రాష్ట్రంలో కులమతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చిలకలూరిపేట నియోజకవర్గ వైసిపి అభ్యర్ధి కావటి శివనాగ మనోహర్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో చిలకలూరిపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. సాగునీరు, త్రాగునీరు శాశ్వతంగా అందించే దిశగా తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. అలాగే పట్టణంలో ఉన్న ప్రధాన సమస్య ఆటో నగర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి పనిగా ప్రారంభించేది ఆటో నగర్ కార్యక్రమం అని పేర్కొన్నారు. ఖచ్చితంగా చిలకలూరిపేటలో మరోసారి వైసిపి జెండాను ఎగురవేసి, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించటానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. కేసులకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో…
- రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్ కుమార్ గౌడ్.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా పార్టీకి సంబంధించిన అంశాలపై మాట్లాడటం సబబు కాదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్గా పరిగణిస్తున్నామని.. ఈ వ్యవహారంపై హైకమాండ్ దృష్టి కూడా ఉందన్నారు.…
- ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఈ నెల 25న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. కనేకల్-1, కనేకల్-2 పేర్లతో ఏర్పాటు చేయబోయే పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి