమైన వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరంకుశ వైఖరిని విడనాడి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో అంగన్వాడీలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం లో తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీ కేంద్రాలను తెరుస్తున్న సచివాలయాల సిబ్బంది, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా అంగన్వాడీ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.. అంగన్వాడీ సిబ్బంది సమస్యలు ప్రభుత్వం పరిష్కరించకుండా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపిడిఓ, మున్సిపల్ కమీషనర్ ల ఆధ్వర్యంలో పట్టణం, మండలాల పరిధిలోని అంగన్వాడి కేంద్రాలను సచివాలయం సిబ్బంది తో అంగన్వాడీ సూపర్ వైజర్ పర్యవేక్షణలో తాళాలు బద్దలు కొట్టి తెరుస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలలో స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించి గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు ఇబ్బంది లేకుండా ఫీడింగ్ ఇస్తున్నట్లు అంగన్వాడీ సూపర్ వైజర్లు చెపుతున్నారు. కాగా తమ సమస్యలు పరిష్కరించాలని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద చేస్తున్న ఆందోళన నాల్గవ రోజు కొనసాగుతోంది. అంగన్వాడీ సిబ్బంది నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతుంటే తాళాలు బద్దలు కొట్టి అంగన్వాడీ కేంద్రాలను తెరవడం సిగ్గు సిగ్గు అంటూ అంగన్వాడీ సిబ్బంది నినాదాలు చేశారు.
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపి రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని అంగన్ వాడీ వర్కర్స్ ముట్టడించారు. అంగన్ వాడీ టీచర్లను, ఆయాలను సముదాయించడానికి ఎండివో లక్ష్మి కుమారి ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. కార్యాలయం లోపలకి వెళ్లడానికి లక్ష్మి కుమారి ప్రయత్నించినప్పటికీ అంగన్ వాడీ వర్కర్స్ అడ్డుపడటంతో వెనుతిరిగారు. శాంతియుతంగా ధర్నా చేయాలని పోలీసులు కోరినప్పటికీ అంగన్ వాడీ వర్కర్స్ వినకుండా సిఐటియు నాయకులతో కలిసి భైఠాయించారు. అంగన్ వాడీలను రెడ్డిగూడెం ఎస్ ఐ శ్రీను సర్దిచెప్పినప్పటికీ పట్టించుకోకుండా ధర్నా నిర్వహించారు.
కాకినాడ లో కద్దాంతోక్కిన అంగన్వాడీ కార్యకర్తలు తమ నాణ్యమైన డిమాండ్స్ పరిష్కరించాలి అని కాకినాడ కలెక్టర్ ధర్నా చౌక్ వద్ద గత 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఆనాడు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో మాకు అనేక హామీలు ఇచ్చారు, ఒకటి కూడా నెరవేర్చలేదు. కనీసం వేతనం ఇవ్వాలని తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానని.. అబద్దపు హామీలు ఇచ్చారని.. అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో అంగన్వాడి సిబ్బంది నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు మద్దతు ఇచ్చారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు మరియు జనసేన కార్యకర్తలు కలిపి అంగన్వాడి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కె.ఏ నాయుడు మాట్లాడుతూ అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని రాష్ట్రంలో అంగన్వాడీలందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చి వర్కర్లతో సమానంగా వేతనాలు ఇస్తూ ప్రమోషన్ అమలు చేయాలని చెప్పారు. అంగన్వాడి విధులలో రాజకీయ జోక్యం అరికట్టాలని సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒక్కొక్కరికి ఉద్యోగం ఇవ్వాలని, చాలా నిబంధనలు అమలు చేయాలని మరియు సిబ్బందికి బీమా సౌకర్యం కలిగించాలని వ్యాఖ్యానించారు.
విజయనగరం జిల్లా, సమస్యల పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీల ధర్నా. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీ చేపట్టారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి హెచ్చరించారు. మంగళవారం గజపతినగరం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఆందోళన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె బాట పట్టారు. అంగన్ వాడీ కేంద్రాలను మూసివేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించడంతో తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన..ఆందోళన చేపట్టనున్నారు. అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధానంగా వేతనాల పెంపు, గ్రాట్యూటీ కోసం డిమాండ్ చేస్తున్న వర్కర్లు.. అంగన్ వాడీలలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తున్నారు. హెల్త్ కార్డులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
అంగన్వాడి వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడి కార్యకర్తలు.ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.పక్క రాష్ట్రం తెలంగాణ కంటే అంగన్వాడీలకు ఎక్కువ జీతాలు ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీలకు 26 వేల జీతము , ఐదు లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని లేనిపక్షంలో తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరవదిక సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల ఆందోళన సమ్మెలో పాల్గొన్నారు.




Total views : 150098