Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home National ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరో మంత్రికి ఈడీ నోటీసులు

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరో మంత్రికి ఈడీ నోటీసులు

by Satya
Kailash Gahlot

ఢిల్లీ మద్యం పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో ఆప్‌ మరో మంత్రికి ఈడీ తాఖీదులిచ్చింది. సీఎం కేజ్రీవాల్‌(CM Kejriwal) కేబినెట్‌లో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా కైలాశ్‌ గెహ్లాట్‌(Kailash Gahlot)కు నోటీసులు పంపింది. శనివారమే విచారణకు రావాలని అందులో స్పష్టం చేసింది. ఇదే కేసులో కేజ్రీవాల్‌ను ఈ నెల 21న ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గెహ్లాట్‌ ప్రస్తుతం నజఫ్‌గంజ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021-22 ఢిల్లీ మద్యం పాలసీ డ్రాఫ్ట్‌ను రూపొందించిన ప్యానల్‌లో ఆయన సభ్యుడిగా ఉన్నాడు. తన అధికార నివాసాన్ని ఆప్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌చార్జ్‌ విజయ్‌ నాయర్‌ వాడుకోవడానికి అనుమతించాడని, అదేవిధంగా గెహ్లాట్‌ తరచూ ఫోన్‌ నంబర్లు మార్చాడని ఈడీ ఆరోపిస్తున్నది. కాగా, ఇదే కేసులో కేజ్రీవాల్‌ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 1 వరకు ఆయన ఈడీ పరిధిలో ఉండనున్నారు. ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌, ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ జైలులో ఉన్నారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి…


ముగిసిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం.
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని …
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.
ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ …
కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.
హైదరాబాద్ నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కాచిగూడ రైల్వే స్టేషన్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023041
Total views : 140776

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.