సీనియర్ జర్నలిస్ట్ , సినీ దర్శకుడు కె.జయదేవ్ నిన్న రాత్రి గుండె పోటుతో హైదరాబాద్ లో చనిపోయారు. జయదేవ్ దర్శకత్వం వహించిన “కోరంగి నుంచి” చిత్రానికి జాతీయ చలన చిత్రాభివృద్ది సంస్థ నిర్మించింది. ఈ చిత్రం జాతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. భారతరత్న సి.ఎన్.ఆర్. రావు పై ఫిలిమ్స్ డివిజన్ కు డాక్యుమెంటరీ నిర్మించారు. ప్రముఖ దర్శకుడు జరలిస్టు కె ఎన్ టి శాస్త్రి కి జయదేవ్ చిన్న కుమారుడు. జయదేవ్ కు భార్య యశోద, కుమారుడు, కుమార్తె ఉన్నారు.