Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana మోహన్ బాబు, విష్ణు, మనోజ్ కు నోటీసులు

మోహన్ బాబు, విష్ణు, మనోజ్ కు నోటీసులు

by Rama
మోహన్ బాబు, విష్ణు, మనోజ్ కు నోటీసులు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మంచు కుటుంబ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మోహన్​బాబు, మనోజ్​ మధ్య జరుగుతున్న వివాదం మరింత ముదిరింది. పరస్పర ఫిర్యాదులతో రచ్చకెక్కిన ఈ వ్యవహారం ఘర్షణలతో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈనేపథ్యంలో మోహన్​బాబుతో పాటు తన కుమారులైన మంచు మనోజ్​, విష్ణులకు రాచకొండ సీపీ సుధీర్​ బాబు అదనపు జిల్లా మేజిస్ట్రేట్​ హోదాలో నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. జల్​పల్లిలో జరిగిన దాడి ఘటనపై సీపీ ముగ్గురిని విచారణ చేయనున్నారు. జల్​పల్లిలోని మంచు మోహన్​బాబు ఇంటి వద్ద జరిగిన దాడి ఘటనపై రాచకొండ సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మోహన్​బాబు, మనోజ్​లకు చెందిన తుపాకులను పోలీసులు సీజ్​ చేశారు. గచ్చిబౌలి ఆసుపత్రిలో మోహన్​బాబు చికిత్స పొందుతున్నారు.

మంచు కుటుంబ వివాదం నేపథ్యంలో విదేశాల్లో ఉన్న విష్ణు మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు తిరిగి రావడంతో మోహన్‌బాబు శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లి జల్‌పల్లిలోని నివాసానికి తీసుకొచ్చారు. అప్పటికి మనోజ్‌ అక్కడే ఉన్నారు. వివాదానికి తెరదించేందుకు మోహన్‌బాబు, విష్ణు, మరికొందరు సన్నిహితుల సమక్షంలో మనోజ్‌తో చర్చలు జరిగాయి. అయితే మనోజ్, తన భార్యతో కలిసి మధ్యలోనే బయటకు వచ్చేశారు. ఈ సమయంలో విష్ణు తరఫు బౌన్సర్లు మనోజ్‌ బౌన్సర్లను బలవంతంగా ఇంటి నుంచి బయటకు పంపించారు. దీంతో గేటు దగ్గర కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మనోజ్‌, తాను ఆస్తి కోసం పోరాడటం లేదని, ఇది ఆత్మగౌరవం కోసమని వ్యాఖ్యానించారు. తన తరఫు వారిని కానిస్టేబుళ్లు బెదరగొట్టి ఇంటి నుంచి బయటకు పంపించారని, ఇతరుల అంగరక్షకులను లోపలికి పంపించారని ఆరోపించారు. అనంతరం తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని సాయంత్రం ఇంటెలిజెన్స్‌ డీజీ శివధర్‌రెడ్డి, శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌లకు మనోజ్‌ ఫిర్యాదు చేశారు.

పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో జల్‌పల్లిలోని నివాసానికి మనోజ్‌ తిరిగి చేరుకున్నారు. భద్రతా సిబ్బంది గేట్లు తెరవకపోవడంతో తన సిబ్బందితో కలిసి గేటును గట్టిగా నెట్టి లోపలికి వెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికి చిరిగిన చొక్కాతో బయటకు వచ్చిన మనోజ్‌, బౌన్సర్లు తనపై దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోహన్‌బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు, సహాయకులు గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడిచేశారు. ఓ ఛానెల్‌ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్‌బాబు మైకు లాక్కుని ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో ఓ ఛానల్‌ కెమెరామెన్‌ కింద పడ్డారు. ఈ సంఘటన జరిగినప్పుడు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ గురువారెడ్డి అక్కడే ఉన్నారు. దాడిని నిరసిస్తూ మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. మోహన్‌బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.
    మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉక్కుపాదం మోపింది. వెనెజువెలాకు చెందిన కరుడుగట్టిన డ్రగ్స్‌ గ్యాంగ్‌ ట్రెన్‌ డి ఆరాగ్వాపై చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఆ ముఠా కీలక నేత హెక్టర్‌ రస్తెన్‌ఫోర్డ్‌ గురెరో ఫ్లోర్స్‌ హతమైనట్లు అమెరికా…
  • కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.
    కాకినాడ జిల్లాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో తమ కుమార్తెను యువకుడు ఉరివేసి హత్య చేశాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆందోళన…
  • ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.
    ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తుల సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాలకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలను పనుల నిమిత్తం గ్రామానికి రప్పించిన…
  • కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.
    ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్‌. మాధవ్‌ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
  • అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.
    అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రత్యేక జాబితాలో భారత సంతతికి చెందిన ప్రముఖులు సత్తా చాటారు. అమెరికాలో నివసిస్తున్న విజయవంతమైన 250 మంది వలసదారుల జాబితాలో ఏకంగా 27 మంది భారతీయ మూలాల వ్యక్తులు చోటు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

023183
Total views : 141339

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.