Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్…

దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్…

by Prakash
Chief Minister Jagan

Chief Minister Jagan :

చంద్రబాబు ఆక్వా రంగానికి చేసింది శూన్యం అని రాష్ట్ర పశు సంవర్ధక, మత్య శాఖ మంత్రి శిదిరి అప్పలరాజు అన్నారు. నరసాపురంలో ఆంధ్రప్రదేశ్ ఫీషరిష్ యూనివర్సిటి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన మత్య సంపద జగ్రుక్త అభియాన్ వర్క్ షాప్ లో నరసాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం జగన్ అధికారంలోకి రాగానే ఆక్వా రంగానికి పెద్దపీట వేస్తూ ఆక్వా రైతులకు లబ్ది చేకూర్చే కార్యక్రమాలు చేశారన్నారు. నరసాపురంకు ఆక్వా యూనివర్సిటీ సాధించిన ఘనత ముదునూరి ప్రసాద్ రాజుకే దక్కిందన్నారు. చంద్రబాబు ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ లను పెట్టింది జగన్మోహన్ రెడ్డి అనడం చాలా హస్యస్పదంగా ఉందన్నారు. ఆక్వా జోన్ లో ఉన్న 10 ఎకరాల లోపు రైతులకు 3 లక్షల 45 వేల ఎకరాలకు ఇచ్చిన మాట ప్రకారం కరెంటు యూనిట్ కి 1.50 పైసలు సబ్సిడీ ఇవ్వడం జరిగిందన్నారు. 3480 కోట్లు ఆక్వా రైతులకు సబ్సిడీ ద్వారా అందించిన దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కొనియాడారు. ప్రతి కనెక్షన్ కి 7 లక్షల రూపాయలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

026308
Total views : 150204

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.