తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల లో భారీ అగ్నిప్రమాదం. పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఉన్న పదిహేను ఇళ్లను చుట్టుముట్టిన మంటలు. గ్యాస్ సిలెండర్ లు పేలడంతో సంభవించిన అగ్ని ప్రమాదం. తెల్లవారుజామున 3 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నిద్రమత్తులో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగులు తీసిన వైనం. సంఘటన స్థలానికి చేరుకున్న మూడు ఫైరింఇంజిన్లు. స్థానిక ప్రజలను దగ్గరలో ఉన్న SRK కళాశాలకు తరలింపు. లక్షలాది రూపాయలు ఆస్తి నష్టం. 15 ఏళ్ళు ఒక్కసారిగా మంటలలో దగ్ధం కావడంతో నిరాశ్రయులైన బాధితులు.
fire accident
విశాఖపట్నం జగదాంబ సెంటర్ లో ఉన్న ఇండస్ హాస్పిటల్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెండు, మూడో ఫ్లోర్ నుంచి వచ్చిన పొగ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. ఫైర్, పోలీస్ మరియు ఆసుపత్రి సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పేషెంట్లని బయటకు పంపిన నేపథ్యంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎన్టీఆర్ ఎఫ్ బృందాలు భారీ క్రేన్లతో అందించిన సహాయ సహకారాలు వల్ల పెను ప్రమాదం తప్పింది.
పల్నాడు జిల్లా నరసరావుపేటలోని చరిష్మా సూపర్ మార్కెట్ లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని విస్తృతంగా అలముకోవడంతో నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి నుండి మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చ్చేశారు. అగ్నిప్రమాదంలో సుమారు 3 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని సూపర్ మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏలూరు నాగేశ్వరరావు వెల్లడించారు. చరిష్మా సూపర్ మార్కెట్ మొత్తం 5 బ్రాంచ్ లు ఉన్న క్రమంలో నరసరావుపేట మెయిన్ బ్రాంచ్ అని తెలిపారు. అగ్నిప్రమాదం సంభవించిందని తమకు సమాచారం అందిన వెంటనే సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని మంటలు నిలుపుదల చేసేందుకు పూర్తి స్థాయిలో తగిన చర్యలు తీసుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చామని అగ్నిమాపక అధికారి ఎంవి సుబ్బారావు తెలియచేసారు.
విశాఖపట్నంలో పెను ప్రమాదం తప్పింది. జనతా బజార్ కారుల స్క్రాప్ దుకాణంల్లో మంటలు అంటుకున్నాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మంటల ను అదుపులోకి ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరి అధికారులు పీల్చుకున్నారు. షార్ట్ సార్క్యూట్ తో ప్రమాదం జరిగి ఉంటాదాని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డు మార్గం లోనున్న ప్రధాన రహదారికి కూతవేట దూరంలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ దేవాలయం గర్బ గుడిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అమ్మవారి విగ్రహం తో పాటు చీరలు, పూజా సామాగ్రి హుండీలు పూర్తిగా అగ్నికి ఆహుతై బుడిదగా మారాయి. అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనను అమ్మవారి దర్శనార్థం పూజకు వెళ్ళిన అయ్యప్ప స్వాములు దర్మకర్త రామ మూర్తికి తెలియజేశారు. వారు జరిగిన సంఘటనను పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకొన్న డిఎస్పి మహబూబ్ బాషా, అర్బన్ సి ఐ సుధాకర్ రెడ్డి వారి సిబ్బంది తో కలిసి హుటా హుటిన ప్రమాద సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. అగ్ని ప్రమాదం కు గల కారణాల పై అరా తీసారు. అదే విదంగా మాజీ ఎంపి సుగావాసి పాలకొండ్రాయుడు గారు కుడా గంగమ్మ ఆలయంలో జరిగిన అగ్ని ప్రమాదం ను తెలుసుకొని ఆలయం కు చేరుకొన్నారు. కావాలనే ఉద్దేశపుర్వకంగా నిప్పు పెట్టినట్లు తెలిస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే ఉండదన్నారు. అయితే ధర్మ కర్త పూజారి అయినటువంటి రామ మూర్తి మాత్రం ఇది సాధారణ ప్రమాదం కాదని ఉద్దేశపుర్వకంగానే అమ్మవారి గర్బగుడికి నిప్పు పెట్టి ఉంటారని వారు ఆరోపించారు. ఆలయ ధర్మ కర్త ఇచ్చిన పిర్యాదు మేరకు ప్రమాదమా లేక ఎవ్వరైనా ఉద్దేసపుర్వకంగా నిప్పు పెట్టారా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని అర్బన్ సి ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని మిషన్ హై స్కూల్ రోడ్లో . అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కూల్ డ్రింక్ షాప్ దగ్ధమైంది . జనసేన పార్టీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న చించినాడ శ్రీనివాస్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో సకాలంలో మంటల్ని అదుపు చేశారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు .