murder
మేడ్చల్ జిల్లా పోచారం ఐ టి కార్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నోజిగూడ, లక్ష్మి నర్సింహా స్వామి కాలనీలో నివసిస్తున్న దారావత్ కరణ్ నాయక్, తండ్రి లక్ష్మణ్, వయస్సు 18… అదే కాలనీకీ సంబందించిన కొందరు దుండగులు కలసి కరణ్ ను అతి దారుణంగా అత్య చేయడం జరిగింది. రంగంలో దిగిన పోలీస్ లు దుండగులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి, కరణ్ మృత దేహాన్ని, గాంధీ హాస్పిటల్ కీ తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య ప్రేమ వివాహానికి సంబంధించింది అని తెలుస్తోంది పోలీసుల అదుపులో 9 మంది, మరికొందరి కోసం గాలింపు, ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also..
మండల పరిధిలోని నాచుకుప్పం గ్రామానికి చెందిన ఉజ్జినప్ప గౌడు (38), భార్య నాగరత్నంమ్మ, ముగ్గురు పిల్లలు వీరిలో గారాబంగా పెంచుకున్న కూతురు ప్రేమ వ్యవహారం వల్ల తండ్రి శవమైనాడు. వివరాల్లోకి వెళితే తావడకుప్పం గ్రామనికి చెందిన గణేష్ (18)కూలీ పనులు చేసుకొంటూ నాచుకుప్పం గ్రామానికి చెందిన ఉజ్జినప్ప గౌడు కూతురు వీణ ను ప్రేమించాడు. ఒక సంవత్సరం గా ప్రేమ వ్యవహారం సాగింది. పెళ్లి చేసుకోవాలని అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను అడిగాడు. ఈ ప్రేమను తండ్రి అంగీకరించలేదు. కానీ తల్లి ,కూతురు కు ఇష్టం. తండ్రి అడ్డం ఉన్నాడని కట్టుకున్న భార్య,కూతురు, ప్రేమికుడు గణేష్ పథకం రచించి చంపి అతన్ని లక్కనపల్లి ఇసుక దిబ్బల్లో పూడ్చారని. ఈ వివరాలు గణేష్ ద్వారా పోలీసులు సమాచారం రాబట్టారని వీరి వెనుక ఇంకా ఎవరన్న ఉన్నారా అన్న కోణంలో వివరాలు రాబట్టడానికి పోలీసులు ఆరా తీస్తున్నారని సమాచారం, ఈ కథనoపై వివరణ స్థానిక ఎస్ ఐ మోహన్ కుమార్ కోరగా 27 వతేది సాయంకాలం మిస్ అయినట్టు 30 వతేది ఉజ్జినప్ప గౌడు అన్న సొమప్ప గౌడు రక్షణ శాఖ లో పిర్యాదు చేయడం జరిగింది. ఇందులో నిజ నిజాలు తెలియబరుస్తామని ఎస్ ఐ మోహన్ కుమార్ ఒక తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండల కొఠాలపర్రు గ్రామ అడ్డపుంతలో జరిగిన వివాహిత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. నర్సాపురం డీఎస్పీ రవి మనోహర్ చారి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ (చివటం రామ్ ప్రసాద్)భర్తే నిందితుడుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. భార్య నందిని ప్రవర్తన పై అనుమానంతో చాకుతో పొడిచి హత్య చేశాడు. ముద్దాయిని అదుపులోకి తీసుకొని హత్య కు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకొన్నాం అన్నారు. కేసు దర్యాప్తుకు కృషి చేసిన పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ ను సిబ్బందిని జిల్లా sp యూ. రవి ప్రకాష్, డీఎస్పీ అభినందించారు.
