జనగామ జిల్లా కేంద్రంలోని 13 వ వార్డు లో పళ్ళ రాజేశ్వర్ రెడ్డి ప్రచారం నిర్వహించడం జరిగింది… ప్రచారంలో భాగంగా బీడీలు చుట్టి గడప గడప తిరుగుతూ ఓటర్స్ తో ముచ్చటించారు.. జనగామ పట్టణం ఇప్పటికే బాగా అభివృద్ది అయింది ఇంకా బాగా కావాల్సిన అవసరం ఉన్నది జిల్లా అయిన తరవాత చుట్టుపక్కల ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నారు కాబట్టి వాళ్ల అందరికి విద్యా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది చేసే పనులు చేస్తున్నాం అని చెప్తున్నాం చేయలేని పనిలు కాదు అని వివరిస్తున్న జనగాం పట్టణములో చాలామంది పేదలకి ఇళ్లు లేని వారికీ కచ్చితంగా గృహలక్ష్మి ఇస్తాం అని మాట ఇచ్చిన జనగాం సమగ్ర అభివృద్ధిలో భాగంగా పేదలకు ఇళ్లు ఇస్తాం ఎవరికైతే పెన్షన్ రాలేదో ఒకటే నెలలో పెన్షన్ ఇస్తాం కేసిఆర్ కొత్తగ ప్రవేశ పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో గృహ లక్ష్మి, పెన్షన్ పెంపు, గ్యాస్ ధర 400 పథకాలు ప్రచారం చేస్తున్నాం..
Warangal
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్ లో ఎన్నికలు ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ .. కరీంనగర్ లో డిపాజిట్ కూడా రాణి వ్యక్తి ఇవ్వాళ మాట్లాడు తున్నాడు. అక్కడ నాలుగు సార్లు ఓడిపోయిండు కానీ ఇక్కడికి వచ్చి గెలుస్తా గెలుస్తా అని ఎగురుతాండూ. ఇక్కడికి వచ్చి కులరాజకీయాలు చేస్తున్నాడు. గతంలో ఆయన పై ఉద్యమంలో పెప్పర్ స్ప్రే జరిగింది. దాంతో మూర్ఛ వచ్చి పడిపోయాడు అప్పటి నుండి కోల్పోయి ఏవేవోమాటలు మాట్లాడుతున్నాడు అంటూ పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడిన బిఆరెస్ అభ్యర్థి ఒడితల సతీష్ కుమార్.
Read Also..
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మధ్య రీజినల్ బ్యూరో అధికార ప్రతినిధి ప్రతాప్ లేఖ విడుదల…బూటకపు ప్రజాస్వామ్య అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించిన ప్రజలకు విప్లవాభివందనాలు మా పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ 5 రాష్ట్రాలలో జరుగుతున్న బూటకపు విధానసభ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ లో తొలి విడుత నవంబర్ 7నాడు జరిగిన ఎన్నికలలో మా ఉద్యమ ప్రాంతాలలోని మెజార్టీ ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. మధ్య రీజినల్ బ్యూర్ అభినందిస్తున్నది. ఉద్యమ ప్రాంతాలలో ఒకటైన బీజాపుర్ నియోజికవర్గం లో కేవలం 41 శాతం పోలింగ్ మాత్రమే జరిగి దాదాపు 59 శాతం ప్రజలు ఎన్నికలను బహిష్కరించి వాటి బూటకత్వాన్ని ఎండగట్టారు. ఛత్తీస్ గఢ్ లో విధానసభ ఎన్నికలు రెండు విడుతలుగా జరుపుతున్నారు. తొలి విడుత పోలింగ్ జరిగిన 20 నియోజికవర్గాలు మా ఉద్యమ ప్రాంతంలోనే వుండడంతో వీటిలో 1-2 చోట్ల మినహా ఎక్కడా 50-60 శాతానికి మించి పోలింగ్ జరుగలేదు. మా ప్రాంతాలలోని ప్రజలు తాము ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకుంటున్న విప్లవ ప్రజా కమిటీ (జనన సర్కార్)లపైనే మరోమారు తమ విశ్వాసాన్ని ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రజలలో భయోత్పాతాన్ని సృష్టించడానికి పెద్ద ఎత్తున అదనపు అదనపు భద్రతా బలగాలను దించారు. ఇప్పటికే వేలాది సంఖ్యలో అడుగడుగున తుపాకులు ధరించిన ఖాకీలతో అడవులు నిండిపోగా, మరిన్ని అదనపు బలగాలను తెచ్చి మొహరించినప్పటికీ, ఎన్నికల అధికారిని రీనాబాబా సాహెబ్ కంగాలీ పదే పదే ఓట్లు వేయాలనీ విజ్ఞప్తులు చేసినప్పటికీ పనికి రాని ప్రజాస్వామ్య మంత్రం పారలేదు. ప్రజల రక్షణలో నిలిచిన మా వీర పీ.