నారా లోకేష్ యువగళంతో మళ్లీ ప్రభంజనం మొదలైందన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. సీఎం జగన్ రాజకీయాలకు ఇక పుల్ స్టాప్ పడినట్లే అన్నారు. యువగళానికి వస్తున్న జనాదరణ చూసే వైసీపీ నేతలు బెంబేలెత్తుతున్నారని చెప్పారు. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసిన వచ్చే ఎన్నికల్లో జనసేన – టీడీపీ జెండా ఎగరడం ఖాయం అంటున్న కొల్లు రవీంద్ర.
political news
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 35 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎలక్షన్ కమిషన్ తాజాగా ఓట్ల లెక్కింపు కేంద్రాలపై స్పష్టతనిచ్చింది. డిసెంబర్ 3న జరిగే కౌంటింగ్ కోసం గ్రేటర్ పరిధిలో మొత్తం 49 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే మొత్తం 14 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. ఇందులో భాగంగా ఏర్పాట్లు శరవేగంగా పూర్తిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోలైన ఓట్లను యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో లెక్కించనున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా 13 నియోజకవర్గాలకు విడివిడిగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇక రంగారెడ్డి జిల్లాలో 4, మిగిలిన జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 49 కేంద్రాలను ఏర్పాటు చేయడంలో నిమగ్నమైనట్లు తెలిపారు.
Read Also..
Read Also..
జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ గుంతలప్రదేశ్ గా మారిందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు.తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ ఆద్వర్యంలో జ్యోతుల నెహ్రూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి సూరంపాలెం బాలు జనసేన, టిడిపి నాయకులకు తో కలిసి గండేపల్లి మండలం యల్లమిల్లి అడ్డరోడ్డు వద్ద నుండి గండేపల్లి శివారు సింగరంపాలెం రోడ్డు వరకు నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర చేసిఅధ్వానంగా ఉన్న రోడ్లు పరిస్థితిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నెహ్రూ రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్లపై టిడిపి జనసేన సంయుక్తంగా నిర్వహిస్తున్న గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారి ఇది కార్యక్రమంలో భాగంగా మూడోరోజు గండేపల్లి మండలంలో నిర్వహించామని పెద్దాపురం మండలం గండేపల్లి మండలం కోరుకొండ, గోకవరం మండలాలకు అతి ముఖ్యమైన లింకు రోడ్డుగా ఉన్న ఈ రోడ్డు అద్వాన్న పరిస్థితిలో ఉందని దీనిని వెంటనే మరమ్మతులు చేసి ప్రజల ను ప్రమాదాల నుండి కాపాడాలని కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టామని ఈ అసమర్ధ ఎమ్మెల్యే వల్లే ఈరోజు నియోజకవర్గంలో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని ఎన్నికల ముందు ఐదు కోట్ల రూపాయలు కేటాయించి నియోజకవర్గం లోని రోడ్లన్నీ గుంతలు ,గొయ్యలు పుట్చాలని కోరారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో 1200 కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రి కేటాయిస్తే రాష్ట్రం రోడ్లన్నీ తాత్కాలిక మరమ్మతులు చేయవచ్చని అన్నారు. ప్రతి మంగళవారం నువ్వు తీసుకువచ్చే రిజర్వ్ బ్యాంక్ అప్పులో 1200 కోట్ల రూపాయల కేటాయిస్తే రాష్ట్రం రోడ్లన్నీ తాత్కాలిక రిపేర్లు పూర్తవుతాయని ఎన్నికల ముందు ఈ కార్యక్రమం తీసుకుని మీరు ఓట్లు కోసం రావాలని, ఎన్నికల ప్రచారం రావాలని డిమాండ్ చేసిన జ్యోతుల నెహ్రూ లేదంటే రేపు రాబోయే జనసేన, టిడిపి సంకీర్ణ ప్రభుత్వంలో రోడ్లన్నీ పూర్తి చేస్తామని అన్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో ఈనెల 21 అనగా రేపు సూళ్లూరుపేట రానున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి కి భారీ బందోబస్తు చేస్తున్న అధికారులు. రేపు సూళ్లూరుపేట కు చేరుకొని పలు కార్యక్రమాలు ప్రారంభించనున్న జగన్మోహన్ రెడ్డి.
ముఖ్యమంత్రి రానున్న సందర్భంగా దాదాపుగా 2,000 మంది పోలీసుల తో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న ఉమ్మడి నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం…….
