చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషకరం, త్వరలోనే స్క్వాష్ పిటిషన్ కూడా అనుకూలంగా వస్తుంది. ఎంతో పేరుగాంచిన గుడివాడ, నాని పనితనంతో గుంతల వాడగా మారింది. గుడివాడలో రోడ్లు వేయ్యనని పబ్లిక్ మీటింగ్ లో, కొడాలి నాని నీసిగ్గుగా చెబుతున్నాడు హైదరాబాద్లో ఉండే వ్యక్తికి గుడివాడ ప్రజల రోడ్ల కష్టాలు ఎలా తెలుస్తాయి…. ప్రజలతో సంబంధం తెగిపోయి అరాచకాలకు పాల్పడుతున్న జగన్ రెడ్డి, కొడాలి నానికు బుద్ధి చెప్పి తీరుతాం. సొల్లు వాగుడు కట్టి పెట్టీ ప్రజల్లోకి రా.. ని బడ్డారం బయట పడుతుంది. పక్క రాష్ట్రాలు మన రోడ్ల మీద జోకులు వేసుకుంటున్న సీఎంకు చిమకుట్టినట్లు లేదు. టిడ్కో ఇల్లంటే టిడిపి, చంద్రబాబే గుర్తుకు వస్తారు. తమ సొంత డబ్బులతో ఫ్లాట్లు నిర్మిస్తున్నట్టు వైసిపి నేతలు బిల్డప్ ఇస్తున్నారు. లెజెండ్ అయిన చంద్రబాబు గొప్పతనాన్ని ఎవ్వరూ తగ్గించలేరు. జగన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబు కాలిగోటి స్థాయికి చేరుకోలేడు. కొడాలి నాని చీకటి సామ్రాజ్యాన్ని నడిరోడ్డుపై నిలబెడతాం
tdp party
చంద్రబాబు నాయుడుకు స్కిల్ స్కాం కేసులో బెయిల్ రావడంతో టిడిపి, కపిలేశ్వర ఆలయంలో గుండు కొట్టించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు
టిడిపి అధినేత చంద్రబాబు కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో తిరుపతి అలిపిరి మెట్ల దగ్గర టిడిపి, జనసేన నేతలు,కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.తమ అధినేతకు అడ్డంకులు తొలగిపోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ లో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
టిడిపి నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పై కక్షపూరితంగా కేసులు పెట్టి జైలు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావడంతో న్యాయం గెలిచిందని, ఎలాంటి అవినీతి చేయిని చంద్రబాబు నాయుడు పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా అక్రమంగా అరెస్టు చేశారని మండి పడ్డారు. ముఖ్యమంత్రి పద్నాలుగు కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడని, అధికారి పార్టీ గుర్తు తెచ్చుకోవాలని, చంద్రబాబు నాయుడు మచ్చలేని నాయకుడని తెలిపారు. చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో కూడా నిర్దోషిగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కుప్పం నియోజకవర్గ టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశం కుప్పం టీడీపీ పార్టీ కార్యాలయం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ mlc కంచెర్ల శ్రీకాంత్, జనసేన ముఖ్య నాయకుడు పసుపులేటి హరి ప్రసాద్ తో పాటు నియోజకవర్గం లోని టీడీపీ జనసేన ముఖ్యనాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం ని జగన్ సర్వనాశం చేసాడని, అక్రమాలకు రాష్ట్రాన్ని అడ్డాగా చెసారని రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా జగన్ ని గద్దె దించెందుకు పనిచేయాలని అన్నారు. జగన్ మూడు అంశాలను తన ఆయుధంగా పెట్టుకొన్నాడని దౌర్జన్యం, డబ్బు, దొంగ ఓట్లు లనే ఆయుదాలుగా మలుచుకున్నాడని రాబోయే ఎన్నికల్లో అన్నిటిని తిప్పికొట్టెందుకు సిద్ధంగా ఉండాలని ఉమ్మడిగా పిలుపు నిచ్చారు. టీడీపీ mlc కంచెర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ చంద్రబాబు దురదృష్టి ప్రతి ఒక్కరికి తెలుసనీ ముక్కుసూటిగా ఉన్న జనసేన అధినేత పవన్కళ్యాణ్ చంద్రబాబు తో కలిసి నడవడానికి ముందుకు రావడం రాష్ట్రానికి శుభసుచకమని అన్నారు. రాష్ట్రాన్ని రావణకష్టంగా మార్చిన జగన్ కి రాబోయే ఎన్నికల్లో టీడీపీ ,జనసేన కచ్చితంగా కోలుకోలేని దెబ్బకొట్టి తమ సత్తా చాటుతాం అని అన్నారు. ఇక మీదట ప్రతి సమావేశంలో కూడా కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని అని అన్నాను
తూ.గో.జిల్లా..