ఎల్.జీ.ఏ గెరిల్లాలు కేంద్ర, రాష్ట్ర పోలీసుల అణచివేత చర్యలను ప్రతిఘటించడంలో భాగంగా దాదాపు 10 మంది పోలీసులు మరణించడమో, గాయపడడమో జరిగింది. అక్కడక్కడ పోలింగ్ సిబ్బంది కూడ గాయపడ్డారు. ప్రజల రక్షణకు అంకితమైన .పీ.ఎల్.జే.ఏ. గెరిల్లాల సాహసిక చర్యలను సీ.ఆర్. బి. అభినందిస్తున్నది. ఎన్నికల సిబ్బంది ఇప్పటికైనా మా ప్రాంతాలలోకి పోలీసులు వెంట రాకూడదని మరో మారు విజ్ఞప్తి చేస్తున్నాం. అతి త్వరలో తెలంగాణలోనూ ఎన్నికలు జరుగునున్నాయి. ఎన్నికల బహిష్కరణలో నమూనాగా నిలిచిన ఛత్తీస్ గఢ్ బీజాపుర్ ప్రజలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలోనూ ఎన్నికలు బహిష్కరించాలనీ మరో మారు విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ, దానిని అంటకాగుతున్న బీ.ఆర్.ఎస్.ను తన్ని తరమాలనీ మరోమారు పిలుపునిస్తున్నాం
హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి డాక్టర్ పగడాల కాళిప్రసాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండ్ కూడలి వరకు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో భాగంగా బైక్ పై వస్తున్న యువకున్ని అడ్డుకుని ఆకారణంగా ఆ యువకున్ని CRPF పోలీస్ కానిస్టేబుల్లు చేయి చేసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు.. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ లోనికి చొచ్చుకు పోయి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం CI వెంకట రత్నం చొరవతో యువకున్ని విడుదల చేయడంతో గొడవ సర్దుమనిగింది..
పాలకుర్తి గడ్డకు ఒక చరిత్ర ఉంది.. పోరాట పటిమ ఉంది..మిమ్మల్ని చూస్తుంటే దొరల కడ్డీలను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోంది
అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. పాలకుర్తి కాంగ్రెస్ విజయభేరి యాత్ర సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ
ఒకనాడు డీలర్ గా ఉన్న దయాకర్ రావు దందాలు చేసి ఇప్పుడు డాలర్ దయాకర్ రావు అయిండన్నారు.. ఝాన్సీ రెడ్డి కుటుంబం పేదలకు సేవలు చేశారు.మీకు సేవచేసేందుకు కాలేజీలు, ఆసుపత్రుల కోసం 80 ఎకరాల భూమి కొంటే దయాకర్ రావు లిటిగేషన్లు పెట్టి ఇబ్బందులు పెట్టిండన్నారు. రేవంత్ రెడ్డి వస్తే తెలంగాణను అమ్ముకుంటాడని కేసీఆర్ అంటున్నాడు .. 2009లో సికింద్రాబాద్ ఎంపీ సీట్లు కేసీఆర్ అమ్ముకున్నాడన్నారు. పాలకుర్తిలో కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించండి…ఈ ఎన్నికలు కేసీఆర్ నలుగురు కుటుంబ సభ్యులకు… నాలుగు కోట్ల ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని దొరల తెలంగాణ కావాలో, ప్రజల తెలంగాణ కావాలో నిర్ణయించుకోండి అని అన్నారు.
