కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో గౌరిదేవి ఉత్సవాల్లో మహిళలతో బహిరంగంగా రికార్డింగ్ డాన్సులు చేయించారు. అధికార పార్టీ నేతల అండతో గ్రామ సచివాలయం ఎదుటే ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి చూసే ప్రయత్నం కూడా చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామ సచివాలయనికి అడ్డంగా భారీ స్టేజ్ లు ఏర్పాటు చేసి మహిళలతో డాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టారంటే అధికార పార్టీ నాయకులు ఎంతకు బరి తెగించారో అర్దం చేసుకోవచ్చు. మహిళల నృత్యాలు చూడటానికి సమీప గ్రామాల ప్రజలు తరలవచ్చారు.
cm jagan
నేడు శ్రీకాకుళం జిల్లాలో ని ఉద్దానం ప్రాంతంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. విశాఖ నుండి హెలికాప్టర్ ద్వారా కంచిలి మండలం మఖరాంపురం చేరుకుని. ఉద్దానం కిడ్నీ వ్యాధులు చెక్ పెట్టేందుకు జల్ జీవన్ మిషన్ ద్వారా 700 కోట్ల రూపాయిలతో నిర్మించిన డాక్టర్. వై. ఎస్. ఆర్ సుజల ధార ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ ని ప్రారంభించనున్న సిఎం. అక్కడ నుండి హెలికాప్టర్ ద్వారా పలాస చేరుకోనున్న ముఖ్యమంత్రి. పలాస లో 74.24 కోట్లతో నిర్మించిన వైస్ఆర్ కిడ్నీ రిసెర్చ్ సెంటర్ ను ప్రారంభించనున్న సిఏం జగన్. వీటితో పాటు పలాస ఇండస్ట్రీయల్ పార్క్, ఆంద్రాయూనివర్శిటి అనుభంద విభాగానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి. అనంతరం రోడ్ షో ద్వారా పలాస రైల్వే గ్రౌండ్ చేరుకుని బహిరంగ సభలో పాల్గోనున్న సిఏం.
ఈరోజు మధ్యాహ్నం ఎమ్మార్వో కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జారీ చేసిన 35/2023 చట్టమును అనుసరించి మరియు గ్రామ రెవెన్యూ రికార్డులు ప్రకారం ఆసైన్మెంట్ చేసిన భూమిని అన్యక్రాంతం చేసే హక్కు తో పాటు సంపూర్ణ భూమి హక్కులు కల్పించి అసైన్డ్ భూములు క్రమబద్ధీకరణ చేసి మరియు డీకేటి భూములను శాశ్వత హక్కు పత్రం కల్పిస్తూ తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో నేడు నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు మండలాలకు సంబంధించి అసైన్డ్ భూములు 8583 ఎకరాలకు గాను,3783 లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి అనంతరం ఎమ్మెల్యే ప్రసంగిస్తూ అసైన్డ్ భూముల విషయంలో వాటిని అమ్ముకునే హక్కు కూడా లబ్ధిదారులకు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అని ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ భూ బదలాయింపు చట్టం-1977 ని సవరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. గత మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా ఇప్పుడు ఆర్డినెన్స్ రూపంలో అది అమలులోకి రావడంతో అసైన్డ్ భూమల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అని ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చే భూముల విషయంలో ఇప్పటి వరకూ కఠిన నిబంధనలు ఉండేవి. ప్రభుత్వం అసైన్ చేసిన భూముల క్రయ విక్రయాలకు అధికారికంగా అవకాశం లేదు. వాటిపై ఎప్పటికైనా వారసులకే హక్కు ఉంటుంది. అందుకే అత్యవసరమైనా వాటిని అమ్ముకోలేరు యజమానులు. ఒకవేళ అమ్మినా, అసైన్డ్ భూములకు రేటు ఉండేది కాదు, న్యాయపరమైన చిక్కులుంటాయనే ఉద్దేశంతో తక్కువ రేటుకే వాటిని కొనేవారు కాదు అని భూములు రిజిస్ట్రేషన్లు కూడా కావు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తోంది. అందులో భాగంగానే ఆర్డినెన్స్ ని తీసుకొచ్చింది అని ప్రభుత్వం భూములు అసైన్ చేసి 20ఏళ్లు దాటితే వాటిని అమ్ముకునే అవకాశాన్ని యజమానులకు కల్పిస్తూ ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అని ఈ నిర్ణయాన్ని కూడా తాజా ఆర్డినెన్స్ లో పేర్కొంది అని ఇలా చిత్తశుద్ధితో పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వ విప్ శాసనసభ్యుల కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, వైస్ఎంపీపీ ధ్వజా రెడ్డి, ఓబులవారిపల్లి మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి, చిట్వేల్ మండల కన్వినర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బారామరాజు, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, సినియర్ నాయకులు ఎల్వి మోహన్, ప్రతాప్ రెడ్డి, రాజారెడ్డి,రెడ్డి, చిట్వేల్ ఎంపీపీ చంద్ర, మరియు సర్పంచులు, రమణ, వినోద్, పెంచల్ రెడ్డి, శైలజ, మండలాల ఎమ్మార్వోలు, లబ్ధిదారులు తదితరులు భారీగా పాల్గొన్నారు.
