త్రిపురలో గవర్నర్ గా భాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం కోసం తిరుమలకు వచ్చా.. తనపై నమ్మకంతో నాకు అప్పగించిన భాధ్యతలను నిర్వర్తించేందుకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధించా.. త్రిపురలో కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించాలని అక్కడి ప్రజలు ఆశీస్సులు.. టిటిడి ఛైర్మన్, ఈవోని కలిసి త్రిపుర ప్రజల భావాలను తెలియజేశాను.. త్వరలోనే త్రిపురలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంను నిర్మించేందుకు టిటిడి ఛైర్మన్, ఈవో సానుకూలంగా స్పందించారు..