Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home TelanganaKarimnagar యాత్ర ఏర్పాట్లపై బీజేపీ నాయకులతో బండి సంజయ్ భేటీ..

యాత్ర ఏర్పాట్లపై బీజేపీ నాయకులతో బండి సంజయ్ భేటీ..

by Rama
Bandi sanjay

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రేపటి నుండి మలిదశ ప్రజాహిత యాత్రకు సిద్ధమయ్యారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రంలో ఉదయం 11 గంటలకు యాత్ర ప్రారంభించనున్నారు. తొలిరోజు కోహెడ మండలంలో ప్రారంభమయ్యే యాత్ర తీగలగుంటపల్లి, గోటమిట్ల, నారాయణపూర్, విజయనగర్ తోపాటు చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, చిన్న ముల్కనూర్, చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి గ్రామాల్లో పాదయాత్ర చేస్తారు. రాత్రి బొమ్మనపల్లి సమీపంలోని ప్రైవేట్ స్కూల్ లో బస చేస్తారు. యాత్రలో భాగంగా కోహేడ, చిగురుమామిడి మండల కేంద్రాల్లో బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

బండి సంజయ్(bandi sanjay) పాదయాత్ర కు రూట్ మ్యాప్ క్లియర్

Follow us on : Facebook, Instagram & YouTube.

ఇది చదవండి: టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ పై మంత్రి రోజా సెటైర్లు

మరోవైపు ప్రతిరోజు సగటున 10 గ్రామాల్లో పాదయాత్ర చేసేలా బీజేపీ జిల్లా నాయకత్వం రూట్ మ్యాప్ ను ఖరారు చేసింది. పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగించనుంది. మలిదశ యాత్రలో భాగంగా రేపటి నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

రెండోరోజు హుస్నాబాద్ రూరల్ మండలంలోని మహ్మదాపూర్, నాగారం, పోతారం, హుస్నాబాద్, పందిళ్ల, గోవర్ధనగిరి, రామవరం, అక్కన్నపేట, అంతక్కపెట, కట్కూర్, మల్లారం, కొత్తకొండ గ్రామాల్లో పర్యటిస్తారు. 3వ రోజు భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో, 4, 5 రోజుల్లో ఇల్లందకుంట, జమ్మికుంట రూరల్, జమ్మికుంట టౌన్, హుజూరాబాద్ రూరల్ మండలాల్లో 6వ రోజు సైదాపూర్, వీణవంక మండలాల్లో యాత్ర చేస్తారు. మార్చి 2 నాటికి హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ప్రజాహిత యాత్రను పూర్తి చేసేలా రూట్ మ్యాప్ రూపొందించారు. మరోవైపు ప్రజాహిత యాత్రను విజయవంతం చేసేందుకు జిల్లా నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.
హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన …
స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న …
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

023338
Total views : 141778

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.