నగాం నియోజకవర్గం కాంగ్రెస్స్ పార్టీ అభ్యర్థి గా నామినేషన్ వేయటం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర కేంద్ర నాయకులకి ధన్యవాదాలు. ఎలాంటి అక్రమాలకు భూ కబ్జాలు చేయకుండ నిజాయితిగా నియోజక వర్గ అభివృద్ధి కోసం పనిచేస్తా జనగామ నియోజక వర్గ ప్రజలు నాకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా పది సంవత్సారాల పరిపాలనలో చేసింది ఎం లేదు కెసీఆర్ ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చారు ముత్తి రెడ్డి యాదగిరి చెప్పిండు కెసిఅర్ అడిగినంత అమౌంటు నేను ఇవ్వలేకపోయా నాకన్నా ఎక్కువ అమౌంటు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇచిండు కనకే టికెట్ ఇవ్వడం జరిగింది అన్నారు గతంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పరిపాలనలో మొత్తం భూకబ్జాలు అక్రమాలు, అవినీతులు ఇప్పుడు కూడా పళ్ల అంతకంటే ఎక్కువ కబ్జాలు అక్రమాలు చేసి ముత్తిరెడ్డి కన్నా ఎక్కువ అమౌంట్ కేసిఆర్ కు ఇవ్వాలి అనే ఒప్పందంతోనే పల్లాకి టికెట్ ఇచ్చారు కెసిఅర్ పాలనలో అన్ని రకాల అరాచకాలు పరిపాలన అస్తవ్యస్థంగా దుర్మార్గుడి పరిపాలనలో తెలంగాణ ఉన్నదీ ఇదే నెలలో దీపావళి ఉన్నదీ కానీ నిజమైన దీపావళి వచ్చే నెల వస్తుంది కెసిఅర్ అనే నరకాసురుడు దుర్మార్గుడు పోయి కాంగ్రెస్స్ ఇందిరమ్మ పాలన వస్తుంది ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉంటారు నిజమైన దీపావళి మూడు తారీకు సాయంత్రం చేసుకుందాం అన్నారు.
Read Also..
Read Also..
జనగామ జిల్లా, నవంబర్ 7, మంగళవారం, జనగామ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి. కుటుంబం సభ్యులతో కలిసి బిఆర్ఎస్ అభ్యర్థి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి 2 నామినేషన్ దాఖలుచేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి తో పాటు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ మురళి కృష్ణకు 098 అసెంబ్లీ నియోజవర్గం అభ్యర్ధిగా తన 2 సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగామ ఎమ్మెల్యేగా మంత్రులుగా జనగామను అభివృద్ధి చేసిన వారు నా వెంట ఉన్నారు. వారు సూచనలు సలహాలు తీసుకొని కురుక్షేత్రంలో కూడా ముందుకు వెళ్తానని చెప్పారు ఎన్నికల్లో గెలుస్తానని ఉధీమా వ్యక్తం చేశారు.
Read Also..
Read Also..
డోర్నకల్ కాంగ్రెస్ కార్యకర్తలు లేకుంటే తనకు టికెట్ వచ్చేది కాదని , డోర్నకల్ కాంగ్రెస్ అభ్యర్ధి జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రంలోని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకొని ,ప్రచార రథానికి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడారు..అన్ని మండల,బూత్ ల, గ్రామాల నాయకులు ,మాజీ ప్రజాప్రతినిధులు, ఉద్యమ కారులు కార్యకర్తలతో కలిసి అందరూ సమిష్టిగా కలిసి పనిచేయాలని ,మాలోత్ నెహ్రు నాయక్ తాము కలిసే కార్యక్రమాలలో పాల్గొంటామని అన్నారు. రాంచంద్రునాయక్ కు టికెట్ రావద్దని స్థానిక ఎమ్మెల్యే వీరభద్రస్వామి ని మొక్కుకున్నాడని ఎద్దేవా చేశారు. ఈ ఇరవై రోజులు కలిసి కట్టుగా నిద్రాహారాలు మాని పనిచేయాలని,డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పునర్వైభవం రబోతున్నాదని,తొమ్మిదవ తారిఖు రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నదని ,సోనియాకు జన్మదిన కానుకగా రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసి ఇవ్వాలని ,రెడ్యానాయక్ ఈ ఎన్నికల్లో వేసే కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి మాత్రమే కార్యక్రమాలు ఉండాలని అన్నారు.
జనగామ నియోజకవర్గ బిజెపి పార్టీ అభ్యర్థి ఆరుట్ల దేశమంతా రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు వారు ఏ గ్రామానికి వెళ్లిన మహిళలు మంగళ హారతుల తోటి స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. డబ్బులు ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఇక్కడి ప్రజలు స్థానికేతుడు వద్దు స్థానికుడే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్థానికుడు కాకపోవడం వలన జనగామ అభివృద్ధి చెందలేదని జనగామ అభివృద్ధి చెందాలి అంటే బిజెపి పార్టీ అభ్యర్థి అయిన తనకు ఓటు వేయాలని కోరారు.






Total views : 149609