జగిత్యాల జిల్లాలో వసతుల లేమితో విద్యార్థినీలు పడరాని పాట్లు పడుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో వంద మంది ఉండాల్సిన హాస్టల్ లో 211 మంది విద్యార్థులు ఉంటున్నారు. దీంతో కనీస సదుపాయాలతో పాటు బాత్ రూంలు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినీలు వాపోయారు. ఒక్కొక్క గదిలో 15 మంది పడుకుంటున్నామని.. ఎలుకలు కరవడంతో హాస్పిటల్ కు కూడా తీసుకెళ్లారని విద్యార్థినీలు వాపోయారు. హాస్టల్ లో మెడికల్ ఎమర్జెన్సీ కూడా లేదని, హాస్టల్ కు ఒక ANM ను కేటాయించాలని కోరారు. పలు రకాల సమస్యలతో బాధపడుతున్న తమకు కనీస అవసరాలు కల్పించాలని విద్యార్థినీలు కోరుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- దుబాయి ఎంబసీ అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే భేటీ.దుబాయి ఎంబసి అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమావేశం అయ్యారు. ఇటీవల దుబాయిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చొప్పదండి నియోజకవర్గానికి చెందిన వారు మరణించారు. వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దుబాయికి వెళ్లారు. మృతదేహాల తరలింపు…
- నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన.నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటించారు. 15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సమీకృత కార్యాలయ సముదాయాన్ని ఆయన పరిశీలించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. గుడిపల్లి PACS పరిధిలో 66 శాతం వరి కొనుగోళ్లు…
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత కార్మికుల దీక్ష విరమణ.మంత్రి కొండా సురేఖ హామీ మేరకు నిరసన దీక్షను చేనేత కార్మి్కులు విరమించారు. ప్రభుత్వ శాఖలకు అవసరమైన కార్పెట్లు, బెడ్షీట్ల ఆర్డర్లను టెస్కొ సంస్థకు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ… ఉమ్మడి వరంగల్ జిల్లా చేనేత సహకార సంఘాలు నిరసన చేపట్టాయి. ధర్నా స్థలానికి…
- ములుగులో మెగా సానిటేషన్ డే కార్యక్రమం.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మెగా సానిటేషన్ డే” కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. పాఠశాలలు, హాస్టళ్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో బాగంగా ములుగు ఎస్సీ బాలికల వసతి గృహంలో పిచ్చి మొక్కలను తొలగించారు. వసతి గృహన్ని అధికారులతో కలసి శుభ్రం…
- సింగరేణి కార్మికులకు శుభవార్త.సింగరేణి మెడికల్ బోర్డును అత్యంత పారదర్శకంగా, వివాదరహితంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. వివిధ కారణాల వల్ల కొద్దికాలంగా నిలిచిపోయిన ఈ మెడికల్ బోర్డు ప్రక్రియను…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 141165