గత రెండు రోజుల క్రితం తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తల వల్ల గ్రామంలో భార్య పావనిను అతి కిరాతకంగా నరికి చంపిన భర్త కాటయ్య ను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సిఐ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 8 సంవత్సరాల క్రితం శ్రీ సిటీలోని ఓ మొబైల్ కంపెనీలో పని చేస్తున్న కాటయ్యకు అదే కంపెనీలో పనిచేస్తున్న పావని పరిచయం అవ్వడంతో ప్రేమించి పెద్దలను ఎదిరించి సూళ్లూరుపేటలోని చంగాలమ్మ గుడిలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికీ ఒక కొడుకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. కాటయ్య మందు తాగడం మరియు ఇతర చెడు అలవాట్లకు బానిసై పెళ్లి అయిన తరువాత పరిశ్రమకు పోకుండా పని నిలిచిపోయి భార్యను కూడా ఉద్యోగానికి పోకుండా ఆపేశాడు. కాటయ్య తన వ్యసనాల కోసం అప్పుడప్పుడు కూలి పనులకు వెళ్తూ అతని అలవాట్లకి ఇంటి ఖర్చులకు డబ్బులు సరిపోక అతని భార్యని కొట్టి వాళ్ళు పుట్టింటి నుండి డబ్బులు తీసుకొని రమ్మని వేధించేవాడని ఈ చిత్రహింసలు భరించలేక తన గోడును తల్లిదండ్రులకు చెప్పుకొని అప్పుడప్పుడు అక్కడ నుండి డబ్బులు తీసుకువచ్చి జీవనాన్ని సాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో భార్యపై భర్తకు అనుమానం పెరగడంతో తీవ్రంగా మానసికంగా హింసించేవాడని గత నాలుగు నెలల క్రితం తనకు డబ్బు చాలా అత్యవసరమని మీ తల్లి తండ్రి వద్దకు వెళ్లి డబ్బులు తీసుకొని రమ్మని ఒత్తిడి చేయడంతో పావని ససేమిరా అనడంతో తీవ్రంగా తలకు గాయపరిచి వేధించిన విషయం పావని తల్లిదండ్రులకు తెలిసి వారు తమ ఇంటికి తీసుకుని వెళ్లి చికిత్స చేసి అల్లుడు కాటయ్య ను పిలిచి పదివేల రూపాయలు ఇచ్చి తమ కూతురిని వేధించవద్దని చెప్పి పంపించారు. విపరీతంగా అనుమానం పెరగడంతో రెండు రోజుల క్రితం సూళ్లూరుపేట నుంచి తెచ్చుకున్న కత్తితో పావని అతి కిరాతకంగా నరికి చంపేశాడు. హత్య చేసిన తరువాత హత్యకు వాడిన రెండు కత్తులు పక్కనే ఉన్న చెరువులో పడవేసి సూళ్లూరుపేట కు పారిపోయాడని అతన్ని ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
Read Also..
నర్సాపూర్ మండలం కొండాపూర్ అడవి ప్రాంతంలో ఓ వ్యక్తి మృత దేహం వెలుగులోకి వచ్చింది. మృతుడు హైదరాబాద్ బోరబండకు చెందిన నోమన్ గా పోలీసులు గుర్తించారు. ఫారుక్ నేనే హత్య చేశానని పోలీసులకు లొంగిపోయాడు. బోరబండలో గొడవపడి నోమన్ ను చంపాలనే ఉద్దేశంతో తీసుకువచ్చి హత్య చేసినట్లు ఫారుక్ పోలీసులతో ఒప్పుకున్నాడు. ఈ కేసు పై పూర్తిస్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఓ వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లంలో చోటుచేసుకుంది సత్యవేడు సీఐ శివకుమార్ రెడ్డి వివరాల మేరకు బత్తుల వల్లం హరిజనవాడకు చెందిన ఇరకం పావని (26), ఈరోజు ఉదయం తన ఇంట్లో రక్తపు మడుగులో మిగతజీవిగా పడి ఉండటం చూసిన స్థానికులు వరదయ్యపాలెం ఎస్సై నాగార్జున రెడ్డి కి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ పావని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు,మృతురాలు పావునికి ఆమె భర్త కాటయ్యకు మధ్య గత కొంతకాలం నుంచి మాస్పర్ధలు ఉన్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో భర్త ఆమెను హత్య చేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్త కాటయ్యను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతురాలికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నట్లు సమాచారం.
అక్రమ సంబంధాలు, వివాహేతర బంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. ఓ యువకుడు వివాహితతో అక్రమసంబంధం పెట్టుకుని ఆమె ఇంట్లోనే అనుమానాస్పద రీతితో మృతిచెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. వట్టిచెరుకూరు లో ఓయువకుడు అనుమానాస్పద స్ధితిలో మృతిచెందాడు. అయ్యన్నకుంటిపల్లెకి చెందిన గేరా సందీప్ గ్రామంలోని పరమేశ్వర సాయి అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ యువకుడు వివాహితతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు. వివాహితతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో తీవ్ర ఆందోళనకు గురయిన సందీప్ అదే ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు. తలుపులు తెరిచి చూసేసరికి సందీప్ ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. అయితే సందీప్ ది ఆత్మహత్య కాదు… హత్య చేసారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






Total views : 141397