అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల మెయిన్ రోడ్ ప్రక్కన బూరగాయల శ్రీనివాస్ అనే వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే బూరగాయల శ్రీనివాస్ అనే వ్యక్తికి ముగ్గురు సోదరులు అయితే ఒక సోదరుడు దత్తతకు వెళ్లిపోగా ముగ్గురు అన్నదమ్ములు ఒకే గృహంలో నివసిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి శ్రీనివాస్ కు వివాహం కాగా భార్య ఇదివరకే వదలిపెట్టి వెళ్ళిపోయింది. అయితే ముగ్గురు అన్నదమ్ములు తల్లి తో పాటు ఉంటున్నారు. వీరికి గతంలో ఇంటి ప్రక్కనే కర్రల మిల్లు ఉండేది ప్రస్తుతం అది శిదిలం అయిపోయింది. సోమశేఖర్ కు శ్రీనివాస్ ఇద్దరి అన్నదమ్ములకు మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే సోమశేఖర్ అన్న శ్రీనివాస్ ను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. కొత్తపేట డిఎస్పీ కే.వి.రమణ, గన్నవరం సిఐ ప్రశాంత్ కుమార్, స్థానిక ఎస్.ఐ జ్వాలా సాగర్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.
murder
నిన్న కాంచీపురంలో ఒక రైడర్ను ఆ ప్రాంతంలో నరికి చంపారు. ఈ హత్యకేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. రఘు, అసన్ అలియాస్ కరుపు అసన్.. వారిద్దరూ కాంచీపురం కొత్త రైల్వే బ్రిడ్జి దగ్గర దాక్కున్న సమయంలో పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడి చేశారు. స్పెషల్ అసిస్టెంట్ పోలీస్ ఆఫీసర్ రామలింగం, కానిస్టేబుల్ శశికుమార్లపై దుండగులు కొడవళ్లతో దాడి చేశారు. ఆత్మరక్షణ కోసం అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ సుధాకర్ కాల్పులు జరపడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో మహిళా దారుణ హత్యకు గురైంది. సూర్యనారాయణ అనే వ్యక్తి భార్య రామలక్ష్మిను కత్తితో విచక్షణ రహితంగా పొడిచి చంపాడు. సూర్యనారాయణ ను అడ్డుకోబోయిన రామలక్ష్మి తండ్రి వెంకన్నను గాయపరచడంతో, ఎన్టీఆర్ కాలనీలో కలకలం చోటుచేసుకుంది. గణపవరం చెందిన సూర్యనారాయణతో, రామలక్ష్మికు ఐదేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో విభేదాలు కారణంగా నాలుగేళ్ల కుమారుడుతో కలిసి ఎన్టీఆర్ కాలనీలోని పుట్టింట్లో రామలక్ష్మి ఉంటుంది. పెద్ద మనుషుల సమక్షంలో వివాదాన్ని సరిచేసుకుందామని ఆదివారం గుడివాడ రావాల్సిందిగా రామలక్ష్మి కుటుంబ సభ్యులు సూర్యనారాయణకు కబురు పెట్టారు. ఈ క్రమంలో ఇంట్లో పనులు చేసుకుంటున్నా రామలక్ష్మిను, భర్త సూర్యనారాయణ విచక్షణ రహితంగా పొడిచి చంపి పరారయ్యాడు. అల్లుడి చేతిలో రామలక్ష్మి తండ్రి వెంకన్న గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసిన గుడివాడ వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈనెల 15న చిగురువాడ వైయస్సార్ కాలనీలో గోవింద్ అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రేమికులు..ఇరువురికి అడ్డుగా ఉన్న భర్త గోవిందును పథకం ప్రకారం హత్య ప్రియుడితో కలిసి హత్య చేశారు. అనుమానాస్పదన మృతి గాఆనాడు కేసు నమోదు చేసాం. పోలీసుల విచారణలో సోంపల్లి మానస, పలాసి సింహాద్రి ఇరువురు గొంతు నులిని హత్య చేసినట్లు వెల్లడికావడంతో హత్యా నేరం నమోదు చేశారు. మూడు సంవత్సరాల నుండి ప్రేమికులుగా ఉన్న వీరు ప్రేమను వదులుకోలేక, పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడంతో దాదాపు నాలుగు నెలల పాటు కాలయాపన చేసారు. తిరుపతి రూరల్ పరిధిలోని రేణిగుంట – చంద్రగిరి 150 బైపాస్ రోడ్డులో తచ్చాడుతుండగా అరెస్టు చేసాం. ఇరువురి పై హత్యా నేరం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నాం. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ యశ్వంత్ వెల్లడించారు.
