రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అండదండలతోనే అక్రమాలు జరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ ఆరోపించారు. బీఆర్ఎస్ చేస్తున్నదంతా అక్రమాలు, అన్యాయాలే.ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కి బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలతోనే మేము కలుస్తాం.బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు ఈ భూమి మీద ఉండడకూడదనేది మోడీ తత్వం.బీజేపీని వ్యతిరేకించిన వారిపై సీబీఐ, ఈడీ దాడులు నిర్వహిస్తున్నారు.కేవలం పగసాధింపు చర్యలే పనిగా పెట్టుకున్న బీజేపీ,టీఆర్ఎస్ రెండు కలిసే కాంగ్రెస్ పై కుట్ర చేస్తున్నాయి. వైసీపీ, బీజేపీ, తెరాస మూడు ఒకే దారిలో దొడ్డిదారిన నడుస్తున్నాయి. లిక్కర్ స్కామ్ అంతా వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ కలిసే చేస్తుంటే పేరుకు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీపై చెపుతున్నారని సీపీఐ నారాయణ మండిపడ్డారు.
Tag:
CBI
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్పై సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రావణ్కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. ప్రతివాదులు జగన్, సీబీఐ, సీబీఐ కోర్టుకు నోటీసులు ఇచ్చింది. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని హరిరామ జోగయ్య ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.
Older Posts




Total views : 56906