తిరుమల క్షేత్రాన్ని రాజకీయ పునరావాస క్రంద్రంగా మారుస్తున్నారని, ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు అంటూ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండి పడ్డారు బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్ను తిరుమల శ్రీవారి ఆలయం పై పడిందని ఈ నేపథ్యంలోనే తిరుపతి అభివృద్ధిలో భాగంగా ఒక్క శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టారు కానీ బిజెపి తీవ్రస్థాయిలో వ్యతిరేకించడంతో ప్రభుత్వం దానిని తిరస్కరించడంతో మరలా మొన్న జరిగిన పాలకమండలి సమావేశంలో కొత్తగా మరో ప్రతిపాదనను తీసుకొచ్చారని, ఇందులో తిరుపతిలో దాదాపు 39 డివిజన్లో సానిటరీ వర్క్ చేయడానికి నిధులు మళ్ళిస్తున్నారని ఆరోపించారు.అలాగే తిరుపతిలో రోడ్ల అభివృద్ధి కంటూ 100 కోట్లకు పైగా నిధులను పక్కదారి మల్లిస్తున్నారని ఆరోపించారు. చట్టంలో ఎక్కడా లేనివిధంగా శ్రీవారి నిధులను ఇలా సానిటరీ వర్కులకు రోడ్ల అభివృద్ధి కంటూ దారి మళ్ళిస్తున్నారని రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తిరుపతి శాసనసభ్యులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు.తిరుపతి అభివృద్ధికి బిజేపి వ్యతిరేకం కాదని,టీటీడీ నిధులు ఇలా పక్కదారి పట్టడానికి వ్యతిరేకిస్తున్నామని దీనిపై టీటీడీలో జరుగుతున్న అవక తవకలను కచ్చితంగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని అక్కడ న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.దేశంలో ఎక్కడ ఏ దేవాలయం నిదుల తో అభివృద్ధి జరగడం లేదని,
ముఖ్యమంత్రి జగన్ ఇతర ఆర్గనైజేషన్ నుండి డబ్బులు తేగలరా అని ప్రశ్నించారు.తిరుపతి కి క్లీన్ సిటీ అవార్డ్లు వచ్చాయని ఇప్పుడు కొత్తగా టీటీడీ నిధులతో తిరుపతి రోడ్లను పారిశుద్ధ్య కార్మికుల నుంచి ఏం చేయాల్సిన అవసరం లేదని కార్పొరేషన్ నిధులతోనే అవన్నీ సజావుగా జరుగుతున్నాయని గుర్తు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం సామాన్యులకే అధిక ప్రాధాన్యత కేటాయిస్తున్నామంటూ ప్రగల్పాలు పలికిన పాలకమండలి అధికారులు తమ ఎమ్మెల్యేలకు,మంత్రులకు యదేచ్చగా ప్రోటాకాల్ టికెట్టు ఇచ్చి దర్శనాలు చేయించుకుంటున్నారని, రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేస్తున్నారని ఆరోపించారు.ఈ బోర్డు వచ్చిన తరువాత ఎమ్మెల్యే లకు,ఇతరులకు సుపదం ద్వార దర్శనాలు ఎదేచ్చా పంపు తున్నారని అన్నారు. రాష్ట్రంలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుందని, గత నెల రోజులలో ప్రోటోకాల్ దర్శనం సిసి ఫుటేజ్ విడుదల చేయగలరా అని సవాల్ విసిరారు భాను ప్రక్రష్. అధికారులు గానీ ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది గానీ ఎవరైనా సరే అఖిలాండడం వద్ద వచ్చి అవకతవకలు జరగడం లేదని ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు.తిరుమల తిరుపతి దేవస్థానం ను జగన్ మోహన్ ఆలయం గా మార్చేసారని,
ఆర్టిఐ పరిధిలోకి టిటిడి ని కూడా తీసుకురావాలి అని బిజేపి డిమాండ్ చేస్తుందని అన్నారు.ధార్మిక క్షేత్రం లో సవాళ్ళు ప్రతి సవాళ్లు మంచిది కాదని అధికారులు తమ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి.
మెదక్లో ప్రజాఆశీర్వాద సభలో బుల్లెట్ల కలకలం
మెదక్ జిల్లా నర్సాపూర్లో గురువారం నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో బుల్లెట్ల కలకలం రేగింది. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో అస్లాం అనే వ్యక్తి ప్రెస్ గ్యాలరీలో కూర్చున్నాడు. అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేశారు. రెండు బుల్లెట్లు దొరకడంతో స్వాధీనం చేసుకున్నారు.
అస్లాం సంగారెడ్డి జిల్లా రాయికోడ్కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం చిలప్చెడ్ మండలం చండ్రులో ఉంటున్నాడు. అతను ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. డిగ్రీ క్లాస్మేట్ సహాయంతో ఓ యూట్యూబ్ చానల్ ఐడీ కార్డు సంపాదించినట్టు తేలింది.
అస్లాం గతంలో ఎన్సీసీలో పనిచేసినట్టు సమాచారం. అక్కడ పనిచేసినప్పడే తీసుకొచ్చిన బుల్లెట్లు అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా అస్లాం కర్ణాటకకు చెందిన వ్యక్తిగా కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.
ఘటనపై పోలీసుల స్పందన
ప్రజాఆశీర్వాద సభలో బుల్లెట్లు దొరకడంపై పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడిని గుర్తించి, అతడి వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. అతడి నుండి బుల్లెట్లను ఎక్కడ నుండి తెచ్చుకున్నాడో, ఎందుకు తెచ్చుకున్నాడో తెలుసుకుంటామని పేర్కొన్నారు.