లంక భూములకు మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పట్టాలు పంపిణీ చేశారు. ఏళ్ళనాటి కల నెరవేరింది అంటు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఐదంమండలాల్లో 1209 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. 19 సొసైటీలకుగాను 793.27ఎకరాలకు గాను 1209 మంది లబ్దిదారులకు లంకపట్టాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వసంతవెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నోఎళ్ళనుండి ఎటువంటి ఆదారం లేకుండా లంకభూములను సాగుచేసుకుంటున్న పెదల కల నెరవేరింది అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు రెవిన్యూ యంత్రాంగం అంతా కష్టపడి ఎలాంటి అవకతవకలు లేకుండా నిబద్ధతతో ఎంక్వయిరి చేసి లబ్దిదారుల ఎంపిక చేశారన్నారు. ఇంకా కొన్ని సొసైటీలో చిన్నచిన్న అవకతవకలు ఉంటే వాటిని సరిచేయడానికి కొద్దిగా సమయం పడుతుంది. త్వరలో వారికి కూడా ఖచ్చితంగా పట్టాలు పంపిణీ చేస్తామ న్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ మాట్లాడుతూ అర్హులైన పేదల లంక భూములకు పట్టాలు పంపిణీ లో స్థానిక రెవెన్యూశాఖ సిబ్బంది చాలా బాగా పనిచేశారన్నారు. పంపిణీ విషయంలో ఏవైనా అనర్హులుగా ఉండి పట్టాలు తీసుకుని ఉంటే నా దృష్పికి తీసురావచ్చని ఆమె అన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పొలాలు, కాల్వలు కలిసిపోయాయి, బంగాళదుంపకి …ఉల్లిపాయకి తేడా తెలియని సీఎం ఎన్నుకున్నాం. సాగు నీటి కాలవ, మురుగు కాల్వ కి తేడా తెలియని ముఖ్యమంత్రి ఉన్నారు. పంటలు నష్టపోతే బీమా నగదు ఇవ్వాలి. 16 మంది రైతులకు మాత్రమే భీమా కట్టారు. ఎకరా మిరప సాగుకు 1.50లక్షలు ఖర్చు అవుతుంది. హుద్ హుద్ తుఫాన్ కు ముందు చేరుకుని బసులోనే ఉన్న. అక్కడ సమస్యలు పరిష్కరించి వచ్చా. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తుఫాన్ ప్రభావం చూపింది. రెండు రోజులు తాను ఆగాను. తాను బాపట్లకు కార్యక్రమం ప్రకటించాక సీఎం నాటకంగా బయలుదేరారు. రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం… వదిలేసింద. పర్చూరులో వైకాపా కార్యకర్త పంట నష్టానికి రూ. 2 లక్షలు ఇచ్చాను. మంచికి…చెడుకు కులం, మతం లేదు. ఇప్పటికి నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కి బాధ్యత ఉందా లేదా…? బాపట్ల లో సీఎం కి ఒక వేదిక వేసి…మ్యాట్లు వేసి పొలం చూసేందుకు వచ్చారు.
