అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ సందర్భంగా చెన్నూరులో ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటుపై ప్రశ్నించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరులో బస్సు డిపో ఏర్పాటు చేయాలని కోరారు. చెన్నూరుకు 3 రాష్ట్రాల బస్సులు వస్తాయని.. అందువలన త్వరగా బస్ డిపో పూర్తి చేయాలన్నారు. చెన్నూరు టూ హైదరాబాద్ ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంచాలని మంత్రిని కోరారు. మంచిర్యాల టూ చెన్నూరు వయా బీమారం బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలి. అలాగే ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు మందమర్రి డిపోకు వచ్చి వెళ్లాలని మంత్రికి రిక్వెస్ట్ చేశారు ఎమ్మెల్యే వివేక్ .
15 ఏళ్లు దాటిన బస్సులన్నింటినీ తొలగిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అలాగే కొత్త రూట్లకు కూడా బస్సులు త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. చెన్నూరులో బస్ డిపో ఏర్పాటుకు ప్రభుత్వం టెండర్లు పిలిచిందన్నారు మంత్రి పొన్నం . చెన్నూరు బస్ డిపో కోసం 4 కోట్లు మంజూరు చేశామన్నారు. మొదటి విడతగా కోటి 20 లక్షలు చెల్లించిందన్నారు. కాంపౌండ్ వాల్ , బేస్మెంట్ , గారెజ్ పనులు పూర్తయ్యాయి.. కానీ ఆర్టీసీకి సంబంధించిన భూమి హై కోర్టు స్టే ఉన్నందున పనులు నిలిచిపోయాయని తెలిపారు. హైకోర్టు స్టే ఎత్తివేసిన తర్వాత డిపో ఏర్పాటును వేగవంతం చేస్తామన్నారు మంత్ర పొన్నం.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
- ఇరాన్తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.అమెరికా, ఇరాన్ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హర్మూజ్ జలసంధిని తిరిగి…
- ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
- చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్దే.ఈ మ్యాచ్ 20వ ఓవర్లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
- పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్లను శివాలయం బ్రిడ్జి వద్ద…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 140751