ఆస్తి నష్టం 3 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
మంగపేట మండలం కమలాపురం సినిమాలు రోడ్ లోని వేమా సాంబశివరావు ఇంటికి అర్ధ రాత్రి మంటలు చెలరేగడంతో పెంకుటిల్లు పూర్తిగా దగ్ధం అయ్యింది. సుమారు 5 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని, అర్ధ రాత్రి ఇంట్లో మంటలు రావడంతో ఎంచెయ్యాలొ తెలియలేదని, ఇంట్లో మంటలు వ్యాపించిన సమయంలో ఇంట్లో ఎవరు లేక పోవడం, పెద్ద ప్రమాదం తప్పిందని సాంబశివారావు తెలియజేసాడు. స్థానిక యువకులు మంగపేట ఎస్సై రవికుమార్ కు సమాచారం ఇవ్వడంతో రవికుమార్ ఫైర్ ఇంజిన్ కు సమాచారం ఇచ్చారని వారు తెలిపారు. ఏటూరునాగారం నుండి ఫైర్ ఇంజిన్ వచ్చే లోపు స్థానిక యువకులు చుట్టు పక్కల జనం మంటలు చెలరేగకుండా చుట్టుపక్కల ఇండ్లకు వ్యాపించకుండా కరెంటు మోటర్ల ద్వారా నీల్లు చల్లడంతో మంటలు అదుపు చేయ్యడం వలన పెద్ద ప్రమాదం తప్పింది.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం లో అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఆటోమొబైల్ షాపు
గన్నవరం లోని స్థానిక సినిమా థియేటర్స్ సెంటర్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ లలో ప్రమాదవశాత్తు ఆటోమొబైల్ షాపులో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ శ్రీనివాస ఆటోమొబైల్ షాపు యజమాని మడతల గురువారెడ్డి గా గుర్తింపు. గన్నవరం బీట్ పోలీసుల సహాయంతో సమాచారం అందుకున్న గన్నవరం అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకుని మంటలను అదుపు చేశారు. పూర్తిగా దగ్ధమైన ఆటోమొబైల్ షాపులోని స్పేర్ పార్ట్స్ సామాన్లు. అర్ధరాత్రి కావడంతో మూసివేసిన ఆటోమొబైల్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరాగడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న గన్నవరం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్…
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం. దాదాపు 50 కోట్లు పైన అగ్నికి ఆహుతి. కోట్ల విలువ చేసే తమ ఆస్తి కళ్ళముందే బూడిద పాలు అవుతున్న వైనం. విశాఖ పాత నగరంలో అలుముకున్న విషాద ఛాయలు. ఈ ఘటనపై ఆరా తీస్తున్న ఉన్నత స్థాయి అధికారులు. అగ్నిమాపక దళాలు, పోలీస్ ఘటనా స్థలానికి చేరుకుంటున్న వైనం. ప్రమాదంపై ఆరా తీస్తున్న విశాఖ ఉన్నతాధికారులు. జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో 40 మెకానిజడ్ బోర్డ్స్ అగ్నికి ఆహుతి అయ్యాయి. మూడు గంటల అగ్నిమాపక సిబ్బంది కృషితో మంటలు అదుపులోనికి వచ్చాయి. ఆస్తి నష్టం కోట్లల్లో ఉంటుందని, తమ కళ్ళముందే అగ్నికి ఆహుతి అయిన బోట్లను చూసి మత్స్యకారులు తీవ్ర మనోవేదనకి గురయ్యారు. ప్రాణ నష్టం లేకుండా మంటలను అదుపులోకి తీసుకు వచ్చామంటున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆనంద్ రెడ్డి వెల్లడించారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది కాంప్లెక్స్ లోని ఒక షాపులో నుండి షార్ట్ సర్క్యూట్ కారణంగా వ్యాపించిన మంటలు, స్థానికులు అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇవ్వగా వారు రెండు నిమిషాల్లోనే అక్కడికి వచ్చి ఆ మంటలను అదుపు చేయడం జరిగింది, దీనివలన ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా అగ్నిమాపక శాఖ వారు సకాలంలో స్పందించడం వలన స్థానికులు అలానే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వారు హర్షం వ్యక్తం చేశారు





Total views : 140944