తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన టిడిపి అధికార ప్రతినిధి పి.గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్. పి గన్నవరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన పి.గన్నవరం నియోజవర్గానికి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించటం ఆనందంగా ఉందని మహసేన రాజేష్ అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అవుతానని కలలో కూడా ఊహించలేదని అలాంటిది బాధ్యతలు అప్పగించి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. 2019లో వైసీపీని గెలిపించడానికి దళితులంతా పని చేస్తే జగన్మోహన్ రెడ్డి మాపైనే కేసులు పెట్టి జైలుకు పంపించి దాడులు చేసి ఎసేంట్ భూములు లాక్కుని దళితులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి జాతికి అన్యాయం చేశాడని అన్నారు. దళిత వర్గానికి చెందిన 18 మంది టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం గర్వంగా ఉందన్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన మహాసేన రాజేష్…
401






Total views : 150519