మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా దేవరకద్ర బాలన్న నామినేషన్ దాఖలు చేశారు… అనంతరం మీడియా తో మాట్లాడుతూ బిజెపి సిద్ధాంతాలకు కట్టుబడుతూ వార్డ్ నెంబర్ స్థాయి నుండి కార్పొరేటర్ స్థాయికి ఎదిగానన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను కూడా చేయడం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయన్నారు. బిజెపి టికెట్టు బీసీలకు వస్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు. ఒకవేళ టికెట్ రాకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఖచ్చితంగా బరిలో ఉంటాను అన్నారు. భారతీయ జనతా పార్టీ దేవరకద్ర నియోజకవర్గంలో బీసీలకు అవకాశం కల్పిస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు.
elections
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మార్పు కొరుతున్నారని బిజెపి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ఈరోజు ముషీరాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి పూసరాజు నామినేషన్ ర్యాలీ రామ్ నగర్ చౌరస్తా నుండి ప్రారంభమైంది ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు. భారీ ర్యాలీగా వచ్చిన పూసరాజు ముషీరాబాద్ లో ట్యాంక్ బండ్లోని ఎమ్మార్వో కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు వారంటీ లేదని లక్ష్మణ్ తెలిపారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీల డిఎన్ఏ ఒక్కటే అని లక్ష్మణ్ వెల్లడించారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి రెండు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని లక్ష్మణ్ పేర్కొన్నారు. దాచుకోవటం దోచుకోవటం కాంగ్రెస్.. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతమని లక్ష్మణ్ వెల్లడించారు భారీ మెజారిటీతో ముషీరాబాద్ బిజెపి అభ్యర్థి పూసరాజును గెలిపించాలని ముషీరాబాద్ ప్రజలను లక్ష్మణ్ కోరారు
ఐదవ సారి నామినేషన్ దాఖలు చేశాను . రాజకీయంగా జన్మనిచ్చి విదేశాల్లో గుర్తింపు నిచ్చింది సిరిసిల్ల. సిరిసిల్ల ప్రజల ప్రజా ప్రతినిదిగా చెప్పుకోవడానికి గర్వ పడుతున్నాను. 15 ఏండ్ల గా అవినీతి రహితంగా పని చేసినం.. సిరిసిల్ల ముఖ చిత్రం మార్చిన.. పల్లెలు పచ్చ బడ్డాయి.. వ్యవసాయంలో అగ్రగామిగా ఉన్న మీ బిడ్డగా రాష్ట్ర స్థాయి లో గౌరవం పెరిగింది. అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నాను. గౌరవ ప్రదమైన మెజారిటీతో గెలిపిస్తారాని నమ్ముతున్న గులాబి దండు నాకు అండగా ఉంది. ఇంటింటికి ప్రగతి నివేదిక పంపుతున్న 55 ఎండ్లు అధికారం ఇచ్చిన ఏమీ చేయని కాంగ్రెస్ కు ఓటు వేస్తారు. సంక్షేమం అభివృద్ధి చేసిన నన్ను గెలిపిస్తారా..! ఒకే ఒక గొంతుకను అనిచి వేయాలని రాహుల్ గాంధీ వస్తున్నాడు. మనకు మనకు ఏమన్న ఉంటే మనం మనం పరిష్కరించు కుందాం. ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఒకనాటి సామంత రాజ్యంగా కావాలా.. కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా ..నీళ్ళు కావాలా.. కన్నీళ్లు కావాలా.. స్కాములు కావాలా సంబంధ వర్గాల అభ్యున్నతికి బిఆర్ఎస్ కుల మత పిచ్చి గాల్లను గెలిపిద్దమ్మ ఆలోచించండి. జిల్లా తెచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. నేతన్నల తలరాతలు మార్చాం. ప్రలోబాలకు లొంగీ పోతే ఆగం ఐతం. గతంలో తప్పు చేస్తే మళ్ళీ 50 ఎండ్లు బడపడ వలసి వస్తది. మళ్ళీ డిల్లీ మొచేతి నీళ్ళు తాగే పరిస్తితి వస్తది. సిరిసిల్ల ప్రజలు చైతన్య వంతమైన ప్రజలు. సిరిసిల్ల ప్రజల కోసం పనిచేసిన నన్ను మళ్ళీ భారీ మెజారిటీతో గేలిపిస్తారని విశ్వాసం ఉంది.
మహబూబాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు బానోత్ శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం తన క్యాంప్ కార్యాలయం నుండి బయలుదేరి ఎలాంటి హడావుడి లేకుండా పార్టీ సీనియర్ కార్యకర్తలతో మరియు మంత్రి సత్యవతి రాథోడ్ బి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి తదితరులతో కలిసి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ మాట్లాడుతూ నేడు మొదటి విడత నామినేషన్ దాఖలు చేశానని మరో రెండు సెట్లు కూడా దాఖలు చేస్తానని ప్రజలంతా కూడా మరోసారి కారు గుర్తుకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈసారి నాకు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు..
Read Also..
ఇవాళ ఎన్నికల సంఘాన్ని కలవనున్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ఏపీలో ఓట్ల అవకతవకలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేయనున్న టీడీపీ.. నియోజకవర్గాల వారీగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లన్ని తొలగించారనే అంశంపై డేటా తయారు.. ఫాం-7ను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఎన్నికల అధికారికి స్పష్టం చేయనున్న టీడీపీ నేతలు..
అధికార బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగానే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రంగంలోకి దింపింది. చెన్నూర్, బెల్లంపల్లి Mla ల తీరు పై అసంతృప్తులు, అసమ్మతి కారణంగా కారు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్య ర్థులు గెలుపే లక్ష్యంగా కారు స్పీడ్ను మరింత పెంచేలా సీఎం సభలు ఊపునిస్తాయని పార్టీ భావి స్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ రాకతో చెన్నూర్ నియోజకవర్గంలో జోష్ నింపుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నరు. రేపు సిర్పూర్ ఆసిఫాబాద్, బెల్లంపల్లి కెసిఆర్ సభల ద్వారా పార్టీ క్యాడర్ లో జోష్ నిప్పెందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు మద్యం అమ్మకాలను బంద్ చేయాలని వైన్స్, బార్ల యజమానులకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్శాఖ యజమానులను అప్రమత్తం చేసింది.ఎన్నికలను సజావుగా నిర్వహించే క్రమంలో ఈసీ ఆదేశాలను పాటించాలని సూచించింది. లేనిపక్షంలో లైసెన్స్లు రద్దు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది.
చేవెళ్ల నియోజకవర్గంలో టిఆర్ఎస్ ప్రచారం జోరు అందుకున్నది ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుండి రాత్రి పది గంటల వరకు ప్రతి వాడవాడ తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్న స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈ ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ఈ ప్రచారం లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ఉద్దేశంతోనే ప్రచారాన్ని ముమ్మరం చేసినట్టు కాలే యాదయ్య తెలిపారు..
Read Also..
దేవరకొండ శాసనసభ నియోజకవర్గ స్థానం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా రమావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ ఆర్డిఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయన వెంట బిఅర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
Read Also..
ఈ రోజు ఉదయం 11 గంటలకు కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో నామినేషన్ పత్రాలతో కేసీఆర్, హరీశ్ రావులు ప్రత్యేక పూజలు…..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సెంటిమెంట్ దేవాలయం కొనాయ పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి రానున్నరు.
ఎన్నికల సమయంలో నామినేషన్ పత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం కేసీఆర్ కు ఆనవాయితీ… అదే ఒరవడిని కొనసాగిస్తూ మంత్రి హరీశ్ రావు కూడా 2004 ఎన్నికల నుండి పెద్ద సారును ఫాలో అవుతూ విజయాలను నమోదు చేసుకుంటున్నారు. ఈసారి కూడా నామినేషన్ ఈ నెల 9వ తేదీన గజ్వెల్ రిటర్నింగ్ అధికారి ఎదుట నామినేషన్ పత్రాలను కేసీఆర్ దాఖలు చేయనున్నారు..ఐదు రోజుల ముందునే స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో కెసిఆర్, హరీష్ రావులు బిజీ బిజీగా ఉండడం, రేపు మంచి రోజు కావడంతో నామినేషన్ పత్రాలు పూర్తిచేసి పూజలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తుండడం,హరీశ్ రావుకు ఉమ్మడి మెదక్ జిల్లా బాధ్యతలు అప్పగించడంతో బిజీ బిజీ షెడ్యూల్ తో సభలలో పాల్గొంటున్నారు. కెసిఆర్ ఈ నెల 9వ తేదీన గజ్వేల్ రిటర్నింగ్ అధికారి వద్ద, సిద్దిపేట రిటర్నింగ్ అధికారి వద్ద హరీష్ రావు నామినేషన్ పాత్రాలను దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్,హరీశ్ రావు లకు ఘనంగా స్వాగతం చెప్పేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు ఎలక్షన్ల ప్రతిసారి కెసిఆర్,హరీశ్ రావులు ఈ గ్రామానికి రానుండడంతో గ్రామంలో పండుగ వాతావరణంలో వారికి ఘన స్వాగతం చెప్పేందుకు మహిళలు గ్రామస్తులు సిద్ధమయ్యారు.





Total views : 141223