Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టదా…మాజీ ఎమ్మెల్యే చింతమనేని

రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టదా…మాజీ ఎమ్మెల్యే చింతమనేని

by Prakash
chinthamanenni prabhakar

తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు టిడిపి ఇన్చార్జ్ బడేటి చంటీ, గంటా మురళి తదితరులు విమర్శించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం లోని తుఫాను వల్ల నష్టపోయిన పంట పొలాలను టిడిపి బృందం పరిశీలించింది. సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని రైతులను పరామర్శించడానికి పంట నష్టం అంచనా వేయడానికి ఏ ఒక్క అధికారికి కూడా రాలేదని మండిపడ్డారు. పంట కాలువలో పూడిక తీయక పోవడం వల్ల కురిసిన వర్షం నీరు బయటకు వెళ్లే మార్గం లేక పంట నష్టం తీవ్రంగా ఉందని అన్నారు.. పండిన పంట చేతికి వచ్చే సమయం లో వచ్చిన ఈ కష్టాన్ని ప్రభుత్వ భరించాలని రంగు మారిన మొలకెత్తిన ధాన్యం బేషరతుగా ప్రభుత్వం కొనాలి, అలా కొనని పక్షంలో మార్చి తర్వాత ఏర్పడే టిడిపి జనసేన ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని తెలిపారు. అధికారులు వైఎస్ఆర్సిపి నాయకులు కేవలం ఏసీ రూములకే మాత్రమే పరిమితం అయ్యారని విమర్శించారు.. వైయస్సార్సీపి పార్టీకి టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించడం పై ఉన్న శ్రద్ధ రైతుల పంట పొలాలు పరిశీలించడంలో లేదని మండిపడ్డారు.. రైతులకు ఎల్లప్పుడూ టీడీపీ పార్టీ అండగా ఉంటుందని బరోసా ఇచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

014637
Total views : 80656

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.