నల్లజర్ల గ్రామంలో గోపాలపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ మద్ది పాటి వెంకటరాజు ఆధ్వర్యంలో బాబు షూరిటి భవిష్యత్ గ్యారెంటీ భారీ బహిరంగ సభ పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల చిన్న రాజప్ప, వర్ల రామయ్య, ఎం.ఏస్ రాజు, కే.ఏస్ జవహర్,నక్కా ఆనందబాబు, కొమ్మా రెడ్డి పట్టాభి ,ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పలు,నియోజకవర్గ ఇన్చార్జి లు బహిరంగ సభలో వేలాది గా పాల్గొన్న తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు
మట్టి దొంగలను అరెస్ట్ చేయాలి అని మైలవరం పోలీసుస్టేషన్ లో ఎస్.ఐ హరి ప్రసాద్ కి పిర్యాదు చేశారు. మండలంలోని పుల్లురు గ్రామంలో రూ.3 కోట్లు విలువైన నిలువ చేసిన మట్టిని తరలిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆయన అనుచరులు ఏ ఎం సి చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డిని అరెస్ట్ చేయాలి. పుల్లూరు గ్రామస్తులు మట్టి తోలకాలను అడ్డుకొని పోలీసులకు పట్టిస్తే కేసు నమోదు చేయకపోగా ఫిర్యాదు ఇస్తే విచారణ చేస్తామని పోలీసులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైసిపి నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చెరువు మట్టి ప్రజల అస్తి అలాంటి సంపదను వైసిపి నాయకులు దోచుకుంటున్నారు. వైసిపి నాయకులు మట్టి దోపిడీ రఘురాం రెడ్డి కి కనిపించటం లేదా అని ప్రశ్నించారు.
ఎంత వరకు చంద్రబాబు నాయుడు పై ఏ కేసులు పెడదాం అని చూస్తున్నారు అని విమర్శించారు. ఒక ఛాన్స్ పేరు తో ఎమ్మెల్యే అయ్యిన వసంత కృష్ణ ప్రసాద్ మట్టి దొంగలను, ఇసుక దొంగలను కాపాడుతున్నారని.., వైసీపీ పార్టీ కార్యాలయం లో ఉన్న అనుచరుల ద్వారా ఎమ్మెల్యే గంజాయి అమ్మిస్తున్నారని ఆరోపించారు. పేర్లు మార్చుకొని దుర్మార్గులు అంత మైలవరం ని చెర పట్టేందుకు గ్రామాల్లోకి వస్తున్నారని వీళ్ళందర్నీ తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
గుంటూరు జిల్లాల్లో టిడిపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ మరి కొద్దిసేపట్లో తొలిసారి సమావేశం కానుంది. టిడిపి తరపున యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి హాజరు అవుతున్నారు. జనసేన నుంచి వరప్రసాద్, శశి కుమార్, శరత్ బాబు హాజరు అవుతున్నారు.రాష్ట్రంలో సంక్షేమం ,అభివృద్ధి, ఎజెండా గా రూపకల్పన చేసే విధంగా ప్రణాళిక ని సిద్దం చేస్తున్నారు. టిడిపి తయారు చేసిన కొన్ని అంశాలకు భవన నిర్మాణ కార్మికులు, ఇసుక పాలసీ, విద్యుత్ చార్జీలు వసూలు లో ప్రజలు ఇబ్బందులు దృష్టి లో ఉంచుకొని మ్యానిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా రైతు ,యువత కార్మికులు సమస్యలను మ్యానిఫెస్టోలో రూపకల్పన చేయనున్నారు. దీంతో పాటు మరో రెండు పర్యాయాలు ఇలాంటి సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం, అన్నురు పంచాయతీ, మిట్ట హరిజనవాడ లో ఉప ముఖ్యమంత్రి కలతూరు నారాయణస్వామి పంచాయతీలో వైసిపి కార్యకర్తలు అభిమానులు భారీ షాక్ ఇచ్చారు వైయస్సార్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి పార్టీలో పనిచేస్తూ తమను పట్టించుకోలేదని చంద్రబాబు నాయుడు పై ఉన్న అభిమానంతో డాక్టర్ థామస్ ను గెలిపించాలని ధ్యేయంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, ప్రతి ఇంటికి స్వీట్ బాక్స్ పంపిణీ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ…. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. అనంతరం డాక్టర్ థామస్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మరియు ఆరు మండలాల నుంచి తెదేపా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డ మంత్రి అంబటి…పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ సీఎం,సీఎం అని అంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీఎం, చంద్రబాబు సీఎం అంటున్నాడు. ఎందుకంటే పవన్ కి క్యాష్ కొడితే వెళ్ళిపోతాడు.పవన్ కళ్యాణ్కు రాజకీయాలు తెలియవు. అతను రాజకీయాలకు పనికిరాడు. అతను నమ్మి వెళితే కుక్కతోక పట్టుకొని గోదారి వీధినట్టే… జగనే ఎందుకు మళ్ళీ సీఎం కావాలంటే,