పొలం గురించి తెలియని వ్యక్తికి పంటల గురించి ఏమి తెలుస్తుంది. ఈ ప్రభుత్వం వలన లక్షల్లో రైతులు అప్పుల పాలయ్యారు. రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వడానికి సీఎం కి మనసు రాలేదు. పంట నష్టం గురించి కేంద్రాన్ని కూడా సీఎం జగన్ అడిగే పరిస్థితి లేడు. నాలుగు రోజులైనా ఏ పంటలు..ఎంత నష్ట పోయారో చెప్పే ధైర్యం చెప్పలేదు. ఎంత పంట నష్ట పరిహారం ఇస్తానో కూడా సీఎం జగన్ చెప్పలేదు. రైతులు గట్టిగా అడిగితే కేసులు పెడతారు. రైతు కష్టంలో వున్నప్పుడు దుర్మాగమైన పరిస్థితి తెచ్చారు. పంటలకు భీమా చేసి ఉంటే నష్టం పరిహారం ఇచ్చే అవకాశం ఉండేది. తాను ప్రస్తుతం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న. రైతుకు ధైర్యం చెప్పేందుకు వచ్చా అని వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయ చేయకఊతే 3 నెలలో వైకాపాను బంగాళాఖాతంలో కలుపుదాం. ముఖ్యమంత్రికి అల్టిమేట్ ఇస్తున్న. పంటల నష్టం పై కేంద్రానికి కూడా లేఖ రాస్తాను. రాష్టంలో ఎంత పంట నష్టపోయారో ఆన్ లైన్ లో ఉంచాలి. నష్ట పరిహారం వైకాపా దొంగలకు ఇస్తే.. సంగతి తెలుస్తాం. నిజమైన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలి. రైతు ద్రోహి జగన్ మోహన్ రెడ్డి.
విజయవాడ దుర్గగుడికి చేరుకున్న సీఎం జగన్. పూర్ణకుంభం స్వాగతం పలికిన వేద పండితులు,ఆలయ అధికారులు,ప్రజాప్రతినిధులు.
అలయప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన సీఎం జగన్. 216 కోట్లతో చేపడుతున్న పలు అబ్బివృద్ది పనులకు సీఎం శంఖుస్థాపన.
70 కోట్ల ప్రభుత్వ నిధులు,131 కోట్ల ఆలయ నిధులు,5 కోట్ల దాతల నిధులు,33 కోట్ల ప్రవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు. ప్రసాదం పోటు,అన్నప్రసాద భవనం,ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్,కేశఖండన శాల నిర్మాణాలు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన విద్యుత్ ను పునరుద్ధరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్ప్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా తుపాను ఎఫెక్ట్, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు. ప్రతి రైతునూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సబ్సిడీపై విత్తనాల సరఫరాకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు.
చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30 లక్షల సహాయాన్ని అందిస్తామన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందిని హామీ ఇచ్చారు. పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన విద్యుత్ ను పునరుద్ధరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్ప్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా తుపాను ఎఫెక్ట్, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు. ప్రతి రైతునూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సబ్సిడీపై విత్తనాల సరఫరాకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30 లక్షల సహాయాన్ని అందిస్తామన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందిని హామీ ఇచ్చారు. పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు.
Read Also..
Read Also..
