Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home National పాత పెన్షన్ విధానం కొనసాగిస్తే దేశం నాశనం అయినట్టే..!

పాత పెన్షన్ విధానం కొనసాగిస్తే దేశం నాశనం అయినట్టే..!

by Satya
Dr. Jayaprakash

పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తే భారతదేశ భవిష్యత్తు సమాధి అయిపోయినట్టేనని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ హెచ్చరించారు. ప్రజా జీవనంలో తానెప్పుడూ అబద్ధాలు చెప్పలేదన్నారు. అధ్యయనం చేయకుండా ఏ విషయంపైనా అవాకులు, చెవాకులు చెప్పనని స్పష్టం చేశారు. గత 75 ఏళ్లుగా ఎన్నో తప్పులు చేశామని అయితే విధానాల్లో మార్పు రావడం వల్ల, టెక్నాలజీ పెరగడం వల్ల, ప్రపంచం మనపట్ల సద్భావనతో ఉండడం వల్ల మనం ఎదిగే అవకాశం కనిపిస్తోందని అన్నారు. మనం కనుక మళ్లీ పాత పెన్షన్ విధానానికి మళ్లితే మనం ఎదిగే అవకాశాన్ని కోల్పోయినట్టేనని, అది జీవన్మరణ సమస్య అవుతుందని జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. కాబట్టి హామీలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఆలోచించకుండా హామీ ఇస్తే దానిని వెనక్కి తీసుకోవడమో, మధ్యేమార్గాన్ని అన్వేషించడమో చేయాలని సూచించారు.

Advertisements

You may also like

Our Visitor

026134
Total views : 149956

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.