సంక్షేమ కార్యక్రమాలు అమలు కోసం జగన్ రావాలన్నారు
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్థానిక 20 వ వార్డ్ లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ చదలవాడ అరవింద బాబు ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వ పాలనలో సామాన్య ప్రజలు పడుతున్న బాధలను కష్టాలను అడిగి తెలుసుకొని వారి అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. చదలవాడ అరవింద్ బాబు కామెంట్స్…. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీగల మనిషి అని. యువతకి రైతులకి మంచి భవిష్యత్తు కావాలి అంటే అది బాబు వల్లే అవుతుందని అన్నారు.. నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు,సంక్షేమం లేదు,ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని అన్నారు.. టిడిపి మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగిందన్నారు…మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం తెస్తామని,ఇంట్లో ఎంతమంది మహిళలు అంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మహిళలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో టిడిపి శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు…టీడిపి కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులకు వ్యతిరేకంగా ర్యాలీ….ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి చదలవాడ అరవిందబాబు ,డాక్టర్స్ సెల్ ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల మాజీ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…టీడీపీ సానుభూతి పరుడు గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పై అక్రమ మద్యం కేసు బనాయించిన రొంపిచర్ల ఎస్సై రవీంద్ర ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు…కార్యక్రమం టీడీపీ పార్లమెంట్ కార్యాలయం నుండి కలెక్టరేట్ ,ఎస్పీ కార్యాలయాల వరకూ టిడిపి శ్రేణులు ర్యాలీ నిర్వహించారు…పల్నాడుజిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ రవిశంకర్ రెడ్డిలకు వినతిపత్రం అందజేశారు… ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మీడియాతో మాట్లాడుతూ….రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెం కు చెందిన గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి లీలా మీడియా పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతూ టీడీపీ కి సానుభూతిపరుడుగా వ్యవహరిస్తున్నాడన్న అక్కసుతో స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోలీసులతో అక్రమ మద్యం కేసు బనాయించి రిమాండ్ కు పంపడం దారుణమైన చర్య అన్నారు… ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో పోలీసులు వ్యవహరించారన్నారు…చిన్న తనం నుండి మద్యం అలవాటు లేని గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పై మద్యం విక్రయిస్తున్నాడని కేసు బనాయించి రిమాండ్ కు పంపడాన్ని టీడిపి తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు…ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డ రొంపిచర్ల ఎస్సై రవీంద్ర పై ప్రయివేటు కేసు వేస్తామని టిడిపి నాయకులు అన్నారు…రొంపిచర్ల ఎస్సై రవీంద్ర రొంపిచర్లలో ఇటీవల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించి ఒక గ్రామంపై అసందర్భమైన వ్యాఖ్యలు చేశారని టిడిపి నేతలు ఆరోపించారు…






Total views : 141413