ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖపట్టణంలోని సెంట్రల్ జైలును సందర్శించారు. అనంతరం అధికారులతో చర్చించిన మంత్రి.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 800 మంది ఖైదీల సామర్థ్యం ఉన్న విశాఖ సెంట్రల్ జైల్లో ఏకంగా 2000 మందిని ఉంచారన్నారు. ముఖ్యంగా ఈజీ మనీకి అలవాటుపడి గంజాయి సరఫరా చేస్తూ.. 1200 మంది యువకులు పోలీసులకు పట్టుబడ్డారని.. వారంతా ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్నారని,, వారిలో చాలా మందికి బెయిల్ వచ్చినప్పటికి షూరిటీ లేకపోవడంతో జైల్లోనే మగ్గిపొతున్నట్లు తెలిపారు.
అలాగే ఈ విషయంపై హోం సెక్రటరీ తో మాట్లాడి వారిని విడిపించేందుకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేస్తామని హోంమంత్రి అని తెలిపారు. విశాఖ జైలును సందర్శించిన హోంమంత్రి అనిత త్వరలోనే జైల్లలో డి-అడిక్షన్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్ విషయంలో రాజకీయ జోక్యం ఉండదని.. ఎవరైనా రాజకీయ నేతలు పోలీసులపై ఒత్తిడి చేస్తే తన దృష్టికి తీసుకురావాలని హోంమంత్రి అనిత పోలీసులకు సూచించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్లో అక్కినేని నాగార్జున.అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ…
- నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.సిక్కింలో భారీ విషాదం చోటుచేసుకుంది. దక్షిణ సిక్కింలోని సమర్దుంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందారు. వారి మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 20 మందికిపైగా…
- ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.ఫుట్బాల్ ప్రపంచకప్కు కొత్త ఛాంపియన్ దక్కింది. న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ అదనపు సమయంలో 1-0తో విజయం సాధించి ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హాజరుకావడంతో..ఈ మ్యాచ్తో పాటు…
- మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం.మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం మరింత తీవ్రంగా మారుతోంది. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న సైనిక దాడులు కొత్త మలుపు తిరిగాయి. తాజాగా జోర్డాన్లోని అల్-అజ్రాఖ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ భారీ క్షిపణి, డ్రోన్ దాడులు…
- వర్షాకాల సమావేశాల తొలి రోజే పార్లమెంట్లో రచ్చ.సభలో నిరసనలు కొనసాగుతుండగానే.. పార్లమెంట్ వెలుపల కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో పార్లమెంట్’ కార్యక్రమం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 221456