Read Also..
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం సాయి నగర్, కెనరా బ్యాంకు వెనుక వైపు శుక్రవారం ఓ మహిళ హత్యకు గురైన విషయం విధితమే, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి కేసును 48 గంటల్లో నిందితున్ని పట్టుకున్నారు, నేడు హత్యకు గల కారణాలను పోలీసులు వివరించారు.. అనంతపురం జిల్లా గుంతకల్ టౌన్ కు చెందిన లక్ష్మీ 57 సంవత్సరాలు, గత పది సంవత్సరాలుగా పలమనేరు గంగవరం పరిధిలో స్థానికంగా ప్లాస్టిక్ బాటిల్స్ కవర్స్ ఏరుకుంటూ వాటిని గుజిరి షాపుల్లో అమ్ముకొని జీవనం సాగించేది, ఈ నేపథ్యంలో పలమనేరు మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన
మేస్త్రి మంజునాథతో పరిచయమైంది, ఇద్దరికీ మద్యం తాగే అలవాటు ఉన్నందువలన ఇద్దరు కలిసి మద్యం సేవించి, గంగవరం కెనరా బ్యాంక్ వెనుక నూతనంగా నిర్మిస్తున్న ఇంటిలో శారీరకంగా కలిశారు, నానా రకాలుగా సెక్స్ చేయాల్సిందిగా లక్ష్మిని మంజునాథ్ కోరాడని ఆమె ఒప్పుకోకపోవడంతో అక్కడే ఉన్న సారవ కొయ్యతో మొఖం పగలగొట్టి, పక్కనే ఉన్న డ్రమ్ములో తలకిందులుగా పడవేసి వెళ్లిపోయాడని, ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని అధికారులు తెలిపారు, కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ కృష్ణమోహన్ ఎస్ఐ ప్రతాప్ ను, మరియు పోలీసు సిబ్బంది ని డిఎస్పి సుధాకర్ రెడ్డి అభినందించారు.
Read Also..
నాగాయలంక మండలం భావదేవరపల్లిలో కొడుకు తండ్రిని హత్య చేశాడు. గ్రామానికి చెందిన 25 ఏళ్ళ బండే పవన్ కళ్యాణ్ తన తండ్రి బండే హరిమోహనరావు (50) ని హత్య చేసి మృత దేహాన్ని మంచంపై ఉంచి తగలబెట్టాడు. శుక్రవారం రాత్రి ఏడున్నర సమయంలో చంపి మంచం మీద వేసి నిప్పంటించిచినట్లు సమాచారం, చుట్టుపక్కల వారు చూసి మంటను అదుపు వేశారు. ఆస్తి తగాదాలతో ఈ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అవివాహితుడైన పవన్ కళ్యాణ్ తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అవనిగడ్డ Ci ఎల్ .రమేష్ మాట్లాడుతూ ముద్దాయికి గతంలో కూడా నేర చరిత్ర ఉందని తెలిపారు. నిన్న రాత్రి డీజిల్ పోసి తగలబెట్టాడని ప్రాథమిక నిర్ధారణ లో తెలిపారు. ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
మద్యం మత్తులో ముగ్గురు యువకులు రాకేష్ అనే వ్యక్తి ని హత్య చేశారని వరంగల్ ఏసిపి బోనాల కిషన్ తెలిపారు. వరంగల్ నగరంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం ముందు ఈనెల 5వ తేదీన రాత్రి చెందిన రాకేష్ అనే వ్యక్తి మరో మహిళతో వంటలు చేసేందుకు తొర్రూరు వెళ్తున్న క్రమంలో వరంగల్ గరీబ్ నగర్ కు చెందిన ముగ్గురు యువకులు శ్రీధర్, బన్నీ, ఇస్లావత్ ప్రవీణ్ రాత్రి ఆటోలో అటుగా వెళ్లి రాకేష్ తో ఉన్న మహిళను లైంగికంగా వేధించారు. దీంతో రాకేష్ ప్రతిఘటించడంతో ముగ్గురు యువకులు అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిని గమనించిన స్థానికులు రాకేష్ ను చికిత్స నిమిత్తం ఎంజీఎం హాస్పిటల్ కి తరలించారు. రాకేష్ 13వ తేది రాత్రి మృతి చెందాడు. రాకేష్ హత్యకు కారణమైన ముగ్గురిని అరెస్ట్ చేశామని వారి నుండి హత్యకు ఉపయోగించిన రాళ్లు సేకరించామని వారిని కోర్టులో హాజరు పర్చనున్నట్లు వరంగల్ ఏసిపి బోనాల కిషన్ తెలిపారు.
