జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 70పైగా గెలుస్తుందని ధీమ వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…జిల్లాలో యథేచ్చగా నిబంధనల ఉల్లంఘన జరుగుతుందన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకానికి అనుమతులు మంజూరు చేసి…ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన అధికారులను తక్షణమే తొలగించాలన్నారు. ఇక ఈ అంశంపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలన్నారు. ఈసీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేదుకు ఎన్నికల సంఘం చూస్తుంటే, జగిత్యాల జిల్లాలో మాత్రం యథేచ్చగా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందన్నారు. జిల్లాలో అసలు యంత్రాంగం ఉందా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
Reddy
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరింత వేడెక్కాయి. కాంగ్రెస్, మజ్లీస్ పార్టీల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. రెవంత్ రెడ్డి ఇటివలె మజ్లీస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసారు. ఈ నేపద్యంలో అక్బరుద్దీన్ స్పందించారు. రేవంత్ రెడ్డి తమను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన హిందూ – ముస్లిం గొడవలు తీసుకువచ్చిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తమ జోలికి రావొద్దని, వస్తే కనుక ఆయన జీవితచరిత్ర బట్టబయలవుతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్సెస్ నుంచి వచ్చాడని, ఆ తర్వాత టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారని అన్నారు. తెలంగాణలో రెడ్డి, రావు, ఎవరైనా సరే మా ముందు వంగాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ దేశ విభజన వల్లే భారత్ – పాకిస్తాన్ రెండు ముక్కలైందని, లేదంటే ఒకే దేశంగా ఉండేదన్నారు.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 నియోజవర్గల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. వరంగల్ పశ్చిమ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను కాంగ్రెస్ అభ్యర్ధి నాయిని రాజేందర్ రెడ్డి దాఖలు చేశారు. దీంతో స్వీకరణ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భూపాలపల్లిలో కీర్తిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు నామినేషన్లు వేయనున్నారు. పరకాలలో నామినేషన్లు వేసేందుకు 100 గ్రీన్ఫీల్డ్ బాధిత రైతులు సన్నద్ధం అవుతున్నారు. 12 నియోజకవర్గ కేంద్రంలో ఇండిపెండెంట్ అభ్యర్థుల ఆసక్తి చూపుతున్నారు.




Total views : 140970