ప్రతిపక్షంలో ఉన్నపుడు ఐదేళ్లుగా పడిన కష్టం, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని గుర్తించి అతిపెద్ద బాధ్యత అప్పగించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన పల్లా శ్రీనివాస్ను సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన నేపథ్యంలో ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావుతో సీఎం చంద్రబాబు నాయుడుమాట్లాడుతూ.. నమ్మకంతో అతిపెద్ద బాధ్యత నీకు అప్పగించాం. సమర్ధంగా నిర్వహించాలి.
అధికారంలో ఉన్నపుడు ప్రతి కార్యకర్తను దగ్గర చేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికీ తగు గౌరవం కల్పించాలి. ప్రత్యేకంగా యువతను పార్టీలోకి ఆహ్వానించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుండి యువతను రాజకీయాల్లోకి స్వాగతించాలి. యువతతోనే సమాజంలో మార్పులు సాధ్యమవుతాయి. జాతీయ అధ్యక్షునిగా పార్టీ పరంగా, ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పరంగా అండగా ఉంటాను. నిత్యం కార్యకర్తలతో అనుసంధానమై పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలి. పార్టీ పరంగా అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతు ఇస్తాను. సీనియర్ల సూచనలు, జూనియర్లు, యువత మద్దతుతో పార్టీని మరింత బలోపేతం చేయాలి. వచ్చే నెల నుండి పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్ కూడా పున:ప్రారంభించాలి. వీలైనంత త్వరగా నామినేటెడ్ పదవుల్లో పని చేసిన కార్యకర్తల్ని నియమించి గౌరవించాలి. అదే సమయంలో పార్టీ కోసం పని చేసిన ప్రతి నాయకుడికీ తగిన గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్ఎంఎస్.సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమైందని హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సిద్ధంశెట్టి సాజన్ ఆరోపించారు. యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తూ కార్మిక సమస్యల పరిష్కారం కంటే పైరవీలకే పరిమితమైందని విమర్శించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల…
- రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీఎస్ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రవాణా శాఖ మంత్రి…
- మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.మైన్స్ అండ్ జియాలజీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం వరంగల్ డిప్యూటీ డైరెక్టర్గా ఎఫ్ఏసీ బాధ్యతలు నిర్వహిస్తున్న జయరాజు.. గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధులు నిర్వహించారు.…
- సెప్టెంబర్ 2న పాయకరావుపేటకు చంద్రబాబు.ఉత్తరాంధ్ర జిల్లాల సాగు, తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసే బృహత్తర సంకల్పం సాకారమవుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా జీవనది గోదావరి జలాలను విశాఖపట్నం, అనకాపల్లి సహా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తరలించే ప్రక్రియకు సీఎం చంద్రబాబు సెప్టెంబర్…
- నేపాల్లో ఏపీ యాత్రికుల భద్రతపై 24 గంటల పర్యవేక్షణనేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలూ పర్యవేక్షణ కొనసాగిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఆర్టీజీఎస్ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి నుంచి కైలాస మానససరోవర్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.