ఎమ్మిగనూరు, కర్నూల్ జిల్లా డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె నేటికీ 40 వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా ఎమ్మిగనూరులో అంగన్వాడీలు సోమప్పా సర్కిల్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి శివ సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక్క అవకాశం అన్నందుకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్న పాపానికి మహిళలు రోడ్లెక్కే పరిస్థితి ఎదురైందని ఆరోపించారు. ఇన్నిరోజులుగా అంగన్వాడీలు ఇళ్ళు, కుటుంబాలను వదిలి రోడ్లెక్కి నిరసనలు చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనీ అమలు చేయాలని కోరుతున్నామని అదనంగా మేము ఏమి కోరడం లేదన్నారు. 40 రోజులు అవుతున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఎంత ఆలస్యం చేస్తే అంత పెద్ద ఎత్తున ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని హెచ్చరించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చాలని, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేసి, ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.
ys jagan
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ కోడి కత్తి శ్రీను ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలంటూ టిడిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఒకరోజు ఆమరణ నిరాహార దీక్ష. దీని పై టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఎస్సీ అయిన దళిత బిడ్డ కోడి కత్తి శ్రీను ను జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి పైసాచిక ఆనందం పొందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో దళితులపై అనేక రకాల దాడులు చేసిన ప్రభుత్వ ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి వచ్చే సమయం కూడా కేటాయించక పోవడంతో న్యాయస్థానం కూడా ఆలోచన చేయాలి. కోడి కత్తి శ్రీనును జైలు నుంచి విడుదల చేసేంతవరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఒక దళిత బిడ్డను ఐదు సంవత్సరాల నుంచి జైల్లో పెట్టడం పూర్తిగా ప్రభుత్వ కుట్ర పూరిత చర్య. న్యాయం కోసం కోడి కత్తి శీను, తల్లి సోదరుడు నిరవదిక దీక్ష చేయడంపై తెలుగుదేశం పార్టీగా మా మద్దతు తెలియజేశాం. జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకు తాడేపల్లి ప్యాలెస్ వద్దకు తన బాధను విన్నవించుకుందాం అని వెళ్తే లేడీ కానిస్టేబుల్ తో దుర్భాషలాడి బయటకు గెంటివేశారని విమర్శించారు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి కి లేదని తెలిపారు.
టీడీపీ నాయకత్వంపై అలకబూని వైసీపీకి దగ్గరైన విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తన సొంత నియోజకవర్గం నుంచే ఎంపీగా పోటీ చేయనున్నారు. వైసీపీ నాయకత్వం విడుదల చేసిన మూడో జాబితాలో కేశినేని నానిని విజయవాడ పార్లమెంటు స్థానం ఇన్చార్జిగా నియమించారు. దీనిపై కేశినేని నాని స్పందించారు. వైసీపీ తరఫున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ కేశినేని నాని పేర్కొన్నారు. మీ నాయకత్వంలో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం పాటుపడతాను” అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
Read Also..
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అధికార పార్టీని వీడుతున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి త్వరలో ప్రకటన చేస్తానంటూ తన ట్వీట్ లో వెల్లడించారు. కొంతకాలంగా జగన్ పాలనపై అంబటి రాయుడు ప్రశంసలు కురిపించారు. గతేడాది డిసెంబర్ 28న ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే, రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు రాయుడు తన తాజా ట్వీట్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.
కడప జిల్లా, కాజీపేటలో 300 కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశం లోకి చేరిక. వైకాపా ఎంపీటీసీ చంద్ర భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు టీడీపీ ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో టీడీపీలోకి చేరికలు. సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి కావాలని సొంత పార్టీ ఎంపీటీసీ అడిగితె సస్పెండ్ చేసిన ఘనత వైకాపా కు చెందుతుంది. వైకాపా ఎంపీటీసీనే చేరుతున్నారంటే వారి అరాచకం అర్ధం అవుతుంది. రాష్ట్రానికి అభివృద్ధి కావాలి సంక్షేమం కాదు. అభివృద్ధి లేకుండా సంక్షేమం పనికిరాదు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని రాత్రికి రాత్రే అరెస్టు చేస్తారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది. నియంత పాలన ఎక్కువ రోజులు ఉండదు. మైదుకూరు శాసనసభ్యులు రఘురామిరెడ్డి కి దోచుకోవడం తప్పితే అభివృద్ధి చేయడం తెలియదు. శాసనసభ్యుడు రఘురామిరెడ్డికి సంక్షేమానికి, అభివృద్ధికి తేడా కూడా తెలియదు. తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యం అని వైకాపా నుంచి తెలుగుదేశం లోకి చేరుతున్నారు. తెలుగుదేశం లోకి స్వచ్ఛంగా చేరుతున్న వైసీపీ పార్టీ అధికార నాయకులు. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. కాజీపేట మండలం అభివృద్ధిలో వెనకబడి ఉంది అని వెల్లడించారు.
తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికైన నూరి ఫాతిమా మాట్లాడుతూ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. నా పై నమ్మకంతో తూర్పు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించిన జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. గుంటూరు 1 టౌన్ లో మైనార్టీ మహిళకు అవకాశం ఇవ్వడం జరిగింది. జగనన్న నా పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా గుంటూరు 1 టౌన్ లో భారీ మెజారిటీతో గెలుపొంది జగనన్నకు గిఫ్ట్ గా అందిస్తాను. ప్రజలకోసం నిరంతరం కష్ట పడతాను. మా నాన్నగారు ఎలా అయితే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారో అదే విధంగా ప్రజలకు చేరువలో ఉంటాను.
వైస్సార్ జెండా రెపరెపలాడేలా కృషి చేస్తాను. నన్ను ఈ స్థానంలో నిల్చోబెట్టిన వైసీపీ అధిష్టానం కు తూర్పు కార్యకర్తలుకు, నాయకులకు ధన్యవాదాలు.
తిరుపతి, టిటిడి కేటాయిస్తున్న ఇళ్ల పట్టాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటోను వ్యతిరేకిస్తున్న విపక్షాలు. పట్టా పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటారని ఎక్కడికక్కడ నాయకులను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. మహతి ఆడిటోరియం లో పట్టా పంపిణీ కార్యక్రమంలో భారీ పోలీసు బందోబస్తు. తిరుపతిలో టిడిపి, జనసేన, సిపిఎం నాయకులను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. టిటిడి ఉద్యోగస్తులకు పట్టాల పంపిణీని స్వాగతిస్తున్నాం అని, కానీ పట్టాలపై ఓపక్క వెంకటేశ్వర స్వామి ఫోటో, మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు టిడిపి సీనియర్ నాయకులు వూకా విజయ కుమార్. టిడిపి నాయకులను జనసేన నాయకులను హౌస్ అరెస్టు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు ఇంటి పట్టాలపై వేసిన ఫోటోలు రేపు సేవా టికెట్లపై అలాగే టిటిడి సంబంధించిన వెబ్సైట్లో కూడా జగన్ ఫోటో పెడతారా అంటూ టిటిడిఈఓ ధర్మారెడ్డిని, చైర్మన్ కరుణాకర్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ద్వారా గాని టీటీడీ నిధులు తో గాని ఇవ్వనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటోను ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు. టిటిడి ఉద్యోగస్తులు వారి సొంత డబ్బుతో కొనుక్కుంటున్న జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. కేవలం కరుణాకర్ రెడ్డి తన కొడుకు అభినయ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారని,ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడానికి కూడా వీలు లేకుండా పోలీసులతో హౌస్ అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచిది కాదని త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు అందిస్తున్న ఇంటి స్థలాల ప్రొసీడింగ్స్ పై ఒకవైపున టిటిడి ఎంబ్లం తో కూడిన వెంకటేశ్వర స్వామి బొమ్మ, మరోవైపున జగన్మోహన్ రెడ్డి బొమ్మను పెట్టి ప్రొసీడింగ్స్ ఇవ్వడం అభ్యంతరకరమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. టీటీడీ ఉద్యోగులకు ఇచ్చే ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్ లోను రాజకీయ పార్టీ నేతల బొమ్మలను ప్రచురించడం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రచార ఖండూతికి ఇది పరాకాష్టగా ఆయన అభివర్ణించారు. ఇప్పటివరకు సైన్ బోర్డులు, వైఎస్ఆర్ కిట్లు, జగనన్న విద్యా దీవెన, జగనన్న పథకాలకు తన ఫోటోను తగిలించి సంబరపడిపోతున్న ముఖ్యమంత్రి ఆఖరుకు తిరుమల వెంకటేశ్వర స్వామి తో సమానంగా తన ఫోటోను ముద్రించి ఇవ్వడం భక్తుల మనోభావాలతో చెలగాట మాడటమేనని ఆయన అన్నారు. తక్షణం ప్రొసీడింగ్స్ పై ఫోటోలను తీసి వేయాలని టిటిడి యాజమాన్యానికి ఆయన సూచించారు. కందారపు మురళి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి.
జగన్ మాటలు వింటుంటే జబర్దస్త్ షో లో బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడు – లోకేష్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. జగన్ మాటలను దగ్గరగా చూస్తే జబర్దస్ షోలోని బిల్డప్ బాబాయి గుర్తొస్తారని పేర్కొన్నారు. ఆయన మాటలు కోటలు దాటుతాయని, పనులు మాత్రం గడపదాటవన్నారు. జగన్ తన సొంత ఇలాకా కడప జిల్లాలో మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తిచేస్తానని చెప్పి తొలి శిలాఫలకం వేసి నాలుగేళ్లు అయిందని గుర్తు చేశారు. రూ. 15 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ నిర్మించి 25 వేల మందికి ఉద్యోగం ఇస్తానని నాడు కోతలు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి, ఉదయం 11 గంటలకు జగనన్న విదేశీ విద్యాదీవెన,జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పధకాల నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్. విదేశీ విద్యా దీవెన కింద విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.60 కోట్లు విడుదల. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత ఉత్తీర్ణత సాధించిన 95 మందికి,తిరిగి మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా కోటి రూపాయలు విడుదల. మొత్తం 42.60 కోట్లను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్..





Total views : 141268