Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Crime Illegal Mining | మైనింగ్ మాఫియా ఆగడాలకు 2 నిండు ప్రాణాలు బలి!

Illegal Mining | మైనింగ్ మాఫియా ఆగడాలకు 2 నిండు ప్రాణాలు బలి!

by Prakash
మైనింగ్ మాఫియా
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, ముచ్చివోలు గ్రామంలో విషాదం..ఆగని మైనింగ్ మాఫియా ఆగడాలు…

మైనింగ్ మాఫియా ఆగడాలతో రెండు నిండు ప్రాణాలు బలి. నిద్రా వ్యవస్థలో అధికార యంత్రాంగం. చెరువుల్లో ఇష్టానుసారంగా వైసీపీ నాయకులు జెసిపిలు పెట్టి చెరువు మట్టిని తవ్వేస్తుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారంటూ ముచ్చివోలు  గ్రామస్తులు మండిపడుతున్నారు

శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని ముచ్చివోలు గ్రామంలో విషాద ఘటన గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు తెలిసిన సమాచారం ప్రకారం పశువులు మేపడానికి రోజువారీ దినచర్యలో తల్లి రామలక్ష్మమ్మ వయసు 55, కుమార్తె మునిరత్నమ్మ 26 సోమవారం ఉదయం అసలు మేపడానికి సమీపంలోని చెరువు దగ్గరికి వెళ్లడంతో గ్రామానికి చెందిన తల్లి కుమార్తె మృతి చెందినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే వారి తినుబండారాలు ఆహార పదార్థాలు చెరువు గట్టుమీద ఉండడంతో స్థానికులు గుర్తించి సమాచారం స్థానిక సచివాలయ వాలంటీర్లకు పోలీస్ సిబ్బందికి అందించిన కనీసం స్పందించలేదని గ్రామస్తులు వాయుపోయారు.

అయితే మృతి చెందిన మునరత్నమ్మకు ఇద్దరు పిల్లలు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. జీవనోపాధి కోసం గ్రామంలో పశువుల మేపుకుంటూ జీవనం సాగించుకుంటూ ఉన్నతరణంలో మైనింగ్ మాఫియా చెరువులో ఎక్కడపడితే అక్కడ మట్టి తరలించడంతో గుంతులు లోతు ఉండలేదని తెలియడంతో చేతులు కడుక్కొని దిగడంతో తల్లి కుమార్తెలు మృతిచెందండం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

దీనిపై రూరల్ పోలీసులు వివరణ అడగా ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. సచివాలయ పోలీస్ వివరణ అడగ్గా పై అధికారులకు తెలిపామని వారి ఆదేశాల మేరకే కేసు నమోదు చేయడం జరుగుతుందని సచివాలయ  పోలీస్ అధికారి అనూష తెలపడం విశేషం.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : Facebook, Instagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

039695
Total views : 199313

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: