మందమర్రి ఏరియా సింగరేణి గుర్తింపు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు పట్టణ INTUC కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, INTUC సెంట్రల్ నాయకులు జనక్ ప్రసాద్ సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో 51% తెలంగాణ రాష్ఠ్ర వాటా కల్గి ఉండి అధికారంలో నూతనంగా అత్యధిక జనాధరణ కల్గిన కాంగ్రెస్ పార్టీ ఉండి.. ముఖ్యంగా సింగరేణి కార్మిక క్షేత్రాలలో కాంగ్రెస్ పార్టీ MLA లు గెలుపొందినారు. రానున్న కొద్ది రోజుల్లో తప్పక MP సీటును కూడా భారీ మెజరటీతో కైవసం చేసుకోబోవు తరుణంలో SCCL కార్మిక లోకానికి ఒక ముఖ్య విన్నపం. రానున్న సింగరేణి యూనియన్ ఎలక్షన్ లో తప్పక INTUC కి అధికారం అందించినట్లైతే తప్పక మీ అవసరాలను, మీ హక్కులను, మీ అభీష్ఠాలను తప్పక అటు అత్యధిక వాటా కల్గి ఉన్న మన రాష్ఠ్ర అసంబ్లీలో మరియు కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్ లో మన MLA లు, మన MP లు కార్మిక అభీష్ఠానికి అనుగుణంగా పనిచేసి కార్మికుల మన్ననలు పొందుతారు. సింగరేణి కార్మిక యూనియన్ ఎన్నికల్లో INTUC ని బలపరచి గడియారం గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సింగరేణి కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, INTUC సెంట్రల్ నాయకులు జనక్ ప్రసాద్, IINTUC ఏరియా నాయకులు పాల్గొన్నారు.
INTUC Office
చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీ కృష్ణ మందమర్రి ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వంశీకి ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి సారధ్యంలో ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందని పేర్కొన్నారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని పేర్కొన్నారు. రేపు జరగబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీకి కార్మికులంతా ఓటు వేసి భారీ మెజార్టీతో గుర్తింపు సంఘంగా గెలిపించాలని ఆయన పేర్కొన్నారు. పేద ప్రజలకు నిజమైన న్యాయం జరగాలంటే, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు, INTUC యూనియన్ నాయకులు పాల్గొన్నారు.




Total views : 151885