పత్తిపాడు నియోజకవర్గంలో కాకుమాను, వట్టిచెరుకూరు మండలంలో వేలాది ఎకరాల్లో వరి పైరు వేయటం జరిగిందని, పంట చేతికి వచ్చే సమయంలో తుపాను రావటంతో రైతు పూర్తిగా నష్టపోయారు. మెట్టపైలు అయినా సెనగ, పొగకు, మిర్చి రైతు పూర్తిగా నష్టపోయారని తెలిపారు. తుఫాను గురించి ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించిన ప్రభుత్వం నిమ్మకు నీరేతిన్నట్టు వ్యవహరించి రైతు జీవితాలతో ఆడుకుందని దుయ్యబెట్టారు. గత ప్రభుత్వంలో వెంటనే వ్యవసాయ అధికారి ను గ్రామాల్లోకి పంపించి నష్టం నివారణ ఎక్కువ జరక్కుండా తగు చర్యలు తీసుకున్నామని, కానీ నేటి ప్రభుత్వం అలాంటి చర్యలు ఏమి తీసుకోకపోగా కనీసం నష్టాన్ని అంచనా వేసే కార్యక్రమం కూడా చేయటం లేదని ఎద్దేవా చేశారు. వదిలేసిన రైతులు సుమారు 50 వేల రూపాయలు నష్టపోయినట్టు, మెత్త పైడ్ చేసిన ఒక్కొక్క రైతు సుమారు లక్ష రూపాయలు నష్టపోయినట్టు రైతులు తెలిపారు. వారికి వెంటనే నష్టపరిహారం కింద వడివేసిన రైతులకు సుమారు 40000 రూపాయలు, మెట్ట పైరు వేసిన రైతులకు 70 వేల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో వరంటీల్ ద్వారా నిజమైన నష్టపోయిన రైతులకు కాకుండా తమ పార్టీ కార్యకర్తలకు నష్టం నివారణ నగదు వెళ్లిందని, కానీ నేడు అలా జరిగితే రైతులతో కలిసి రోడ్డెక్కి ధర్నాలు రాస్తారోకో చెయ్యిల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లాలో వరి పంట అధికంగా నీట మునిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు.
తుపాను నష్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం వీక్షణ సమావేశం ద్వారా సమీక్షించారు. సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. ముందుగా జిల్లాలో పరిస్థితిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తుపాను ప్రభావం ఉన్నప్పటికీ జిల్లాలో భారీ నష్టం జరగకుండా సమగ్ర ప్రణాళికతో చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ వివరించారు. 25 మండలాలలో వర్షం కురిసిందని, 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందన్నారు.
ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. కేవలం రెండోచోట్ల చిన్న ప్రమాదాలు జరిగాయని, రెండు గోడలు కూలి నాలుగు గొర్రెలు చనిపోయాయన్నారు. 32 ఇళ్లు దెబ్బ తిన్నాయని, 37 గ్రామాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. 350 స్తంభాలు పడిపోయాయని, రాత్రి రెండున్నర గంటల వరకు విద్యుత్ శాఖ అధికారులు రోడ్లమీదనే ఉండి విద్యుత్ సరఫరా చేసినట్లు వివరించారు. ప్రస్తుతం 90 శాతంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. పర్చూరు సబ్ స్టేషన్ దెబ్బతినడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పనులు జరుగుతున్నాయన్నారు. అధికంగా సూర్యలంక, ఓడరేవు ప్రాంతాలలో వారిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు.
జిల్లాలో 74 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, 1,319 మందికి ఆశ్రయం కల్పించామని కలెక్టర్ రంజిత్ బాషా చెప్పారు.
2,500 మందికి భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నామని, బుధవారం సాయంత్రానికి వారిని ఇళ్లకు పంపుతామన్నారు. పునరావాస కేంద్రాల నుంచి వెళ్తున్న వారికి ప్రభుత్వం నిర్దేశించినట్లు ఐదు వస్తువులు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. 70 వేల హెక్టార్లలో ధాన్యం నీట మునిగిందని, పొలాల్లో నీరు నిల్వ లేకుండా దిగువకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఉపాధి హామీ పథకం కూలీల ద్వారా ఈ పనులు చేపట్టామన్నారు. ప్రతి మండలానికి ప్రోక్లైన్లు, జెసిబి యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించామని, రూ. 25 లక్షలు నిధులు ఇచ్చామన్నారు. బాపట్లలో అధికంగా పండే ధాన్యం, శనగ, అరటి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయన్నారు. పంటల నష్టం అంచనాల సర్వే పనులు మొదలయ్యాయన్నారు. కారంచేడు, మార్టూరు, పర్చూరు మండలాలలో పంట కాలువల ద్వారా రహదారులకు అంతరాయం ఏర్పడగా వాటిని పునరుద్ధరించామన్నారు. తీర ప్రాంతంలో వలలు, బోట్లు దెబ్బతిన్నాయన్నారు. ఇప్పటికే 93 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. గేదెలకు అంటూ వ్యాధులు రాకుండా టీకాల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామన్నారు.తుపాను నష్టంపై మూడు రోజుల్లో అంచనాల సర్వే పూర్తి చేసి నివేదిక పంపుతామన్నారు.





Total views : 141223