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబ్బారెడ్డి నగర్ లో అర్ధరాత్రి ఘటన ఓ చోటుచేసుకుంది. మృతుడు రౌడీ షీటర్ కిషోర్ గా పోలీసులు గుర్తించారు. హత్యకు కారణం తోటి స్నేహితుల మధ్య జరిగిన వివాదమే.., కత్తితో పొడిచి హతమార్చినట్టు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న ఈస్ట్ సి ఐ మహేశ్వర్ రెడ్డి అలిపిరి సిఐ అబ్బన్న బృందంతో విచారణ ముమ్మరం చేశారు.
Read Also..
** నిందితుల అరెస్టు వివరాలు:
- షేక్ మహమ్మద్ రఫీ, వయస్సు 33 సం., చంద్రబాబు కొట్టాలు, అనంతపురము
- షేక్ కరిష్మా, వయస్సు 28 సం. లు, వినాయకనగర్, అనంతపురము
- షేక గౌసియా, వయస్సు 30 సం లు, చంద్రబాబు కొట్టాలు, అనంతపురము
- షేక్ సిద్దిక్ అలీ, వయస్సు 34 సం లు, వినాయకనగర్, అనంతపురము
- గుజ్జల శివ కుమార్ వయస్సు 35 సం తండ్రి నారాయణ స్వామి సంగాల గ్రామం, బతలపల్లి మండలం, శ్రీసత్యసాయి జిల్లా
- గుజ్జల చంద్ర శేఖర్, వయస్సు 28 సం లు, నార్సింపల్లి గ్రామం, తాడిమర్రి మండలం, శ్రీసత్యసాయి జిల్లా
- గుజ్జల హరి, వయస్సు 26 సం లు, సంగాల గ్రామం, బతలపల్లి మండలం, శ్రీసత్యసాయి జిల్లా
- గుజ్జల కృష్ణ, వయస్సు 32 సం., నార్సింపల్లి గ్రామం, తాడిమర్రి మండలం, శ్రీసత్యసాయి జిల్లా
- మంగళ కేసన్నగారి రాము @శివరాం, వయస్సు 32 సం లు తండ్రి యల్లప్ప, తాడిమర్రి మండలం, ప్రస్తుతము పార్థసారధి నగర్, ధర్మవరం పట్టణం, శ్రీసత్యసాయి జిల్లా
- షాహీనా , వయస్సు 20 సం., రాజీవ్ కాలనీ, అనంతపురం
- కరణం శ్రీనివాస్ ఫణి, వయస్సు 28 సం., మూడవ రోడ్డు, అనంతపురం ( స్వగ్రామం శెట్టూరు మండలం ములకలేడు)
** స్వాధీనం చేసుకున్నవి:
- కారు, 2 మోటార్ సైకిళ్ళు, లాప్ టాప్, 5 మొబైల్ ఫోన్ లు, రూ. 35 వేలు నగదు
** మిస్సింగ్ కేసు నమోదు: 27-11-2023 తేదీన బెంగళూరుకు వెళ్లిన తన కుమారుడు మహమ్మద్ అలీ ఇంతవరకు తిరిగి ఇంటికి రాలేదని, కన్పించడం లేదంటూ స్థానిక మున్నానగర్ కు చెందిన పాపాసాబ్ ఇబ్రహీం అనంతపురం ఒన్ టౌన్ పోలీసులకు ఈనెల 1 వ తేదీన ఫిర్యాదు చేశాడు. వెంటనే ఈయన ఫిర్యాదు మేరకు సి.ఐ రెడ్డెప్ప ఆధ్వర్యంలో పోలీసులు క్రైం నంబర్ 385/2023 మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.
** అరెస్టు ఇలా : జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ IPS ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ జి.ప్రసాదరెడ్డి పర్యవేక్షణలో సి.ఐ వి.రెడ్డెప్ప, ఎస్ ఐ లు సుధాకర్ యాదవ్, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఏఎస్సై నాగేశ్వరరెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు భాస్కర్ , ఫరూక్ , అశ్వర్థ, కానిస్టేబుళ్లు మహమ్మద్ , ఆసిఫ్ , దాసు, మురళీ, మోహన్ అమీర్ లు బృందంగా ఏర్పడి పక్కా రాబడిన సమాచారంతో తొలుత ఇందులో ప్రధాన నిందితుడైన మహమ్మద్ రఫీక్ ను స్థానిక వినాయకనగర్లోని సిద్ధిక్ ఫర్నీచర్ దుకాణం వద్ద అరెస్టు చేశారు. ఇతనిని విచారించగా… ధర్మవరం సుఫారీ గ్యాంగుతో కలసి మహమ్మద్ అలీని చంపి కాల్చేసినట్లు చెప్పాడు. ఈ వివరాలు ఆధారంగా హత్య కేసుగా నమోదు చేశారు. మిగితా నిందితుల్లో షేక్ కరిష్మా, షేక్ గౌసియా, షేక్ సిద్ధిక్ అలీని స్థానిక మిర్చీ యార్డు వద్ద మరియు మిగితా ఐదుగురు నిందితులను బత్తలపల్లిలో అదుపులో తీసుకుని విచారించాక అరెస్టు చేశారు.
** నేపథ్యం :
ప్రస్తుతం అరెస్టయిన నిందితుల్లో షేక్ మహమ్మద్ రఫీ ముఖ్యుడు. ఇతను, హత్యకు గురైన మహమ్మద్ అలీ మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం, పాల్కాన్ ఎక్స్పోర్ట్ & ఇంపోర్ట్ ట్రేడింగ్ కంపెనీ… ఇలా రకరకాల వ్యాపారాలు కలిసి చేశారు. ఈ వ్యాపారాలలో ఇద్దరూ రూ. లక్షల్లో నష్టపోయారు. ఇందుకు కారణం నీవంటే నీవేనంటూ ఒకరిపై ఒకరు నెట్టుకోవడంతో స్నేహితుల మధ్య చిన్నగ మనస్పర్థలు మొదలయ్యాయి. వ్యాపారాలలో నష్టపోయిన డబ్బును చెల్లించాలని తరుచూ అడిగేవాడు. దీనికితోడు మహమ్మద్ అలీ తరుచూ మహమ్మద్ రఫీ ఇంటికి వెళ్లడం… కుటుంబ సభ్యులతో ప్రవర్తించే తీరుపై కూడా షేక్ మహమ్మద్ రఫీ కు సరిపోయేదికాదు. ఇతనిని తొలగించుకుంటే వ్యాపారాలలో నష్టపోయిన డబ్బు కట్టే పని ఉండదు. పైగా తన ఇంటికి వచ్చేది ఉండదని భావించి ఎలాగైనా కడతేర్చాలని నిశ్చయించుకున్నాడు.
ఈక్రమంలో తన స్నేహితుడైన మంగళ కేసన్నగారి రాము @శివరాంతో చర్చించి సహాయం కోరాడు. దీనికి అంగీకరించిన శివరాం తనకు బాగా తెలిసిన సుఫారీ గ్యాంగును పంపుతానని రూ. 50 వేలు అడ్వాన్సు కింద తీసుకుని గుజ్జల శివ కుమార్, గుజ్జల చంద్ర శేఖర్, గుజ్జల హరి, గుజ్జల కృష్ణలను 27-11-2023 న అనంతపురంకు పంపాడు. ఈ నలుగురు మరియు మహమ్మద్ రఫీక్ లు కలసి మహమ్మద్ అలీని తన భావ అయిన షేక్ సిద్ధిక్ అలీకి చెందిన ఫర్నీచర్ గోడౌన్ కు పిలిపించారు. మహమ్మద్ అలీని బాగా కొట్టి తర్వాత చేతులు కాళ్లు కట్టేసి నోరు, ముక్కుకు ప్లాస్టర్ అతికించి ధర్మవరం నుండీ వచ్చిన నలుగురు నిందితులు వెళ్లిపోయారు. ఆతర్వాత అతను చనిపోయాడు. ఇది గుర్తించిన మహమ్మద్ రఫీ తన భావ అయిన షేక్ సిద్ధిక్ అలీకి విషయం తెలియజేయడం… ఇతని ద్వారా కరిష్మా కూడా హత్యాస్థలానికి చేరుకుంది.