ఘటనపై రాజకీయ పార్టీల స్పందన
ఈ ఘటనపై రాజకీయ పార్టీలు విమర్శలు చేశాయి. రాష్ట్రంలో భద్రత ఏమిటని ప్రశ్నించాయి. ఈ ఘటన రాష్ట్రంలోని భద్రతా పరిస్థితిపై తీవ్ర సవాలుగా మారింది అని అభిప్రాయపడ్డాయి.
ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి?
Read Also..
విజయనగరం జిల్లా
గజపతినగరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్తగా నియమితులైన మర్రపు సురేష్. సమన్వయకర్తగా నియమితులైన సందర్భముగా పార్టీ కార్యాలయం లో జనసేన అభినందన సభ ఏర్పటు చేసిన నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు గజపతినగరం నియోజక వర్గంలో జనసేన పార్టీకీ చేస్తున్న సేవలకు మెచ్చి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గ సమన్వయకర్తగా తనకు బాధ్యతలను అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపిన నియోజకవర్గం మర్రపు సురేష్ మాట్లాడుతు తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తులో భాగంగా ఇటువంటి బేదాభిప్రాయాలు లేకుండా సమిష్టిగా కష్టపడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించే వరకు జనసేన పార్టీ నాయకులు అహర్నిశలు శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.
నాగర్ కర్నూల్ జిల్లా..
అర్ధరాత్రి నల్లమల అచ్చంపేట లో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ.. ఘర్షణలో గాయపడ్డ ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు.. ఘర్షణలో గువ్వలకు మెడ పై గాయలయ్యాయంటు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఓ వాహనంలో డబ్బుల బ్యాగ్ లను తరలిస్తున్నారనే సమాచారంతో వెంబడించిన కాంగ్రెస్ నేతలు. ఆ వాహనం గువ్వల బాలరాజు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆగిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు. ఘర్షణ లో టవెరా వాహనం అద్దాలు పగలగొట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు. సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజు రాత్రి 10 తర్వాత ప్రచారం చేస్తూ డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ. స్థానిక పోలీసులు, గువ్వల గన్ మెన్ లు, గువ్వల ఎస్కార్ట్ పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కు సపోర్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహించిన వంశీకృష్ణ. ఈ ఘటన పై రాష్ట్ర ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలని కోరిన వంశీకృష్ణ. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెన్స్ బుల్ పర్సన్ కాదు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఆయనకు స్థిరత్వం లేదన్నారు. పూటకో మాట రోజుకో నాటకంలా.. ఆయన వ్యవహరించడం ప్రజలంతా చూస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో ఆనాడు ఐవైఆర్ కృష్ణారావు రచించిన ‘ఎవరి రాజధాని అమరావతి..?’ పుస్తకాన్ని ఆవిష్కరించింది పవన్ కల్యాణ్ కాదా..? గూగుల్లో వెదికితే అసలు నిజం తెలుస్తోందన్నారు. ఈరోజు అదే అమరావతి పవన్ కల్యాణ్కు ముచ్చటైన వేదికగా కనిపిస్తుందా..? అని నిలదీశారు. గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు.. ఆయన చేసిన పాపాలే ఇప్పుడు పవన్ కల్యాణ్నూ చుట్టుముడుతున్నాయని చెప్పుకొచ్చారు. నేడు చంద్రబాబు మీద ఈగ వాలనీయకుండా.. సొంతకొడుక్కి లేని నొప్పి పవన్ కల్యాణ్కి కలుగుతుంది కనుకే ఆయన్ను దత్తపుత్రుడు అని తాము అంటున్నట్లు చెప్పుకొచ్చారు. జనసేన పార్టీని పవన్ కల్యాణ్ అమ్మేశాడని ఆ పార్టీ కార్యకర్తలు గుర్తించాలి అని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు.
ఎన్నికల రోజు పోలింగ్ ప్రక్రియను సునిశితంగా పరిశీలించడానికి మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందని డిప్యూటీ డీ.ఈ.ఓ, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మైక్రో అబ్జర్వర్ ల శిక్షణ కార్యక్రమంలో డిప్యూటీ డీ.ఈ.ఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీ.ఈ.ఓ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు (సూక్ష్మ పరిశీలకులు) పోలింగ్ రోజు ఆయా పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రారంభమయ్యే సమయాన్ని, పోలింగ్ ముగిసే సమయాన్ని గమనించాలని అన్నారు. ఈ.వీ.ఎం ల పనితీరు పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, గ్రీన్ పేపర్ సీల్, క్రమ సంఖ్యలను నమోదు చేసుకోవాలని తెలిపారు. మాక్ పోల్ నిర్వహణను పరిశీలించాలని, పోలింగ్ స్టేషన్లకు దారులను పరిశీలించడం, సీక్రసీ ఓటింగ్, పోలింగ్ ఏజెంట్ల ప్రవర్తన, ఫిర్యాదులను పరిశీలించాలని తెలిపారు. మైక్రో అబ్జర్వర్లు పరిశీలనలో ఏ విధమైన సందేహాలు ఉన్నా వెంటనే జనరల్ అబ్జర్వర్ లకు తెలియజేయాలని అన్నారు.





Total views : 140807