Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Main News పరీక్ష పేపర్ల లీక్ లపై కేంద్రం నిరోధక చట్టం అమలు

పరీక్ష పేపర్ల లీక్ లపై కేంద్రం నిరోధక చట్టం అమలు

by Rama
పరీక్ష పేపర్ల లీక్ లపై కేంద్రం నిరోధక చట్టం అమలు

వరుస పేపర్ లీక్ లతో సతమతమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైనవారిపై చట్టపరంగాచర్యలు తీసుకునేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను అమల్లోకి తీసుకువచ్చింది. పరీక్షల పేపర్ లీక్ ల గందరగోళం మధ్య, కేంద్ర ప్రభుత్వం ఈ యాక్ట్ ని అమలు చేసింది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత పరీక్షల్లో అవకతవకలపై కఠిన చర్యలకు నిబంధనలు రూపొందించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు-2024ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. పబ్లిక్ పరీక్షా విధానంలో మరింత పారదర్శకత, సరసత, విశ్వసనీయతను తీసుకురావడానికి అన్యాయమైన మార్గాలను నిరోధించడం దీని లక్ష్యం. ఇది జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు చెబుతూ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చట్టం చేసినా ఎన్నికల హడావుడి షురూ అవ్వడంతో అమలు తేదీని ప్రకటించలేదు.పరీక్ష పేపర్ల లీక్ లపై కేంద్రం నిరోధక చట్టం అమలు కేంద్ర సిబ్బంది, వ్యవహారాలశాఖ ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఎవరైనా చట్ట విరుద్దంగా పరీక్ష పేపర్లను అందుకున్నా..ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసేవారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్ వర్క్ ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, ఫేక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. కారకులకు 5 నుంచి 10ఏండ్ల వరకు జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తారు. దీనిలో భాగస్వాములు, వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే వారి ఆస్తులను జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చును వసూలు చేస్తారు.పరీక్ష పేపర్ల లీక్ లపై కేంద్రం నిరోధక చట్టం అమలు ఇక నుంచి పేపర్ లీకేజీ కేసులను ఈ చట్టం కింద నమోదు చేయనున్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.
    మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
  • ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
    అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి…
  • ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
    ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
  • చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.
    ఈ మ్యాచ్ 20వ ఓవర్‌లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
  • పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.
    పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

023067
Total views : 140822

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.