హైదరాబాద్లో అక్రమంగా విక్రయిస్తున్న నిద్రమాత్రలు, దగ్గు సిరప్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. హబీబ్నగర్లో హైదరాబాద్ సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భారీగా మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు సీపీ క్రైమ్స్ శ్రీనివాస్ తెలిపారు. బీదర్ నుంచి భారీ మొత్తంలో ఈ మందులను హైదరాబాద్కు తరలించి, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.ఈ కేసులో మొహమ్మద్ సర్వార్ అలియాస్ రహీమ్, మొహమ్మద్ రబ్బానీ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ మందులను ఎంతమందికి విక్రయించారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని, బీదర్లో కూడా నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.
హైదరాబాద్లో భారీగా మత్తు మందులు పట్టివేత.
31
previous post




Total views : 221094