తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, నేడు శ్రీవారి సర్వ దర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 56,344
మంది భక్తులు దర్శించుకుని. మొక్కులు చెల్లించుకున్నారు.నిన్న హుండీ ఆదాయం. 4.26 కోట్లు..శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…17,616 మంది, శ్రీవారి సర్వదర్శనానికి 05 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లు లేని భక్తులకు 08 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.
tirumala videos
శ్రీవారి దర్శించుకున్న చంద్రబాబు మాట్లాడుతూ పాద పద్మాల చెంత పుట్టి అంచెలు అంచెలుగా ఏదిగా. అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారు నన్ను కాపాడారు. కష్టం వచ్చినప్పుడు స్వామి వారిని మొక్కకున్నా. ధర్మాన్ని కాపాడమని స్వామి వారిని ప్రార్ధించా. మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమల కు వచ్చి దర్శనం చేసుకున్నా. భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి..తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలి. ప్రజలకు సేవ చేసే శక్తీ,సామర్థ్యలు ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నాను. త్వరలోనే నా కార్యాచరణ ప్రకటిస్తా అని చంద్రబాబు అన్నారు.
తిరుమలలో భారీ వర్షం కురిసింది. సోమవారం మధ్యాహ్నం కురిసిన ఈ వర్షంతో శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలు జలమయమయ్యాయి. దర్శనానికి క్యూలైన్లలో వెళ్లిన భక్తులతో పాటు బయట వేచి ఉన్న భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. వర్షంతో భక్తులు అతిథిగృహాలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా తిరుమలలో చలి తీవ్రత మరింత పెరిగింది.





Total views : 141435