శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు మద్యాహ్నం కార్తీక పౌర్ణమి ఘడియలు రావడంతో క్షేత్రం భక్తులతో నిండిపోయింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ ముందు బాగంలో గల గంగాధర మండపం వద్ద అత్యంత వైభవంగా కన్నులపండువగా జ్వాలాతోరణోత్సవాన్ని దేవస్థానం నిర్వహించారు ముందుగా ఆలయ ముందుబాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థంబాలపై నూలుతో తయారుచేసిన ఒత్తులను నెయ్యితో తడిపి స్థంబాలపై ఉంచి శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు ఆలయం లోపలి నుంచి ఉత్సవమూర్తులు పల్లకిలో ఊరేగింపుగా తరలిరాగా గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం వద్ద శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ఈవో పెద్దిరాజు,ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్.కె.రోజా, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి జ్వాలాతోరణాలను దివిటీ లతో వెలిగించగా భక్తులు ఓం నమః శివాయ హరిహర మహాదేవ శంభో శంకరా అంటూ శివ నామస్మరణలతో క్షేత్రం మారుమ్రోగింది భారీగా తరలి వచ్చిన భక్తులు జ్వాలాతోరణొత్సవం దర్శనం చేసుకుని పునుతులైయ్యారు ఓ పక్క జ్వాలాతోరణం జరుగుతుండగా మరోపక్క కృష్ణవేణి నదిమాతల్లికి వివిధరకాల హరతులిచ్చి కృష్ణమ్మకు సారె సమర్పించారు మరోపక్క గంగాధర మండపం వద్ద ఒత్తులు మంటలతో వెలుగుతుండగా మరో పక్క భక్తులు జ్వాలాతోరణం కిందనుంచి దాటుతూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు జ్వాలతోరణం ఒత్తుల భస్మాన్ని దక్కించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో పోటీపడగ అనంతరం ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం దశవిధా హారతుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
srisailam temple
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోకి ఎనిమిది అడుగుల భారీ పాము రావడంతో కలకలం చెలరేగింది. పౌర్ణమి గడియలు సమీపిస్తున్న సమయంలో ఆలయ ప్రాంగణంలో పాము సంచరించడం జరిగింది. గర్భాలయం ఎదురుగా ఉన్న ఉమారామలింగేశ్వరస్వామి మండపంలో పాము కనపడటంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.పామును చూసిన భక్తులు కేకలు వేయడంతో ఆలయ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అధికారులు అప్రమత్తమై స్నేక్ క్యాచర్ కు సమాచారం అందజేశారు. పాము ఉన్న ప్రదేశానికి వచ్చిన స్నేక్ క్యాచర్ రాజా చాకచక్యంగా పామును పట్టుకొని వెళ్ళాడు. కాగా గతంలో కూడా పౌర్ణమి రోజుల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో పాములు సంచరించడం జరుగుతుందని, అవి ఎవ్వరికి ఎటువంటి హాని చేయవని భక్తులు, స్థానికులు చర్చించుకున్నారు.
శ్రీశైలంలో కార్తీక సోమవారం మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద,ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఇప్పటికే శని,అది,సోమవారాలలో స్పర్శ దర్శనం,సామూహిక, గర్భాలయా అభిషేకాలు మాసంతం నిలుపుదల చేశారు అలానే మంగళవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే రోజుకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతిస్తామని ఈవో పెద్దిరాజు తెలిపారు నేడు సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు అలానే నేటి సాయంత్రం కార్తీక మొదటి సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.






Total views : 141412