కళ్యాణదుర్గంలో చంద్రబాబు కు బెయిల్ మంజూరుతో టీడీపీ జనసేన కూటమి సంబరాలు మిన్నంటాయి. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటాయి. ఎన్టీఆర్ భవన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పాలాఅభిషేకం పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ జనసేన నాయకులు, ఎన్టీఆర్ భవన్ వద్ద టీడీపీ జనసేన నాయకులు డాన్స్ వేస్తూ ఈలలు కేరింతలతో సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు మాట్లాడుతూ.. న్యాయస్థానం పై నమ్మకం ఉంది కాబట్టే న్యాయం గెలిచిందని, చెప్పిన విధంగానే చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వచ్చాడని, టీడీపీ నాయకులు, రాష్ట్ర ప్రజలు చేసిన పూజలు ఫలించాయని, చంద్రబాబు కు బైయిల్ వచ్చింది. వైసీపీ పతనం ఆరంభమైంది అంటూ ఎద్దేవ చేశారు.
Read Also..




Total views : 140751