జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తమ పార్టీ చిత్తశుద్ధి తో పనిచేస్తున్నామని చెపుతున్న సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహం సాక్షీగా మరో మోసానికి తెరతీశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, బహుజనులపై దాడులు చేస్తు అంబేద్కర్ విగ్రహం సాక్షీగా దళితులపై ముసలి కన్నీరు కారుస్తున్నారు. అంబేద్కర్ విదేశి విద్య పేరును మార్చి జగన్ పేరు పెట్టుకున్నారు. దళితులకు పధకాలు రద్దు చేసి వారికి రూ 30 వేల కోట్లు కేటాయించకుండా మెండి చెయ్యి చూపారు. నవరత్నాల వలన దళిత బహుజనులకు ఏటువంటి మేలు జరగలేదు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెట్టి నగరంలో దశాబ్ధాలుగా ఉంటున్న పేద దళిత, ఇతర బలహీన వర్గాల కుటుంబాలని నగరానికి దూరంగా పంపిన దళిత ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రతిదినం సామాజిక మోసానికి పాల్పాడేది వైకాపా ప్రభుత్వం కాదా.. సామాన్యుల గొంతుక అంబేద్కర్ అని చెప్పిన సీఎం జగన్ ఏపీలో ఎవరైనా గొంతు ఎత్తితే గొంతు కోసే సంస్కృతి మీ పరిపాలనలో జరగటం లేదా.. గొంతు ఎంతిన వారి గొంతు కోసే ఫ్యాక్షన్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి ది.. అంటరాని తనం గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి దళిత యువకుడిని చంపిన ఎమ్ ఎల్ సీ అనంతబాబు ను ప్రక్కన పెట్టుకొని దళితులకి ఏం సందేశం ఇస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం సాక్షీగా రాజకీయాలు మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదు. మాయ మాటలతో దళితులను కుటిల రాజకీయాలతో బానిసలుగా మార్చలనే వైకాపా ప్రభుత్వానికి రాబోయో రోజుల్లో చావుదెబ్బ తప్పదు. రాజధాని ప్రాంతంలో దళిత పేదలకు పట్టాలు పంపిణీ చేసినట్లు పైకి చెప్తు లోపల వైకాపా కార్యకర్తలకు పంపిణీ చేశారు. దళితులపై వాళ్ళ మారిన ప్రేమ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ నగరంలో గాని, ఎన్టీఆర్ జిల్లాలో గాని దళిత సామాజిక వర్గానికి చెందిన వైకాపా నాయకులకు ఎవరికైనా నామినేటెడ్ పదవులు ఇచ్చారేమో శ్వేతపత్రం విడుదల చేయాలి.
kurnool
ఎమ్మిగనూరు, కర్నూల్ జిల్లా డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె నేటికీ 40 వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా ఎమ్మిగనూరులో అంగన్వాడీలు సోమప్పా సర్కిల్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి శివ సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక్క అవకాశం అన్నందుకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్న పాపానికి మహిళలు రోడ్లెక్కే పరిస్థితి ఎదురైందని ఆరోపించారు. ఇన్నిరోజులుగా అంగన్వాడీలు ఇళ్ళు, కుటుంబాలను వదిలి రోడ్లెక్కి నిరసనలు చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనీ అమలు చేయాలని కోరుతున్నామని అదనంగా మేము ఏమి కోరడం లేదన్నారు. 40 రోజులు అవుతున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఎంత ఆలస్యం చేస్తే అంత పెద్ద ఎత్తున ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని హెచ్చరించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చాలని, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేసి, ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.
కర్నూలు, పత్తికొండ మండలం చిన్నహుల్తి వద్ద కాల్పులు కలకలం. పార్కింగ్ విషయంలో ఘర్షణ పడ్డ ఇద్దరు లారీ డ్రైవర్లు. వెంకటేశం అనే లారీ డ్రైవర్ పై రాయితో దాడి చేసిన మరో లారీ డ్రైవర్ శ్రవణ్ కుమార్. గాయాలపాలైన వేంకటేశం తన వద్ద లైసెన్స్ పిస్టల్తో గాల్లోకి కాల్పులు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. పిస్టల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకొని ఇరువురు లారీ డ్రైవర్ల పై కేసు నమోదు చేసారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిను స్టేట్ ఇన్ఫెక్షన్ కంట్రోలర్ టీం అధికారులు డాక్టర్ సారధి, డాక్టర్ సందీప్ నేతృత్వంలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వైద్యులను, అక్కడ సిబ్బంది ను రోగులకు అందిస్తున్న సేవలు, ముఖ్యంగా సిబ్బంది ఇన్ఫెక్షన్ పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. క్యాజువాలిటీలో అపరిశుభ్రత ఉండటంతో సిబ్బంది పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించడం ఎంత ముఖ్యమో అక్కడ పని చేసే వైద్యులు, సిబ్బంది, శానిటేషన్ వర్కర్లు, కుడా అంతే జాగ్రత్త గా ఉండాలన్నారు. ఆసుపత్రి ఆవరణంలో ఎవరికీ కుడా ఇన్ఫెక్షన్స్ సోకకుండ చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.
జీవో నెంబర్ 512ను వెంటనే రద్దు చేయాలని కర్నూలు జిల్లా పత్తికొండలో ధర్నా చేశారు న్యాయవాదులు. పట్టణంలోని న్యాయవాదులు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో (27/ 2023) ను రద్దుచేసి ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. ప్రజలకు భద్రత లేని జీవోను వెంటనే రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని నిరుద్యోగుల తరఫున స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నానట్లు సోషల్ మీడియా పాపులర్ బర్రెలక్క అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటున్నట్లు నామినేషన్ అనంతరం తెలిపారు గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు డిగ్రీలు పీజీలు చేసిన ఉద్యోగాలు రాకపోవడంతో బర్రెలు గొర్రెలు కాస్తూ కాలం వెలదీస్తున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారింది. పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష గత ఏడాది తాను డిగ్రీ పీజీలు చేసిన ఉద్యోగాలు రాక బర్రెలు కాస్తున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ పోస్ట్ వైరల్ గా మారడంతో అధికారులు ఆమెపై కేసు పెట్టారు దీంతో ఏడాదిగా తాను కోర్టు చుట్టూ తిరుగుతూ మానసిక వేదనకు గురయ్యానని నిరుద్యోగుల తరఫున తాను నామినేషన్ వేస్తున్నానని తనను గెలిపించాలని కోరారు.
నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామంలో కరువు ప్రాంతం పర్యటనకు వచ్చిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు,జ్యోతి నెహ్రూ,మా రెడ్డి శ్రీనివాసరెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కూన రవికుమార్, డోన్ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్. పలు పొలాలలో కరువుల గురించి రైతులతో అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వర్షములు సమయానికి పడలేదు రైతు చాలా ఇబ్బందుల పాలవుతున్నాడని రైతులు వాళ్లతో వారి బాధల గురించి చెప్పుకున్నారు.





Total views : 141179