** శవాన్ని కారులో తరలించి… ఆనవాళ్లు లేకుండా చేయడంలో విఫలం చెంది…
దృశ్యం సినిమా తరహాలో హత్య జరిగిన మరియు శవం ఆనవాళ్లు లేకుండా చేయాలని భావించాడు. మహమ్మద్ అలీ శవాన్ని కారులో తీసికెళ్లి కారు సహా శవాన్ని గిద్దలూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పడేయాలని మహమ్మద్ రఫీక్, కరిష్మాలు కారులో అదే రోజు రాత్రి బయల్దేరారు. అనంతపురం నుండీ తాడిపత్రి, బుగ్గ, జమ్ములమడుగు మీదుగా ప్రొద్దుటూరు వెళ్లగానే శవాన్ని తరలిస్తున్న సదరు కారు అనుకున్న స్థాయిలో పని చేయలేదు. అక్కడి నుండీ తిరిగి అనంతపురం బయల్దేరారు. శింగనమల మండలం శివపురం వద్దకు రాగానే ఆ కారు పని చేయకుండా ఆగిపోయింది. చుట్టు పక్కల వాళ్లు వచ్చి సహాయపడేందుకు కారును లాగారు. అయినా పని చేయలేదు. ఆసందర్భంగా కారు వెనుక సీటులో ఉన్న శవం ఎవరిదని స్థానికులు అడుగగా... తమ సోదరుడే చనిపోయాడని నమ్మించారు. కడకు అంబులెన్స్ తెప్పించి అందులో శవాన్ని ఉంచి అనంతపురంలోని నారాయణపురం ఇందిరమ్మ కాలనీలో మహమ్మద్ రఫీక్ నిర్మిస్తున్న కొత్త ఇంటికి వెళ్లారు. అప్పటికే చాప, దుప్పటి తెప్పించి శవం కనపడకుండా కప్పి ఆ ఇంట్లో ఉంచారు. చుట్టు పక్కల వారిని కూడా నమ్మించారు. తమకు అతి దగ్గర బంధువు చనిపోయాడని... కుష్టు వ్యాధి ఉండటంతో అక్కడికి తీసుకొచ్చామని నమ్మించారు. 28-11-2023 అర్ధరాత్రి దాటాక ఆ శవాన్ని నారాయణపురం సమీపంలోని శ్మశాన వాటికకు తీసికెళ్లి పెట్రోలు పోసి ఆనవాళ్లు లేకుండా కాల్చినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. ఈ హత్యకు సహకరించడం మరియు కారును దాచడంలో షాహీనా, కరణం శ్రీనివాస్ ఫణీల పాత్ర ఉన్నట్లు విచారణలో తేలింది.
** ప్రశంస : ఎలాంటి ఆధారాలు లేకపోయినా యువకుడి మిస్సింగు కాదు హత్యేనని తేల్చి 11 మందిని అరెస్టు చేసిన ఒన్ టౌన్ సి.ఐ వి.రెడ్డెప్ప, ఎస్సైలు సుధాకర్ యాదవ్, వెంకటేశ్వర్లు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ IPS అభినందించారు.
Read Also..
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ ఎర్రంపేటలో శనివారం రాత్రి ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గజేంద్రకుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉన్న శ్రీకాంత్ (38) ప్రియాంక (30) సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమె భర్త దుర్గాప్రసాద్ (పండు) చూశాడు. కోపోద్రిక్తుడైన ఆయన ఇనుప రాడ్డుతో ఇద్దరిని బలంగా కొట్టాడు. శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రియాంకను చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.





Total views : 141179