Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh కస్తూర్బా హాస్టల్ లో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవిత

కస్తూర్బా హాస్టల్ లో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవిత

by Satya
కస్తూర్బా హాస్టల్ లో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవిత

శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి కస్తూర్బా హాస్టల్ లో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవిత . విద్యార్థినులు తమ సమస్యలపై మంత్రికి నేరుగా లేఖ రాయడంతో మంత్రి స్వయంగా వచ్చి విద్యార్థులతో ముచ్చడించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సమస్యలపై విద్యార్థినిలు వ్యక్తిగతంగా మంత్రి సవిత తో మాట్లాడారు. ముఖ్యంగా హాస్టల్ ఇంచార్జ్ ఎస్ఓ శాలిని దేవి తమతో డబ్బులు వసూలు చేస్తున్నారని, అర్ధరాత్రి సమయంలో ఇంచార్జ్ ఎస్ ఓ హాస్టల్ నుండి బయటికి వెళ్లడం రావడం తమకు భయమేస్తుందని, అని తెలియజేశారు. మంత్రి హాస్టల్ లోని వంటగది నీ పరిశీలించి అక్కడ కుళ్ళిపోయిన కాయగూరలను చూసి హాస్టల్ వార్డెన్ తో మీ ఇంటికి కూడా ఇలాంటి కాయగూరలతో భోజనాలు చేస్తారంటూ ఆగ్రహాన్నివెలిబుచ్చారు . బాత్రూమ్స్ లో పరిశీలించి శుభ్రంగా లేకపోవడంతో హాస్టల్ వార్డెన్ పై మండిపడ్డారు. హాస్టల్ వార్డెన్ శాలిని దేవి వ్యవహార శైలిపై , ఆమెపై వచ్చిన ఆరోపణలతో వెంటనే శాలిని దేవి పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.
    ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్‌. మాధవ్‌ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
  • అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.
    అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రత్యేక జాబితాలో భారత సంతతికి చెందిన ప్రముఖులు సత్తా చాటారు. అమెరికాలో నివసిస్తున్న విజయవంతమైన 250 మంది వలసదారుల జాబితాలో ఏకంగా 27 మంది భారతీయ మూలాల వ్యక్తులు చోటు…
  • విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌
    క్రికెట్‌ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయన విమానంలో క్రికెట్ ఆడి అందరినీ అశ్చర్య పరిచారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓ ప్రైవేట్‌ విమానంలో ప్రయాణించిన సచిన్‌… అందులోనే సరదాగా టెన్నిస్ బాల్ క్రికెట్…
  • ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్‌లో బలమైన ఆరంభం.
    ఇంగ్లాండ్ మహిళల జట్టు, శ్రీలంక మహిళలపై జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన ఆధిపత్యాన్ని చూపుతూ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, 20 ఓవర్లలో కేవలం 1 వికెట్…
  • దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.
    దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.తాజాగా తుగ్లకాబాద్‌లోని ఓ భవనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

023160
Total views : 141258

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.